Monday 28 January 2013

జాతీయ జెండాను తిరగేసిన..........

జాతీయ జెండాను తిరగేసిన ఆంధ్రజ్యోతి సిబ్బంది

 


ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ టివి ల అధినేత, పాత్రకేయుడు రాధాకృష్ణ తన కార్యాలయంలో రిపబ్లిక్ డే జాతీయపతాకావిష్కరణలో అసహనాన్ని కోపాన్ని దాచుకోలేకపోయారు. సొంత టివి ప్రత్యక్ష ప్రసారంలోనే ఆయన చికాకును వేలాదిమందిప్రేక్షకులు చూసేశారు. ఉత్సాహంగా జెండా తాడులాగగానే పచ్చరంగు పైన ఎర్రరంగు కింద కనబడి జెండాను తల్లకిందులుగా వేలాడదీసినట్టు బయటపడింది. ఇదే రాధాకృష్ణగారి అసహనానికి మూలం. జెండాను కిందికి దించిన సెక్యూరిటి ఉద్యోగి వెర్రి నవ్వు కూడా ఆయనకు చిర్రెత్తుకు రావడానికి ఒక కారణం కావచ్చు.

ఇలాంటి పొరపాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలో జరిగినా మీడియా రోజంతా అదే దృశ్యాలు చూపిస్తూ నిర్వాహకుల్ని అదేపనిగా అవమానిస్తూవుంటుంది. ఇపుడు ఆదేస్ధితి ఓ మీడియా అధినేతకు ఎదురైంది.
ప్రత్యక్ష ప్రసారం (ఒక్కోసారి)ఎంత ఇబ్బందికరమో ఆయనకు అనుభవమై వుంటుంది. పొరపాటు ఎవరికైనా తప్పదు. దానికి ఏవేవో కారణాలు ఆపాదించి వ్యాఖ్యానాలతో హింసించడం ఎంత తొందరపాటో ఎంత బాధ్యతా రాహిత్యమో కూడా ఆయనకి అర్ధమై వుండాలి.
ఎంతో ప్రాముఖ్యమున్న విషయానికే ఉపయోగించవలసిన ప్రత్యక్ష ప్రసారాన్ని పనిలో పనిగా సొంతానికి వాడేసుకోవడం సరి కాదని కూడా ఆయనకు అవగతమై వుండాలి

దేశభక్తి ఒక స్ఫూర్తి అందుకు జెండా పండుగల వంటివి ప్రత్యక్ష రూపాలు. అసలు స్ఫూర్తే లేకుండా పండగలు చేస్తే జెండాలు తల్లకిందులవ్వడంలో ఆశ్చర్యంలేదు. స్ఫూర్తినింపే పని అపారమైన సంఖ్యలో ఉద్యోగులున్న ప్రభుత్వం వల్లకాదు. కొద్ది మందే సిబ్బంది వుండే ప్రతి సంస్ధలోనూ యాజమాన్యాలు పూనుకుంటే సాధ్యమే

Tuesday 22 January 2013

ధర్మానకి ఏది దారి?



దిక్కుతోచని  స్థితిలో  ధర్మాన ప్రసాదరావు 
తాజాగా వాన్‌పిక్ కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంటూ..సిబిఐ కోర్టు తీర్పునివ్వడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారు.


వాన్‌పిక్ కేసులో సీబీఐ గత ఏడాది ఆగస్టు 13న దాఖలు చేసిన నాలుగో చార్జిషీట్‌లో ధర్మాన ప్రసాదరావును ఆరో నిందితునిగా చేర్చింది. తర్వాత ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆగస్టు 14 న ముఖ్యమంత్రికి లేఖను అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి చాలాకాలం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజీనామా చేసినప్పటి నుంచి ధర్మాన విధులకు హాజరుకావడం లేదు. ఆ శాఖకు సంబంధించిన ఫైళ్లన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

సీఎం తన రాజీనామా ఆమోదించనప్పటికీ తాను మంత్రిగా లేనని, కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నానని ధర్మాన పలు సందర్భాల్లో ప్రకటించారు. ఇదిలా ఉండగా సుమారు రెండు నెలల క్రితం ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర కేబినె ట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిప్పిపంపడంతో ప్రభుత్వం ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితిలో ఉంది.

తాజాగా వాన్‌పిక్ కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంటూ.. అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై అభియోగాలను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడంతో ప్రభుత్వం మరోసారి ఇరకాటంలో పడింది. తాజా పరిణామాలతో ధర్మాన రాజీనామా వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇలావుండగా.. తొలుత ధర్మాన ప్యాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి కోరిన సీబీఐ, ఆ తర్వాత అనూహ్యంగా ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ కోర్టును ఆశ్రయించింది. సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించడంతో ధర్మాన రాజీనామా మరోసారి చర్చనీయాంశమైంది.

తాజాగా కోర్టు ధర్మానపై అభియోగాలను విచారణకు స్వీకరించడంతో సీఎం ఆయన రాజీనామాను ఆమోదిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మాన ప్రాసిక్యూషన్ కొనసాగినా ఆయన సాంకేతికంగా పదవిలో కొనసాగేందుకు ఇబ్బందులు లేనందున రాజీనామాను యథాతథంగా పెండింగ్‌లోనే పెట్టొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసినందునే ఆయన రాజీనామాను ఆమోదించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి పలుమార్లు చెప్పుకొచ్చారు. ఆ విధంగా సాంకేతికాంశాలను పరిగణనలోకి తీసుకుంటే ధర్మాన రాజీనామా లేఖపై కిరణ్‌కుమార్‌రెడ్డి మరికొన్నాళ్లు వేచిచూసే అవకాశముందని చెబుతున్నారు. మరోపక్క ధర్మాన సీబీఐ కోర్టును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ధర్మానకి ఏది దారి?


మంత్రి ధర్మాన ప్రసాదరావు భయపడినంతా అయ్యింది. ఆయన కేసు విచారణ బోనెక్కింది. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్‌లో మిణుకుమిణుకుమన్న ఆశలు ఆవిరైపోయాయి. ‘ఆ.. మాకేం భయం. సోనియా నుంచి సీఎం కిరణ్ వరకు అంతా అండగా ఉన్నారు’ అని ఇప్పటివరకు డాంభికాలు పలికిన వారంతా తాజా పరిణామాలతో నీరుగారిపోయారు. మంత్రిని విచారించేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడం జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేపింది. పార్టీ శ్రేణుల్లో కలవరం.. ఆగ్రహం సమపాళ్లలో పెల్లుబికాయి. నమ్ముకున్నవారిని పార్టీ నట్టేట ముంచేస్తోందని కార్యకర్తలు మండిపడుతున్నారు.
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టైంది శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పరిస్థితి. అసలే రోజురోజుకూ ప్రాభవం కోల్పోతున్న ఆ పార్టీ మంత్రి ధర్మాన వ్యవహారంతో మరింతగా మసకబారనుంది. జిల్లా వ్యాప్తంగా కాం గ్రెస్ కార్యకర్త ల్లో పట్టున్న నేత మంత్రి ధర్మానే. 2009 నుంచి శత్రుచర్ల విజయరామరాజు మంత్రిగా ఉన్నప్పటికీ, జిల్లా కాంగ్రెస్‌లో ఎవరేమిటో ఆయనకు ఇప్పటికీ తెలీదు. ఇక ఏడాది క్రితం మంత్రి అయిన కోండ్రు మురళీగానీ, తాజాగా కేంద్రమంత్రి అయిన కృపారాణిగానీ జిల్లావ్యాప్తంగా పట్టు సాధించలేకపోయారు. వారిద్దరి రాజకీయ వ్యూహరచన సామర్థ్యంపైనా కార్యకర్తలకు నమ్మకం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ఏకైక పెద్ద దిక్కు మంత్రి ధర్మానే. ఇప్పుడు ఆయనపైనే విచారణకు సీబీఐ కోర్టు అనుమతింది. దీంతో మంత్రి స్వయంగా చిక్కుల్లో పడ గా.. ఆయన్నే నమ్ముకున్న కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు ఇది గ్రహపాటుగా మారింది. సీబీఐ కేసు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనకు అండగా ఉన్నాయన్న ఆశతో ఉన్న మంత్రి, కార్యకర్తలకు సైతం అదే చెబుతూ వచ్చారు. పార్టీ అధిష్టానంపై నమ్మకం లేకపోయినా ధర్మాన చెప్పడంతో ఇప్పటివరకు కాస్త ఆశతో ఉన్న కార్యకర్తలు తాజా పరిణామాల నేపథ్యంలో నిసృ్పహతో కుంగిపోయారు.

అధిష్టానం తీరుతోనే ఈ దుస్థితి
సీబీఐ కేసు విషయంలో పార్టీ అధిష్టానం తీరుపై కాంగ్రెస్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి ధర్మానకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ధర్మాన విచారణకు అనుమతివ్వకూడదన్న మంత్రివర్గ సహచరుల ఒత్తిడితో సీఎం కిరణ్ అయిష్టంగానే అంగీకరించారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే మంత్రి మండలి తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించిన తరువాత కిరణ్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేశారని అంటున్నారు. తద్వారా సీబీఐ వాదనకు పరోక్షంగా మద్దతు పలికారని ఆరోపిస్తున్నారు.

కాగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు పన్నిన కుట్ర కాంగ్రెస్‌కే తిప్పికొడుతోందని మంత్రి ధర్మాన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వై.ఎస్. హయాంలో జారీ చేసిన 26 జీవోలు సక్రమమేనని ప్రభుత్వం వాదిస్తే పరిస్థితి ఇంతగా దిగజారేదికాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ సీఎం వినిపించుకోలేదని కూడా ధర్మాన నిష్టూరమాడినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ కాపాడలేనంతగా పార్టీ పరిస్థితి దిగజారిందని...ఇక చేసేదేమీ లేదని కాంగ్రెస్ వర్గాలు నిసృ్పహ వ్యక్తం చేస్తున్నాయి.

రాహూల్.....ఆలోచించు....

 రాహూల్...... చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మొద్దు

మా తాత ఈ దేశం కి స్వతంత్రం తెచ్చాడు, త్యాగం చేశాడు, మా నాయనమ్మ బ్యాంక్ లని జాతీయం చేసింది ఇద్దరు పని వాళ్లే ఆమెని చంపారు, మా నాన్న త్యాగం అనుపమానం ఇవీ రాహుల్ గాంధీ ఉపన్యాస ప్రధాన అంశాలు. రాహుల్ గాంధీ ఒక్కటే ఇప్పుడు ఆలోచించవలసింది మరి అంతా అద్భుతాలు చేస్తే 480 సీట్ల కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఎందుకు ఆధార పద వలసి వచ్చింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి నెహ్రూ చేసిన త్యాగం ఏమిటి? జమిందారీ వ్యవస్ధ తరపున ఆంగ్లేయులతో సంబంధాలు నెరపటం కాకుండా ఏం త్యాగం స్వాతంత్రానికి ముందు మీ కుటుంబం చేసింది అన్నది తెలుసుకోవాలి కదా? భగత్ సింగ్ ఊరికి అడ్డు పడ్డారా? సుబాష్ చంద్ర బోస్ కనబడితే బ్రిటిష్ సైన్యానికి అప్పగిస్తాం అని ఎలా సంతకం పెట్టారు? కాశ్మీర్ ని ఐక్యరాజ్య సమితికి తీసుకు వెళ్లింది మీ తాత కాదా? ఆ రావణ కాష్టం మీ తాత తెచ్చిన తంటా కాదా? లాహోర్ వరకు ఆక్రమించుకున్నా భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించి పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ని వెనక్కి తీసుకొని పేరు కోసం తపించే పనికిమాలిన చరిత్ర మీ నాయనమ్మది కాదా? బ్యాంక్ ల జాతీయ కరణ ద్వారా పేదలకి ఒరగబెట్టరా? లక్షల కోట్లు దిగమింగిన బడా బాబులకి పేదల సొమ్ము డిపాజిట్ల రూపంలో ఉంచినవి అప్పగించిన ఆ బ్యాంక్ వ్యవస్ధ తీరుతో విసిగి కాదా ఇప్పుడు ప్రైవేట్ బాంక్స్ పెరిగిపోయింది. అత్యవసర పరిస్ధితి మీ నాయనమ్మ మా ప్రజాస్వామ్యానికి ఇచ్చిన నల్ల బహుమతి కాదా? బియంత్ సింగ్ అనే ఉగ్రవాదికి మీ నాయనమ్మ పాలు పోసి పెంచలేదా, ఆ తర్వాత ఆ ఉగ్రవాదమే కదా ఆమె ఉసురు తీసింది? మన దేశపు తమిళుల పైన శ్రీలంకలో మన సైన్యం మీద దాడి చేయిస్తే నే కదా మీ నాన్న పైన ప్రతీకారం తీర్చుకుంది. అయోధ్యలో శిలాన్యాస్ చేసింది మీ నాన్న కాదా? అవేమీ తెలియని నువ్వు రాజకీయాలలో ఏం నేర్చుకుంటావు . సెల్ ఫోన్ తమ నాన్న తెచ్చిన సంస్కరణల ఫలితం అని అబద్దలు ఎందుకు ? ఎన్ డీ ఏ హయాంలో ఇచ్చిన స్పెక్ట్రమ్ అనుమతుల తర్వాత కదా అది సాద్యము అయ్యింది. ఫోన్ కోసం పాతిక సంవత్సరాలు, గ్యాస్ కోసం 49 సంవత్సరాల పాటు వెయిట్ చేయించిన ఘనత మీ కుటుంబానిది. అయితే అడగ్గానే ఇచ్చేలా చూసిన ఘనత ఎన్ డీ ఏ ది. ప్రభుత్వ టీవీ చానల్ (దూర దర్శన్), రేడియో తప్ప ఏమీ లేకుండా చేసిన మీ పార్టీ 50 ఏళ్ల పాలన తర్వాత ఇన్ని టీ వీ చానల్స్ కి అనుమతులు వీ పీ సింగ్ హయాంలో ప్రారంభం అయ్యి ఎన్ డీ ఏ హయాంలో పతాక స్ధాయికి చేరిన సంగతి రాహూల్ తెలుసుకున్నట్లు లేదు. కాస్త ఈ దేశం గురించి ఖత్రోచీ స్నేహితురాలు అయిన మీ అమ్మ ని అడిగితే ఏం చెబుతుంది నాయనా ఈ దేశ ప్రజలని అడిగితే చెబుతారు. మా తాతలు ఈ దేశం కోసం త్యాగం చేశారు అని కాకుండా ఈ దేశ అభివృద్ధి నిరోదకానికి మా కుటుంబం చేసిన తప్పులు క్షమించండి ఇక పైన అయినా మేము మిగతా వాళ్ళకి మల్లే సేవకి ప్రయత్నిస్తాము అని చెబితే నువ్వు యూత్ లీడర్ వి అవుతావేమో.....ఆలోచించు....

 

Sunday 20 January 2013

అ-ధర్మాన

ఇంతకీ 

ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర మంత్రా? ఎమ్మెల్యేనా?...

 
 
ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర మంత్రా? ఎమ్మెల్యేనా?... ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న ఇదే. వాన్‌పిక్‌ భూముల కేటాయింపు, జగన్‌ అక్రమాస్తుల కేసులో సిబిఐ నిందితునిగా పేర్కొనడంతో నైతికత విలువలకు కట్టుబడి తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేనని ధర్మాన పలు వేదికలపై స్పష్టం చేశారు. మీడియా వద్దా ఇదే పాట పాడారు. అయితే జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు, పర్యటనలు మాత్రం చేస్తున్నారు. ఆ సమావేశాలు, పర్యటనలు మంత్రి హోదాలో చేశారా? ఎమ్మెల్యే హోదాలోనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ధర్మాన తనకు తాను ఎమ్మెల్యేగానే భావించి సమీక్షలు చేశారనుకున్నా, హాజరైన అధికారులు మాత్రం ఆయనను మంత్రిగానే భావిస్తున్నారు. నిన్నటివరకూ ఎమ్మెల్యేనని చెప్తున్న ధర్మాన ఏ హోదాతో సమీక్షలు చేస్తున్నారని, తన నైతికత ఏమైందని విపక్ష నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
వాన్‌పిక్‌ భూముల కేటాయింపు, జగన్‌ అక్రమాస్తుల కేసులో ధర్మానను ఎ-5 నిందితునిగా పేర్కొంటూ సిబిఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నైతిక విలువలకు కట్టుబడి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆగస్టు 14వ తేదీన ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. వంద రోజుల తర్వాత దాన్ని ఆమోదించడం లేదంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ధర్మానను విచారణకు నిరాకరిస్తూ గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర మంత్రిమండలి ఫైలు పంపింది. ఆ ఫైలును గవర్నర్‌ తిరస్కరించి, మంత్రిమండలికి తిప్పి పంపారు. దీంతో ధర్మానను రక్షించాలన్న ప్రభుత్వ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ ఫైలుపై ప్రభుత్వం పునరాలోచన చేసిన దాఖలాల్లేవు. ఇంకా అది పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు ఈ వ్యవహారంలో ధర్మానను విచారణకు అనుమతించాలని సిబిఐ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకించింది. ఇతర హోదాల్లో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి, మరో హోదాలో కొనసాగుతున్నప్పుడు విచారణకు ఎలాంటి అనుమతి అవసరం లేదని సిబిఐ మెమోలో పేర్కొంది. వాన్‌పిక్‌ భూముల కేటాయింపు వ్యవహారం 2004-09 ప్రభుత్వ కాలంలో ధర్మాన ప్రసాదరావు రెవెన్యూమంత్రి హోదాలో ఉన్నప్పుడు జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వం, ఆయన శాఖ కూడా మారిందని చెప్తోంది. అందువల్ల ప్రభుత్వ అనుమతి లేకుండా విచారణకు అనుమతించాలని కోర్టును కోరింది. ప్రభుత్వ నిర్ణయాల్లో సిబిఐ జోక్యం చేసుకునే వీల్లేదని, అలాంటి ఆధారాలూ లేవని ధర్మాన ప్రసాదరావు కూడా వాదిస్తున్నారు. ఈ కేసు సోమవారం విచారణకు రానుంది.
నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని పేర్కొంటున్న ధర్మాన కొన్నాళ్లు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తాను మంత్రిని కాదని, ఎమ్మెల్యేనని చెప్తూ శ్రీకాకుళం నియోజకవర్గస్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజీనామాను ఆమోదించడం లేదని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత కూడా తాను ఎమ్మెల్యేనని ధర్మాన చెప్పుకుంటూ వస్తున్నారు. మంత్రిమండలి సమావేశాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి కోరుతున్నా, గైర్హాజరవుతున్నారు. ధర్మాన ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న విశాఖపట్నం జిల్లాలో అక్టోబరులోనే ముఖ్యమంత్రి 'ఇందిరమ్మబాట' కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని ధర్మాన చెప్పడంతో ముఖ్యమంత్రి దాన్ని వాయిదా వేసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని గత నెలలో నిర్వహించారు. ఇందిరమ్మబాటకు ముందు జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. తీరా సమావేశం ముగిశాక తాను మంత్రిని కాదని, ఎమ్మెల్యేనని మీడియా వద్ద పాత పాట పాడారు. ఆ తర్వాత ఇందిరమ్మబాట కార్యక్రమంలోనూ మంత్రి హోదాలోనే హాజరయ్యారు. తాను మంత్రిగా కొనసాగుతున్నానని చెప్పకుండానే ఆ కార్యక్రమంలో పర్యటించారు. రెండు రోజుల కిందట శ్రీకాకుళంలోని జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ఉపాధిహామీ పథకంపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధర్మాన ప్రసాదరావు మంత్రి కాకుంటే ఏ హోదాతో సమీక్షలు చేశారని, ఏ హోదాతో ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొన్నారని విపక్ష నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ధర్మాన పేర్కొంటున్నట్టు ఎమ్మెల్యే హోదాలోనే మన జిల్లా, విశాఖ జిల్లాలో సమీక్షలు నిర్వహించారా? ఆ హోదాలోనే ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ అధికారం ఎమ్మెల్యేకు ఎక్కడుందని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. నైతికత వంటి మాటలను వల్లె వేసిన ధర్మాన మంత్రి హోదాలో కొనసాగుతున్నారా? ఎమ్మెల్యే హోదాలో ఉన్నారా? అన్న దానిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది.

వంశీ

వంశీ పసల పూడి కథ

 'పలుకునైనా కాకపోతిని పసలపూడి కథలలో..కలమునైనా కాకపోతిని ఆ కథలు కురిసిన సుధలకు' పసలపూడి కథల పుస్తకం రెండవ పేజీలో బాపు వేసిన చిత్రానికి రమణగారు రాసిన వాక్యమిది. పసలపూడి కథల్నే కాదు ఆ ఊరికబుర్లను కూడా అంతే ఆసక్తిగా చెబుతారు దర్శకుడు వంశీ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నిట్లో పల్లెటూరి సన్నివేశాలు, సంభాషణలు చాలా సహజంగా ఉండడం వెనక తన ఊరి జ్ఞాపకాలే ఉన్నాయంటారాయన. చిన్నప్పుడు లాకుల దగ్గరాడుకున్న ఆటలు, ఎడ్లబండిపై సెకండ్‌షోలకు వెళ్లిన సంఘటనలు, ఎంతో ఇష్టంగా తాగిన శొంఠి సోడాలు...అంటూ తన సొంతూరు గురించి వంశీ చెప్పిన విశేషాలు..........
 "నేను మూడోతరగతి చదువుకుంటున్నప్పుడు నాతో చదువుకునే కొందరి అమ్మాయిల మెడల్లో మంగళసూత్రాలు కనిపించేవి. వాళ్లు కడుపులో ఉండగానే సంబంధాలు కుదుర్చుకునేవారని మా పెద్దవాళ్లు చెప్పేవారు. పుట్టిన ఏడాదికో, రెండేళ్లకో పెళ్లిళ్లు చేసేసేవారు. ఆ చిన్నవయసులో నాకే కాదు...మెడలో మంగళసూత్రం ఉన్న ఆ అమ్మాయిలకు కూడా పెళ్లంటే ఏంటో తెలిసేది కాదు. మా చుట్టుపక్కల ఊళ్లలో అయితే ఈ వివాహాలు ఇంకా ఎక్కువట. అలా పెళ్లయిన పిల్లలు... పలకా బలపం పట్టుకుని అక్షరాలు దిద్దుతూ మెడలో ఉన్న తాడుతో ఆడుకునేవారు. మా ఊరు పేరెత్తగానే వెంటనే గుర్తొచ్చేది నా బాల్యం.
 ముందుగా నేను చదువుకున్న పాఠశాల, మాస్టార్లు, తోటి విద్యార్థులు నా కళ్లముందు మెదులుతుంటారు. అందుకే ముందు వివాహితలతో కలిసి ఓనమాలు నేర్చుకున్న సంఘటనతో మొదలుపెట్టాను. ఊరంటే బోలెడు జ్ఞాపకాలు, బోలెడు అనుభవాలు....నా మనసులో మెదిలే మా ఊరి స్మృతులను కథలుగా రాశాను. అవే...'పసలపూడి కథలు'. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని పసలపూడి గ్రామం మాది. నాకు ఊహ తెలిసేటప్పటికి మా ఊళ్లో మూడువందల ఇళ్లు వరకూ ఉండేవి. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామం. అక్కడక్కడా మామిడితోటలు కూడా ఉండేవి.
 పశువులోడి ఊరు...
పూర్వం మా ఊరున్న స్థానంలో ఒక పశువుల కాపరి చిన్న గుడిసె వేసుకున్నాడంట. కొన్నాళ్లతర్వాత ఆ గుడిసెపక్కన మరో నలుగురు గుడిసెలు వేసుకున్నారట. మా చుట్టుపక్కల గ్రామాలవారు ఆ ప్రాంతాన్ని పశువులోడి ఊరు అని పిలిచేవారట. కొన్నేళ్లు గడిచేసరికి మరికొన్ని గుడిసెలు, పెంకుటిళ్లు వచ్చి క్రమంగా పేరులో కూడా మార్పు వచ్చింది. పశువులోడి ఊరు కాస్తా పసలపూడిగా అయిపోయిందని మా ఊరి పెద్దలు చెప్పే కథ. కర్రి మందారెడ్డిగారు మా ఊరి ప్రెసిడెంట్. తరతరాలుగా వారి కుటుంబమే మా ఊరిని ఏలుతోంది. నేను సినిమా రంగంలోకి వచ్చాక ఒకరోజు మా ఊరాయన ఒకాయన ఫోన్ చేసి 'మన ఊరి ప్రెసిడెంట్ ఎవరో తెలుసా నీకు?' అన్నాడు. 'ఇంకెవరుంటారు....ఆ కుటుంబమే కదా.' అన్నాను. 'ఆ రోజులు పోయాయి...మనూరి కాఫీహోటల్ యజమానే ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు' అని చెప్పగానే నేను షాక్ అయ్యాను.

 రోజుకూలీ చందాతో...
మా ఊరి కాఫీహోటల్ యజమాని చాలా మంచివాడు. ఊళ్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే వెంటనే ఆయన మోటర్‌సైకిల్‌పై పక్కఊరికి తీసుకెళ్లి వైద్యం చేయించేవాడు. అలాగే ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా తాను ముందుండి చక్కబెట్టేవాడు. అతన్ని ప్రెసిడెంట్‌గా నిలబడమని అడిగితే తనకంత స్థోమతలేదని చెప్పాడట. అతను ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి కావాల్సిన ఖర్చుకోసం మా ఊరి కూలీలంతా ఒకరోజు కూలీని పోగుచేసి అతని చేతిలో పెట్టారు. అలా పేదోళ్లంతా కలిసి అతన్ని ప్రెసిడెంట్‌గా నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆ విషయం తెలిసాక నాకు చాలా సంతోషం కలిగింది. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏళ్లతరబడి ఏకఛత్రాధిపత్యంగా వస్తున్న ప్రెసిడెంట్ పదివికి వారు పెట్టిన చెక్ ప్రశంసనీయమనిపించింది.

పేద కుటుంబం...
మా నాన్నగారు చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవారు. మా తాతగారిది మా ఊరికి కొద్దిదూరంలో ఉన్న కుతుకులూరు. మా నాన్నగారు ఉద్యోగం నిమిత్తం పసలపూడికి వచ్చి స్థిరపడ్డారు. నాకు ఒక అక్క, తమ్ముడు. అమ్మ (సూరాయమ్మ), నాయనమ్మ(ఆర్యాయమ్మ)లకు ఇంట్లో పని సరిపోయేది. నాన్నకు ఉద్యోగం తప్ప ఇల్లు, పొలాలువంటి ఆస్తులేమీ ఉండేవి కావు. మాది మూడు గదుల పెంకుటిల్లు. రెండురూపాయల అద్దె. నాన్నకు సైకిల్ ఉండేది. దానిపైనే మా పక్కూరిలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్లేవారు.




గ్రంథాలయం స్నేహం...
మా ఊరి పాఠశాలలో ఐదో తరగతి వరకే ఉండేది. ప్రభాకర్ మాస్టారు, బాబురావు మాస్టారు, శర్మమాస్టారు, జయస్తుతి మాస్టారు...మా బడిని చక్కగా నడిపించేవారు. నాకు చిన్నప్పటి నుంచి స్నేహితులు తక్కువే. స్కూలు అయిపోగానే నేరుగా గ్రంథాలయానికి వెళ్లిపోయేవాడ్ని. రోజూవెళ్లడం వల్లేమో...గ్రంథాలయం మాస్టారు నాతో బాగా క్లోజ్‌గా ఉండేవారు. ఆ చిన్న వయసులోనే నేను చలం, శరత్, లత వంటివారి సాహిత్యం చదివాను. వాటి ప్రభావం వల్లే నా పదహారవ ఏటనే 'మంచుపల్లకి', 'కర్మ సాక్షి' వంటి నవలల్ని రాశాను. గ్రంథాలయంలో పుస్తకాలు చదవడం అయిపోయాక మా ఊరి లాకులదగ్గరికి వెళ్లిపోయేవాడ్ని.

అక్కడున్న చింతచెట్ల దగ్గర కూర్చుని కాలక్షేపం చేసేవాడ్ని. ఒకసారి జోరువర్షంలో అమ్మతో 'అమరశిల్పి జక్కన' సినిమా చూడ్డానికి పక్కఊరికి నడుచుకుంటూ వెళ్లాను. అదే నా మొదటి సినిమా. పిల్లలకు ఎక్కడ జలుబు చేస్తుందోనని అమ్మ బెంగపడుతుంటే...నేనేమో వాన చినుకుల్ని ఎంజాయ్ చేస్తూ సినిమాకి వెళ్లాను. అలా అప్పుడప్పుడు అమ్మతో కాకుండా ఊళ్లో నాతోటి కుర్రాలతో ఎడ్లబండిపై సెకండ్‌షో సినిమాలకు కూడా వెళ్లేవాడ్ని. మా కిళ్లీరన్న (కిళ్లీ వీరన్న )హోటల్‌లో పలావ్ భలే రుచిగా ఉంటుంది. చేతిలో పైసలుంటే అక్కడికి వెళ్లిపోయేవాళ్లం. లేదంటే రెండేసి శొంఠిసోడాలు తాగేసి ఇంటికొచ్చేసేవాళ్లం.
 
.




డాక్టర్ సైకిళ్లు...
పొద్దున్నించి సాయంత్రంలోపు ఇద్దరో, ముగ్గురో డాక్టర్లు సైకిళ్లమీద తిరిగేవారు. అప్పట్లో అన్ని గ్రామాల్లో ఆసుపత్రులుండేవి కావు. డాక్టర్లే నాలుగైదు ఊళ్లలో సైకిళ్లమీద తిరుగుతూ వైద్యం అందించేవారు. మా ఊరికి కృష్ణారావుగారు, అప్పన్నగారు అని ఇద్దరు డాక్టర్లు రోజూ వచ్చేవారు. డాక్టర్లంటే టక్కు, టై ఊహించుకుంటారేమో...తెల్లటి గ్లాస్కో పంచెలు కట్టుకుని వచ్చేవారు. సైకిల్ వెనకసీటుపై ఒక పెట్టె ఉండేది. మరీ పెద్ద వైద్యం అవసరమైతే పలానా ఆసుపత్రికి అని రాసిచ్చేవారు. ఒకోసారి వారే దగ్గరుండి తీసుకెళ్లేవారు. ఈ వైద్యం కాకుండా నాటువైద్యం, తాయెత్తులు కట్టేవారు కూడా ఎప్పుడూ బిజీగా ఉండేవారు.

గణపతి నవరాత్రులు...
పండగలన్నిటిలోకి సంక్రాంతి హైలైట్ అయినా...గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు మా ఊళ్లో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. వీటి స్పెషాలిటీ ఏంటంటే...పూజలు, పునస్కారాలతో పాటు నాటకాలు, రికార్డింగ్ డాన్సులు కూడా ఉంటాయి.(నవ్వుతూ...) గణపతి నవరాత్రుల్లో అయితే నాటకాలు వేయడానికి రాజమండ్రి నుంచి వచ్చేవారు. చక్రవర్తి అని ఎన్టీఆర్‌కి, విజయకుమార్ అని ఏఎన్ఆర్‌కి డూప్‌లుండేవారు. అచ్చం వారిలాగే ఉండేవారు. వాళ్లిద్దరూ మా ఊరి బస్సు దిగగానే కుర్రాళ్లమంతా వారిచుట్టూ చేరిపోయేవాళ్లం. నిజంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వచ్చినట్టు ఫీలయ్యేవాళ్లం.

వాళ్లిద్దరూ వేసే పౌరాణిక నాటకాలతో పాటు చివరిరోజు వేసే రికార్డు డాన్సు స్టెప్పులవరకూ జనం భలే ఎంజాయ్ చేసేవారు. వినాయక చవితికి మా ఊళ్లో మరో ప్రత్యేకత ఉండేది. మా ఊరిపక్కనే ఉన్న కంపెనీవాళ్లు లారీల్లో పిల్లలందరినీ ఎక్కించుకుని చుట్టుపక్కల ఊళ్లన్నీ తిప్పేవారు. సంక్రాంతి సమయంలో అయితే కోడిపందేలు చూడ్డానికి మా ఊరినుంచి పెద్దవాళ్లు చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లేవారు. ఊళ్లో ఏటా జరుపుకునే చింతాలమ్మతీర్థం చాలా ఫేమస్. ఈ వేడుకను చూడ్డానికి చుట్టుపక్కల ఊళ్లనుంచి జనం బాగా వచ్చేవారు. ఆ రోజు చింతాలమ్మ దేవతకు పూజలు చేయడం, మొక్కులు తీర్చుకోవడం, గుండాలు వేయడం వంటివన్నీ భక్తిశ్రద్ధలతో జరిపేవారు. ఆ తీర్థంలో రకరకాల ఆటబొమ్మలు అమ్మేవారు.

బోగంమేళాలు...
మా ఊరి నల్లమెల్లి రాజారెడ్డిగారి దూడల చావిట్లో అప్పుడప్పుడు బోగంమేళాలు జరుగుతుండేవి. బోగంమేళం పెట్టేముందు రెడ్డిగారి దూడల చావిడిని శుభ్రం చేసి ఎల్ల(సున్నం)వేసి రంగురంగు కాగితాలతో ముస్తాబుచేసేవారు. సాయంత్రం సమయంలో కార్యక్రమాలు మొదలయ్యేవి. అలాంటివాటికి పిల్లల్ని పంపించేవారు కాదు...కుర్రాళ్లం మాత్రం ఎలాగోలా వెళ్లిపోయేవాళ్లం. మా ఊరి రాయలరెడ్డిగారి అబ్బాయి పెళ్లిలో కళావంతులతో డాన్సు కార్యక్రమం పెట్టించారు. అప్పుడు 'ఎంకొచ్చిందో...మావ ఎదురొచ్చిందో మావ' అనే పాటకు ఒకావిడ చేసిన డాన్సును మొదటిసారి చూశాను. చాలా గొప్పగా చేసిందామె.

ఊరు వదలని అమ్మ...
నేను ఊళ్లో ఐదోతరగతి పూర్తయ్యాక పక్కూరిలో ఎస్ఎస్ఎల్‌సి చదువుతున్న సమయంలో నాన్న అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత నా చదువు పూర్తయ్యాక నేను రాసిన నవలలు చూసి ఒక పెద్దాయన నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు మద్రాసులో అన్నారు. ఆయనన్నట్టుగానే కొన్నాళ్లకు మద్రాసులో స్థిరపడ్డాను. 'లేడీస్ టైలర్' సినిమా సమయంలో ఊళ్లో ఇల్లు కొన్నాను. అక్క, తమ్ముడు పెళ్లిళ్లు అయ్యాక అమ్మ ఒక్కతే ఆ ఇంట్లో ఉండేది. అమ్మ నా దగ్గరకు రాలేదు. అమ్మ తన జీవితం ఊళ్లోనే ముగియాలనుకుంది. అలాగే జరిగింది కూడా. 72 ఏళ్ల వయసులో కన్నుమూసింది.

ఊళ్లోనే ఉంటాను...
ఇప్పుడు మా ఊరు చాలా మారిపోయింది. రూపుతోపాటు మాటల్లో గోదావరి యాస కూడా పోయింది. మా చిన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లావాళ్లని మాటని బట్టి చెప్పేసేవారు. ఇప్పుడు ఆ యాస పల్లెటూళ్లలో కూడా పోయింది. మా ఊరెళ్లినపుడు నేను అన్నింటికన్నా ఎక్కువ మిస్ అయ్యేది అదే. నేను ఊళ్లో కొన్న ఇంటిని కూలగొట్టి త్వరలో పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నా చివరిరోజులు ఊళ్లోనే గడపాలనుకుంటున్నాను. కొన్నేళ్లక్రితం ఒకసారి స్నేహితులతో కూర్చుని ఏదో కబుర్లు చెప్పుకుంటుంటే వచ్చిన ఆలోచనే పసలపూడి కథలు. ఆలోచన వచ్చిందే తడవుగా మా ఊరి కథలు రాయడం మొదలుపెట్టాను.

ఓ రచయితకు పల్లెటూరికి మించిన వస్తువు మరొకటి ఉండదనడానికి 'పసలపూడి కథలు' పెద్ద సాక్ష్యం. ఆ కథలే కాదు...నా సినిమాల్లో కూడా పల్లెటూరి వాతావరణం, సన్నివేశాలు స్వచ్ఛంగా కనిపించడానికి మా ఊరి జ్ఞాపకాలే కారణం. ఇక్కడ పట్టణంలో కూర్చుని మా ఊరిని గుర్తుచేసుకునే రోజులుపోయి ప్రతిరోజు పొద్దునే లేచి మా ఊరి వీధుల్ని, కొబ్బరి చెట్లని, లాకుల్ని నేరుగా చూసుకునే రోజులు త్వరగా రావాలని కోరుకుంటున్నాను.

Friday 18 January 2013

మతం గతం

మనుషులుగా మనం బతకలేమా ??
 
మతం ముసుగులో కుమ్ములాటలు..........మతం ముసుగులో వోటు బ్యాంకు రాజకీయాలూ........అది ఏ పార్టీ ఐనా కావొచ్చు........ఎవరిచ్చారు వీరికి మనుష్యుల మనసులతో ఆడుకునే అవకాశామూ........అధికారమూ.......నువ్వూ నేనూ భాయి భాయి అనే ఆలోచనలు తుడిచేసి.........నీకు నాకు బై(bye) బై(bye) అనేలా ఉద్వేగపూరిత ప్రసంగాలతో వర్గ పోరు సృష్టించి......సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.......అన్య మతాలను గౌరవించమని ప్రతి మతం యొక్క అభిమతం.....అంతే కాదు భారత రాజ్యాగం కూడా మత స్వాతంత్ర్యపు హక్కులు ఇవ్వడమే కాకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికవాదం (Secularism) అనే భావనను ప్రవేశ పెట్టి అన్ని మతాలూ, తమ తమ మత ప్రచారం చేసుకుంటూనే ఇతర మతాలను గౌరవించమని చెప్పింది..........మత ప్రచారం తప్పూ కాదూ , లోపమూ కాదూ......కానీ తమ మతమే గొప్పనుకోవడం తప్పు........ఒక మతం లో ఉన్న ఆచారాలూ, సాంప్రదాయాలూ వేరే మతం లో లేకపోవచ్చు.......అంత మాత్రాన నా మతమే గొప్ప అనే ధోరణితో ఉండొద్దు.......ఎవరి మత భావనలు వాళ్ల వాళ్ల వ్యక్తిగతం....ఈ రోజు నువ్వు వేరే మతాన్ని కించపరిస్తే , రేపు ఆ మతం వాల్లు నీ మతాన్ని కించపరుచొచ్చు.... పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించిన వాళ్లు మత విద్వేషాలకు లోనూ కారు అని మహాత్ములన్నారు...గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకునేల మత పెద్దలు కృషి చేయాలే తప్ప, మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు...విద్వేషాల వల్ల వ్యక్తిగతంగానే కాక సంఘ పరంగా, దేశ పరంగా కూడా కూడా అనర్థం..........మనిషి పుట్టి మతం పుట్టిందా, మతం పుట్టి మనిషి పుట్టాడ........ఆది మానవుడు ఏ మతంతో పుట్టాడు........వర్గ పోరు మాటలు దాటి, చేతల్లోకి వెళితే మన దేశ పరువేం కావలి.......సర్వ మత సమ్మేలనాలకు నిలయంగా.....ఆలయంగా వెలసిల్లిన నా భారతజాతి యొక్క ఔన్నత్యం, సమగ్రత కొందరు స్వార్థ రాజకీయ నాయకుల వల్ల దెబ్బ తినకూడదు.......ఏ ఒక్కరు విద్వేషపూరిత ప్రసంగాలు చెయ్యొద్దని, ప్రజలు ఆ విద్వేషపూరిత మాటల వల్ల ప్రేరేపితులు కావొద్దనీ......దేశ పరువు-ప్రతిష్టలని దిగజార్చకూడదనీ.........లౌకికవాదం అంటే అన్ని మతాలను గౌరవించడమనీ తెలుసుకొని......మత సామరస్యంతో శాంతియుత జీవితం గడపాలని భారతీయుడిగా మన రోదనా........ఆవేదనా.......... ఒక చిన్న కల్పిత కథ తో ఆ భావనను తెలుసుకుందాం............
ఆకాశంలో ఒకానొక రోజు కొందరు రాక్షసులు తిరుగుతూ భూమి వైపు చూస్తూ వాళ్ళలో వారు మాట్లాడుకుంటూ ఇలా అనుకున్నారు .....ఒరేయ్ జన్మలన్నింటిలోకి మానవజన్మ గొప్పదని అందరూ చెపుతుంటారు .........వారు చాలా ఐకమత్యంగా , సుఖసంతోషాలతో నివసిస్తారంట అని ఇంకో రాక్షసుడు అన్నాడు ....ఇదంతా నిజం కాదని మానవుల్లో కూడా మేం మనుషులమనే భావం తక్కువైపోయి వేరే ఆలోచలేవో వస్తునాయని ఇంకో రాక్షసుడు వాదించాడు ........ఆ వాదనలో నిజం ఉందని నిరూపించడానికి మన భారతదేశానికి ఒక విదేశీయుడి అవతారంలో వస్తాడు ......ఆ రాక్షసుడు.....అలా వచ్చిన రాక్షసుడు కొన్ని నెలలపాటు మన దేశం నలుమూలలా సంచరించి చాలా ఆశ్చర్యకరమైన విషయాల్నితెలుసుకున్నాడు ..........రాక్షసుడు మొదట మానవుల పేర్లతో పరిచయం చేసుకుందాం అనుకున్నాడు .....ఒకతని దగ్గరికి వెళ్లి నీవు ఎవరు?? అని అడగడంతో ఆ మనిషి నేనూ ‘‘హిందువు”అన్నాడు...అలాగే ఇంకొక మనిషి దగ్గరికి వెళ్లి అదే ప్రశ్న వేసాడు ... ఈ సారి సమాధానం ముస్లింగ వచ్చింది...ఇంకొక ప్రదేశానికి వెళ్లి అదే ప్రశ్న వేశాడు ... అక్కడి సమాధానం క్రిస్టియన్, అలా అనేకానేక ప్రదేశాలు తిరిగి అదే ప్రశ్నను వేయగా అతనికి దొరికిన సమాధానాలు ‘‘సిక్కు’’ ‘‘బౌద్ధుడు”, ‘‘ జైనుడు”........ఆ రాక్షసుడు మానవ జన్మలో ఇన్ని మతాలున్నాయా అని ఆశ్చర్యపోయాడు........అంతేకాదు తన వాదన నెగ్గుతుందన్న ఆశాభావం పెరుగుతున్నందుకు సంతోషించాడు......ఆ రాక్షసుడు ఈ మతవాద మానవుల్లో ఇంకా ఎన్నో ఆశ్చర్యకమైన విషయాలు గమనించాడు ......ప్రతి మతంలోనూ ఎన్నో కులాలు, వాటిలోఉపకులాలు కూడా వున్నాయని....... అంతేకాదు ఒక మతం అంటే ఇంకో మతానికి పడకపోవడం ..ఒక కులానికి మరొకకులానికి పడకపోవడం గమనించాడు .....అంతే కాదు మా దేవుడు గొప్పని కొందరంటే , మా ప్రవక్తే గొప్పని కొందరంటారుకాదు .......కాదు మా ప్రభువే గొప్పని కొందరంటారు....ఇలా మనుషులు తమ మధ్యే కాకుండా దేవుళ్ళ మధ్యా గోడలుకట్టి మరీ, వారి దేవుడే గొప్పని ప్రచారం చేస్తున్నారు...ఇలా ఎన్నో నెలలపాటు పరిశీలనలు చేసిన ఆ రాక్షసుడికి తానుగెలిచినందుకు ఆనందంవేసినది.... కాని ఈ మానవుల్లో ఇంత వైషమ్యాలు ఎందుకున్నాయా అని ఆలోచించాడు. వీరినిఎలాగైనా మార్చాలని హిమాలయాల్లో ఘోర తపస్సుతో ఒక మునిగా అవతారం ఎత్తాడు. అలా అవతారం ఎత్తిన మునితాను హిందూ, ముస్లిం, క్రిస్టియన్,సిక్కు,బౌద్ద మరియు జైన వర్గాలకు చెందిన స్వామిజీని కాదని తాను ఒక “మనిషిని”మాత్రమేనని తనకు ఏ మతం, ఏకులం మరియు ఏజాతి రంగును అద్దవద్దని విజ్ఞప్తి చేస్తూ దేశమంతట సంచరిస్తూ అందరిని మనుషుల్లాగా బ్రతకమని హితబోద చేసాడు. మానవుల్లోని వైషమ్యాలను చూసి రాక్షసుడే తాను మారడమే కాకుండా మన విధివిధానాలు కూడా మార్చి మనల్ని మతాలకు కులాలకు అతీతంగా బ్రతకమనీ, మనుషులుగా మార్చాలని అనుకున్నాడు..... అలాంటిది మనంతట మనం మనుషులుగా బ్రతకలేమా?.......ఆలోచిద్దాం.......మతాన్ని గతం చేయలేమా?

కవిత్వం

కవిత్వం......... తాత్వికానందం 

                  -  కె.శివారెడ్డి.


దుఃఖాన్ని ఏవగించుకుంటూ దూరంగా జరిగిపోతే, దుఃఖకారకాలను గుర్తించేదెలా? వాటికి పరిష్కారాల్ని కనుగొనేదెలా?అంటూ "దుఃఖం కంట్లో నీరై, కాంతిని వడబోస్తున్న్జ, కాంతిని కాపాడుతున్న లాంతరు గ్లాసై, నిన్ను బతికించి తాను బతుకుతుంది'' అంటారు కె.శివారెడ్డి. కవిత్వం రాసిన వారే అని కాదు ఆ స్థాయి అనుభూతులున్న ప్రతి ఒక్కరూ కవే అంటూ కవితాత్మ విస్తృతి చెబుతారాయన. నాలుగు దశాబ్దాల కాలంలో వచ్చిన ఆయన 14 కవితా సంకలనాల్లో మోహనా! ఓ మోహనా! అన్న కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తానొక కవితా శిఖరంగా ఎదగ డమే కాదు ఎంతో మంది నవతరం కవులకు ఆ కవితాస్పృహను పంచుతూ ఏడుపదుల వయసులోనూ ఒక ప్రవాహంలా సాగిపోతున్న కవి శివారెడ్డి జీవితంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఆయన మాటల్లోనే...........

గాయాలు శారీరకమే కావచ్చు, మానసికమే కావచ్చు కానీ కొన్నిసార్లు అవి ఎంత గొప్ప పాఠాలో చెబుతాయి. అయితే మనం ఎంతసేపూ వాటి వల్ల కలిగే కష్టనష్టాలే చూస్తాం. మనసు పెట్టి వినాలే గానీ ఒక్కోసారి అవి మనల్ని సమూలంగా మార్చివేస్తాయి . మనలో ఇంకా మిగిలి ఉన్న కాస్తో కూస్తో కాఠిన్యాన్ని కూడా తొలగించి, గొప్ప మార్దవాన్ని నింపుతాయి. అన్నిట్నీ తేలిగ్గా తీసుకునే తత్వాన్నుంచి అంతర్మూలాల్లోకి వెళ్లి అద్భుతాల్ని దర్శించే స్పృహనూ, శక్తినీ అందిస్తాయి. నా విషయంలోనూ ఇదే జరిగింది. చైతన్య ప్రవాహంఉద్యోగ విరమణ చేసిన రెండేళ్లకు అంటే 2001లో ఒక రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న సమయంలో ఒక స్కూటర్ నన్ను ఢీకొంది. నేల మీద పడిపోయిన నేను లేవడానికి ప్రయత్నించాను. కానీ కాలు లేవ డం లేదు. నా ఎడమ కాలు మడమ భాగమంతా నుజ్జనుజ్జయిపోయిందన్న విషయం నాకు ఆ తరువాత గానీ తెలియలేదు.

నన్ను చేర్పించిన హాస్పిటల్ డాక్టర్లు చెప్పిందాన్ని బట్టి ఏదో ఒక మేరకు ఆ కాలును తీసివేస్తారని, జీవితమంతా నేను కొయ్యకాలుతో నడవాల్సి ఉంటుందని అనుకున్నా. నాలుగు సర్జరీలు, సుదీర్ఘకాలం మంచాన విశ్రాంతి తర్వాత మళ్లీ నడవడానికి నాకు రెండేళ్లు పట్టింది. ఆ రోడ్డు ప్రమాదం, తదనంతర పరిణామాలు నాకు చాలా విషయాలు చెప్పాయి. లోతైన పాఠాలు నేర్పించాయి. అందరిలా నడుస్తూ, జనప్రవాహంలో నేనూ మమేకమై ఉన్నప్పుడు ఆ ప్రవాహ చైతన్యం గురించి అంత లోతుగా తెలియలేదు. చైతన్యం సమాజమంతా ప్రవహిస్తున్నప్పుడు నేను చలనం కోల్పోయి మంచాన పడి ఉండి అప్పుడు ఆ చలనానికి సంబంధించిన అద్భుత అంశాలన్నీ ఒక్కొక్కటిగా తె లుసుకోవడం మొదలెట్టాను. నేను మంచాన పడిఉన్న ఆ రెండేళ్ల కాలంలో రాసిన కవితలే 'అంతర్జనం' పేరుతో ఆ తర్వాత పుస్తకంగా వచ్చాయి. వాస్తవానికి అప్పటిదాకా నేను రాసిన కవితలకూ, ఈ అంతర్జనంలోని కవితలకూ ఎక్కడా పొంతన కనిపించదు. నా భాష, వస్తువు సమూలంగా మారిపోయాయి.

ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి ముందు కూడా నేను సంచార జీవినే. ఉద్యమ శీలతతో జనప్రవాహంలో ఉన్న వాణ్ణే. కానీ, ఈ ప్రమాదం తరువాత నా చూపులో చాలా తేడా వచ్చింది. మనుషుల్లోకి, వస్తువుల్లోకి, ఘటనల్లోకి అన్నింటి అంతర్మూలాల్లోకి వె ళ్లడం ఆ ప్రమాదం నాకు నేర్పింది. 'అంతర్జనం' తర్వాత సాగిన నా కవితారచనలన్నిటిలో భాషాపరంగానూ, వస్తుపరంగానూ ఒక గుణాత్మకమైన మార్పు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే దృష్టి లోనికి వెళుతుందో గొప్ప సత్యసందర్శనం కలుగుతుంది. అంతకు ముందు నా కవితలో ఒక ప్రవాహ వేగం ఉండేది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత వచ్చిన కవితల్లో మరింత సాంద్రత, కవితాత్మకత వచ్చి చేరాయి. ఆ అనుభవం నుంచే సాహిత్య రచన వస్తువు చుట్టూ తిరగడం కాదు, వస్తువు లోనికి వెళ్లాలంటూ నేనొక సూత్రీకరణ చేశాను. గాయాలతో కుంగిపోవడం అనేది ఎప్పుడూ జరిగేదే. కానీ, గాయాలు నేర్పే పాఠాలు అన్నీ ఇన్నీ కావు. పాఠాల కోసం ఎవరూ గాయాల పాలు కావాలనుకోరు గానీ, అనివార్యంగా గాయమైపోయాక, ఆ పరిణామాల్లోకి నిశితంగా చూస్తే ఎన్ని అద్భుత సత్యాలో బోధపడతాయని, ఒక్కోసారి అది మన జీవ న దృక్పథాన్ని ఒక శిఖరానికి చేరుస్తుందన్న లోతైన నిజాన్ని ఆ రోడ్డు ప్రమాదం నాకు తెలియచెప్పింది.

ప్రవాహంలో ఉండాలని...
తెనాలి దగ్గరలో ఉన్న కార్మూరివారి పాలెం మా ఊరు. అప్పటికి ఏవో నాలుగు తెలుగు అక్షరాలు నేర్చుకుని ఉంటాను. ఆ సమయంలోనే అంటే నా ఆరే ళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నేనింక అక్షరం వేపు చూడలేదు. వంటచేయడం, పశువుల్ని కాయడం వీటితోనే నాకు సరిపోయింది. సాయంత్రం వేళ ఒకనాడు బంతాట ఆడుతున్న సమయంలో ఏదో ఘర్షణ జరిగి అవతలి జట్టుకు చెందిన ఒకడు నన్ను ఇంగ్లీషులో తిట్టాడు. అదే జట్టులో ఉన్న మా అన్నయ్యను వాడు ఏమని తిట్టాడో చెప్పమంటే చెప్పలేదు. నాలో ఒక కసి, కోపం పెరిగాయి. చదువుకోవాలన్న కోరికకు అది బీజం వేసింది. నాన్నగారిని ఒప్పించి నేను స్కూళ్లో చేరిపోయాను. అయితే ఆరవ తరగతిలోకి వచ్చాక గానీ, మాకు ఎబిసిడిలు నే ర్పలేదు. అందుకే 7వ తరగతిలోకి వెళ్లినా ఇంగ్లీషు వచ్చేది కాదు. ఆ ఇంగ్లీషు మాస్టారేమో రోజూ తిడుతూ ఉండేవాడు. హాయిగా ఏదో వ్యవసాయం చేసుకుని బతక్క ఎందుకీ బాధంతా అనుకున్నాను. స్కూలు మానేయాలన్న ఒక నిర్ణయానికి కూడా వచ్చేశాను. అయితే ఆ మరుసటి రోజే ఇంగ్లీష్ మాస్టారు సాలె పురుగు గురించి ఒక పద్యపాఠం చెప్పాడు.

గూడు కట్టుకోవడంలో ఎన్నిసార్లు విఫలమైనా విజయం సాధించేదాకా అది నిర్విరామంగా పాటుపడే ఉదంతాన్ని ఆయన ఎంతో హృద్యంగా చెప్పాడు. ఒక చిన్న పురుగు అన్నిసార్లు ప్రయత్నించి చివరికి అనుకున్నది సాధించేదాకా వదల్లేదే! మనిషై ఉండీ నేనెందుకు నిరాశ చెందడం, వెనుకంజ వేయడం? అనిపించింది. అంతవరకు నాలోవున్న మీమాంస పటాపంచలైపోయింది. ఏది ఏమైనా చదువు కొనసాగించాలనే ఒక దృ«ఢమైన నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం నన్ను ఎం.ఏ. దాకా నడిపించింది. బిఏలో ఉన్నప్పుడే కవిత్వం పట్ల ఏర్పడిన ప్రేమ నన్ను ఎంఏ అయిపోగానే హైదరాబాద్‌కు వచ్చేలా చేసింది. నా ఆ రాక నా జీవితాన్నే మార్చివేసింది. మనిషి విషయ ప్రవాహమో, జనప్రవాహమో మొత్తానికి ఒక ప్రవాహంలో ఉండాలన్న సత్యాన్ని ఆ పరిణామాలు నాకు నేర్పాయి.

ముఖద్వారం వద్దే ఆగిపోయి....
ఒక సంచారిగా యువకవుల్ని కలవడానికి ఏ ప్రాంతానికి వెళ్లినా నాకు ఎప్పుడూ ఎదురయ్యే అనుభవం ఒకటుంది. అంతకు ముందెప్పుడో నేను కలిసినప్పుడు ఎంతో ఉద్వేగంతోనో కనిపించిన వాళ్లు, అంతే ఉద్వేగంతో కవిత్వం రాసిన వాళ్లు, సాహిత్య రంగంలో ఒక శిఖరానికి చేరతారనుకున్న వాళ్లల్లో ఎంతో మంది సాహిత్యానికి పూర్తిగా దూరమైపోవడం నేను చూశాను. కళాత్మకంగా ఉండలేకపోవడమే కాదు. మనుషులకు కూడా దూరమై, ఎక్కడో మగ్గిపోవడం చూశాను. నన్ను అన్నిటికన్నా అమితంగా బాధించే విషాదం ఇదే. ఒక కవి లేదా ఒక సృజనకారుడు తనను తాను బతికించుకోవడం ఈ రోజుల్లో క ష్టంగా ఉంది. హృదయగతంగా తనను తాను బతికించుకోవడం ఒక లక్ష్యంగా ఉండాలి. విషయాల్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా మందికి తెలియడం లేదు. అందుకే అర్ధంతరంగా ఆగిపోతున్నారు. ఏ ప్రయాణం అయినా బాలారిష్టాలను అధిగమించి , కొంత దూరం వెళ్లాక ఒక గొప్ప తాత్వికానందం కలుగుతుంది.

ఒకసారి ఆ ఆనందాన్ని పొందగలిగితే ఆ తర్వాత దాన్నించి పక్కకు వెళ్లాలనుకున్నా వెళ్లలేరు. ఆత్మానుభూతి అనంతంగా విస్తరిస్తూ, ప్రపంచాన్ని అల్లుకునే స్థితిలో ఎవరైనా తాము వెళుతున్న మార్గాన్ని ఎలా వదిలేస్తారు? బహుశా చాలా మంది ఆ స్థితి రావడానికి ముందే ఆ మహాసౌధపు ముఖద్వారం బయటనుంచే వెనక్కి వచ్చేస్తున్నారు. దుఃఖానుభూతి ఆనందానుభూతిగా మార్చుకోవడంలో విఫలం కావడమే ఈ స్థితికంతా కారణం. దుఃఖకారకాలను గుర్తించి, వాటిని అధిగమించినప్పుడే ఆ ఆనందానుభూతి సాధ్యమవుతుందని నా ఇన్నేళ్ల అనుభవం చెప్పింది.

గాడ్‌ఫాదర్‌లా...
ఏడేళ్ల క్రితం ఒకసారి కవి శిఖామణి వెంట వాళ్ల ఊరు యానాం వెళ్లాం. ఆ తర్వాత తిరిగి వచ్చేయడానికి కారు ఎక్కాం. అంతలో శిఖామణి వాళ్ల నాన్నగారు వచ్చారు. కొడుకును దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు... కారు కదిలింది. నాకు ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది. వెక్కివెక్కి ఏడ్చేశాను. నాకు ఊహ తెలిసీ తెలియక ముందే చనిపోయిన మా అమ్మ గుర్తుకొచ్చింది. 80 ఏళ్లు బతికి చనిపోయిన మా నాన్న గుర్తుకొచ్చాడు. నా మనసులో ఎక్కడో నా బాల్యం ఇంకా బతికి ఉందేమో అందుకే పొగిలిపొగిలి ఏడ్చాను. ఆయన బతికి ఉన్నన్నాళ్లూ తెలియని ఏదో ధైర్యం ఒకటి నాలో ఉండేది. మా నాన్న పోయాక ఏదో ఒంటరితనం నన్ను ముసురుకుంది. ఏ తల్లిదండ్రులైనా ఎంతకాలం ఉంటారు? వెనకో ముందో అందరూ వె ళ్లిపోతారు. మొత్తంగా కాకపోయినా ఎంతోకొంత ఆ ఖాళీని పూరించే మరో హృదయం, ఒక ఆత్మీయ హస్తం ఉంటే ఎంత బాగుండునో కదా అనిపించింది.

ఆ భూమికేదో నేను కూడా పోషించాలనిపించింది. అందుకే కవిగానే కాకుండా నాకంటే బాగా చిన్నవాళ్లయిన చాలామంది కవులకు నేనొక ఫాదర్‌లా ఉంటాను. గాడ్‌ఫాదర్‌లా ఉంటాను. ఆ ఆత్మీయతను పంచడానికి రక్తసంబంధమే ఉండనవసరం లేదు కదా! చనిపోయిన వాళ్లను వారికి తిరిగి ఇవ్వలేం. కానీ, మన ఆత్మీయ స్పర్శతో పోయిన ఆ బంధాల్లోకి ప్రవేశిస్తాం. విస్తరిస్తాం. ఒక్కోసారి ఆ రక్తబంధం కన్నా ఈ బంధమే గొప్పగా ఉండవ చ్చు. వాళ్ల జీవితంలో ఏర్పడిన ఖాళీని ఆశించిన దానికన్నా గొప్పగానూ పూరించవచ్చు. ఎవరి స్థాయిలో వారు ఆ ఖాళీని భర్తీ చేసే బాధ్యతను తీసుకోవడం చాలా అవసరమన్న ఒక ఆ్రర్దమైన సత్యాన్ని నా జీవితం నాకు నే ర్పింది.

Thursday 17 January 2013

ఫస్ట్ లవ్.. ఆ తర్వాతే సెక్స్‌

ఫస్ట్ లవ్.. ఆ తర్వాతే సెక్స్‌ అంటున్న మహిళలు : సైకాలజిస్టులు


romance couple

సాధారణంగా గృహిణులైన మహిళలు సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. అయితే, ఏ మహిళ అయిన తొలుత.. తన పట్ల భర్త లేదా పురుషుడు అమితమైన ప్రేమను కనుపరుస్తూ ఉండాలని కోరుకుంటుందట. ఆ తర్వాతే.. సెక్స్‌లో పాల్గొనాలని తహతహలాడుతుందట. ఈ విషయం నిపుణులైన మానసిక శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.

స్త్రీ, పురుషుల్లో శృంగార చర్య తగ్గటం కూడా ఒక కారణమని మానసిక శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అదే మానసిక శాస్త్రవేత్తలు మరో విషయం చెప్పారు. ప్రపంచంలో స్త్రీకి మించిన నెంబర్ వన్ సైకాలజిస్టు లేదని కూడా చెప్పారు.

ప్రధానంగా భాగస్వామి పడక గదిలో నిశ్శబ్ధంగా ఉన్నా.. ఆమె ప్రైవేట్ భాగాలను తాకినపుడు, నుదురుపై చేయి వేచినపుడు చేయిని తీసేస్తే సెక్స్‌ పట్ల అయిష్టంగా ఉందని గ్రహించాలని చెపుతున్నారు. దీనికి కారణం స్త్రీ ఎప్పుడూ ముందు ప్రేమ కోరుకొని ఆపై శృంగారం కావాలని కోరుకుంటుందని చెపుతున్నారు.

కానీ, పురుషుని విషయంలో మాత్రం ముందు సెక్స్‌లో పాల్గొని ఆ తర్వాత ప్రేమను పంచేందుకు అమితాసక్తిని చూపుతారని చెపుతున్నారు. అంతేకాకుండా, రతిలో పాల్గొనడం కూడా ఏ అర్థరాత్రి లేదా.. మంచి నిద్రా సమయంలో చేయడం మంచిది కాదని సలహా ఇస్తున్నారు.

మంచి నిద్ర సమయంలో శరీరంలోని కొన్ని అలసిపోయిన భాగాలు పూర్తిగా విశ్రాంతిని కోరుకుంటాయని, అలాంటపుడు స్త్రీని సెక్స్‌కు ప్రపోజ్ చేస్తే నో అనే సమాధానమే వస్తుందంటున్నారు. అదేసమయంలో పగటి పూట ఉండే కోపం.. పడక గదికి వచ్చేలోపు మాయం కావాలని అంటున్నారు.
అపుడే భార్యాభర్తల శృంగారం పూర్తి సంతృప్తితో సాగుతుందని చెపుతున్నారు. ఇలాంటి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే భార్యాభర్తల శృంగార జీవితం సాఫీగా సాగుతుందని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
పల్నాటి నాగమ్మ
'పల్నాటి యుద్ధం' తెలుగునాట ఇప్పటికీ ఒక సజీవ దృశ్యం. జరిగి 900 సంవత్సరాలైనా ఆ యుద్ధంలోని ప్రధాన పాత్రధారులందరూ పల్నాడు బయట కూడా చిరపరిచితులే. వారిలో నాయకురాలు నాగమ్మ ఒకరు. బ్రహ్మనాయుడులా ఆమె కూడా స్థానికురాలే అనుకుంటారు చాలామంది; కాని కాదు. ఆమె తెలంగాణ నుంచి వలస వెళ్లిన మహిళ. భారతదేశంలోనే ప్రప్రథమ మహిళా మంత్రిణిగా పేరు గాంచిన నాగమ్మ ... పుట్టింది, మరణించింది కూడా కరీంనగర్ జిల్లా పెగడపెల్లి మండలంలోని 'ఆరవెల్లి' గ్రామంలోనే. ఆమెకు అక్కడ ఒక గుడి ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఆ ఆలయం గురించే ఈ వ్యాసం.

కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారిలో ఆంజనేయస్వామి 'కొండగట్టు' దాటిన తర్వాత మల్యాల క్రాస్ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్లు వెళితే ఆరవెల్లి గ్రామం వస్తుంది. ప్రస్తుతం ఈ గ్రామం పెగడపెల్లి మండలంలో ఉండగా... పల్నాటి చరిత్రకారులు తమ రచనల్లో ఈ ప్రదేశాన్ని 'సబ్బి మండలం'గా పేర్కొన్నారు. ఆరవెల్లి గ్రామ శివారులో నాయకురాలు నాగమ్మకు ఒక గుడి ఉంది. గుడిపైన గోపురం కాకుండా, మట్టిపెంకులతో పైకప్పు నిర్మాణమై ఉంది. గుడి గోడలపై నాగమ్మ చిత్రాలు ఉన్నాయి. ఆవరణలో ధ్వజస్తంభం ఉంది. గుడి ఎదురుగా ఉన్న రావిచెట్టు మొదట్లో మూడు చిన్న రాతివిగ్రహాలు ఉన్నాయి.

ఇరవై అడుగుల లోతులో నాగమ్మ గర్భగుడి
నాగమ్మ విగ్రహముండే గర్భగుడి దాదాపు నేలమాళిగలో ఉన్నట్టుగా ఉంటుంది. గర్భగుడిలోకి దిగడానికి మెట్లున్నాయి. విగ్రహం అంత లోతులో ఎందుకుంది అని గ్రామస్తుల్ని అడిగినపుడు - నాగమ్మ పుట్టలో జీవసమాధి అయిందని కొందరు చెబితే, 'కొండల్రాయుడు' అనే వ్యక్తితో నాగమ్మ తలపడిందని, అతడు తొక్కితే నాగమ్మ పాతాళలోకానికి పోయిందని మరికొందరు చెప్పారు.

చరిత్ర కథనంలో ...
కీ.శే. కలువల వెంకట సుబ్బారావు రాసిన 'భక్తి పల్నాటి వీర చరిత్ర'లోనూ, మరో పల్నాటి పరిశోధకుడు డా. తంగిరాల సుబ్బారావు రాసిన 'పల్నాటి వీర కథాచక్రం'లోనూ, గురజాలకు చెందిన గుర్రం చెన్నారెడ్డి రాసిన 'పల్నాటి చరిత్ర'లోనూ నాగమ్మ ఆరవెల్లి నుంచి వలస వచ్చిన స్త్రీ అనే రాశారు. ఈ చివరి గ్రంథంలోని వివరాల ప్రకారం -
నాగమ్మ తండ్రి పేరు చౌదరి రామిరెడ్డి. వారిది వ్యవసాయ కుటుంబం. కరువుకాటకాలు, మశూచి వంటి వ్యాధులు ఆరవెల్లి గ్రామాన్ని తరచూ ఇబ్బంది పెడుతున్న కారణంగా రామిరెడ్డి నాగమ్మను తీసుకొని పల్నాడులోని జిట్టగ్రామాలపాడులో ఉన్న తన బావమరిది మేకపోతుల జగ్గారెడ్డి వద్దకు వెళ్తాడు. అక్కడ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి బతుకుతుంటాడు. గోపన్న మంత్రి పర్యవేక్షణలో నాగమ్మ చదువుతో పాటు సాముగరిడీలు, ధనుర్విద్య, అశ్వ శిక్షణలో ప్రావీణ్యం పొంది, సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషలలో పాండిత్యం సాధిస్తుంది. రాజనీతి, తత్వశాస్త్రాలని కూడా అధ్యయనం చేస్తుంది. రామిరెడ్డి మేనల్లుడైన సింగారెడ్డితో నాగమ్మ వివాహం జరుగుతుంది. వివాహమైన మూడు రోజులకే సింగారెడ్డి మరణించడంతో నాగమ్మ వితంతువు అవుతుంది. కొంతకాలం తర్వాత రామిరెడ్డి భూమిలో చెరువు తవ్వించే ప్రయత్నం చేస్తాడు అనుగురాజు. రామిరెడ్డి ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో, బ్రహ్మనాయుడు ఆగ్రహించి ఓ రోజు నిద్రలో ఉన్న రామిరెడ్డిని తాళ్ళతో మంచానికి కట్టివేసి పొందుగుల అడవుల్లోకి తీసికెళ్ళి హత్య చేయిస్తాడు.

ఆ తర్వాతి కథ అందరికీ తెలిసిందే. పల్నాటి యుద్ధం అయిపోయాక నాగమ్మ ఏమైందనేది కూడా గుర్రం చెన్నారెడ్డి పుస్తకంలో వివరంగా ఉంది. ఒక ముసలి స్త్రీ గుర్రం మీద ఆయుధాలను పెట్టుకుని యుద్ధరంగం నుండి నేరుగా ఆరవెల్లికే వచ్చిందనీ, ఊరి ప్రజలను పిలిచి తనను నాయకురాలంటారని, కలరా భయంతో తాను చిన్నతనంలోనే ఆరవెల్లి విడిచి మేనమామ ఊరికి వలస వెళ్ళానని, అక్కడ జరిగిన యుద్ధంలో ఒక మహావీరుణ్ణి ఓడించి చివరి రోజులు పుట్టిన ఊరిలో గడపడానికి వచ్చినట్టు చెప్పిందనీ రాశారు. గ్రామస్తుల యోగక్షేమాలను తెలుసుకోవడమే కాక, వారిని భయభ్రాంతులను చేస్తున్న దొంగలను తాను ఎదిరిస్తానని చెప్పిందట.

వారికి దొంగలను ఎదిరించడానికి తగిన శిక్షణ కూడా ఇచ్చిందట. చివరకు దొంగలను ఎదిరిస్తూనే ఆమె చనిపోయింది అని ఒక కథ తెలిపితే, కాదు కాదు నాగమ్మ తన చరమ దశలో స్వచ్ఛందంగా జీవసమాధి అయిందని కొందరు అంటారు. ఏదేమైనా తన ఊరి కొరకు పాటుపడిన నాగమ్మకు గుడికట్టి గ్రామదేవతగా ఆ గ్రామస్తులు నేటికీ ఆరాధిస్తున్నారు. ఆమె గుడికి తూర్పు వైపున ఉన్న నీటి వాగును నాయకురాలి వాగని, కొలనును నాయకురాలి నీటి మడుగని పిలుస్తున్నారు. వాగు పక్కనే ఉన్న ప్రాంతాన్ని నాయకురాలు కొండల్రాయుడితో యుద్ధం చేసిన ప్రదేశమని అంటారు. కొండల్రాయుడు గెలిచాడో నాగమ్మ గెలిచిందో ఇదమిత్థంగా తెలియదు. ఓడి ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు, గెలిచి నాగమ్మను పాతాళానికి తొక్కేసాడని కొందరు చెపుతారు. బుడిగజంగాలు చెప్పే కొండల్రాయుడి కథలో నాగమ్మ ప్రస్తావన చాలాసార్లు వస్తుంది.

'ఏడేండ్ల ప్రాయంలో
ఎగిరిపోయిన చిలక
యాడుందో ఏమైందో
ఎరికలేక పోయెరా
ముసల్దయి వచ్చింది అమ్మోరి తీరునా
అందరిని పసిగట్టి అడిగించినాది
నాయకురాలై నడిపించినాది
ఉసిగొలిపి జగడముల కమ్మించినాది
గుబాగుబా రక్తమే గుబ్బలేసింది
కొండల్రాయుడే గుర్రంతో తొక్కిస్తే
పాతాళలోకంల కూరుక పోయింది
రాయుడే... మన కొండల్రాయుడే..'
- ఇట్లా సాగుతుందది.

గురజాల ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి పల్నాడు మహోత్సవాల్ని ఏటా ఘనంగా జరుపుతున్నారు. ఆ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మన్న, నాగమ్మ, కన్నమదాసుల విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు. మరి తెలంగాణ రాజకీయ నాయకులు నాగమ్మ విషయంలో ఏం చేస్తున్నారు? నాగమ్మ తెలంగాణ ఆడపడుచని, దేశంలోనే ప్రప్రథమ మహిళా మంత్రిణి అన్న విషయం తెలంగాణలో ఎంతమందికి తెలుసు? నాగమ్మ తెలంగాణలో పుట్టి, చివరి దశలో తిరిగి తన సొంత ఊరు ఆరవెల్లి గ్రామానికి వెళ్ళిందని పల్నాటి రచయితలు, పరిశోధకులు పాతికేళ్ల క్రితమే ధృవీకరించినపుడు, అంతటి మహా నాయకురాలు మన గడ్డమీద పుట్టిందన్న విషయంపై తెలంగాణ చరిత్రకారులు, పరిశోధకులు ఇన్నేళ్ళయినా పూర్తిస్థాయిలో ఎందుకు పరిశోధనలు చేయలేదో అర్థం కాదు.

శ్రీనాథుడి కావ్యంలో...
పదిహేనవ శతాబ్దంలో శ్రీనాథుడు కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానంలో విద్యాధికారిగా పదవీ బాధ్యతలను నిర్వహించాడు. అప్పుడు చారిత్రక ప్రదేశాలన్నీ తిరిగి శ్రీనాథుడు రాసిన 'పల్నాటి యుద్ధం'లో కూడా నాగమ్మను ఆరవెల్లి నాగమ్మగానే రాశాడు.
'పంటరెడ్డి వారి పణతి యనంగా
ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రీ
మేకపోతులరెడ్డి మేనకోడలును
'ఆరవెల్లి' వారింటి అమరకోడలును
తరుణి నాగమయను తక్షణముంచు...'

ఓరుగల్లులో వీరోత్సవాలు...
వీరాచార సంప్రదాయం పేరిట ఏటా కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఓరుగల్లులలో (ఇప్పటి వరంగల్లు) పల్నాటి వీరోత్సవాలు జరిగేవి. ఓరుగల్లులో పల్నాటి వీరోత్సవాలు ఘనంగా జరిగినట్లు వినుకొండ వల్లభరాయుడు 16వ శతాబ్దిలోనే తన క్రీడాభిరామంలో పేర్కొన్నాడు. పల్నాటి వీరగాథల్ని ఓరుగల్లు వీథుల్లో ఆలపించడాన్ని ఆయన పద్యాలుగా రచించాడు.

(మరిన్ని వివరాలకు- కె.వి. నరేందర్ 94404 02871
సంగెవేని రవీంద్ర 099871 45310)

Thursday 10 January 2013

లలిత స్వర కమలం
జేసుదాస్ స్వరార్ణవ రసాస్వాదనకు సుస్వాగతం ! సుస్వర స్వాగతం! జేసుదాస్ సంగీత రంగంలో ఉత్తుంగ తరంగం! స్వర శిఖరం! స్వర వినీలాకాశంలో ఆయనది తారా స్థాయి! ధృవ తారా స్థాయి!
జేసుదాస్ గా ప్రసిద్ధులైన కట్టస్సెరి జోసెఫ్ ఏసుదాస్ 1940 జనవరి పదవ తేదీన, భారతీయ సంగీత స్వర పతాకాన్ని విశ్వ వినీలాకాశ వీధుల్లో రెపరెపలాడించడానికే జన్మించిన గాన గంధర్వుడు!

తన సుదీర్ఘ స్వర ప్రస్థానంలో చేసిన రాగ ప్రస్తారాలు అనంతం! అసంఖ్యాకం! అనితరసాధ్యం! తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం,హిందీ, బెంగాలి, గుజరాతి, మరాఠి, ఒరియా, పంజాబి, సంస్కృతం, తుళు, మాలే,రష్యన్, అరబిక్, లాటిన్, ఆంగ్ల భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడారు! అస్సామీస్, కాశ్మీరీ భాషల్లో తప్ప ఆయన అన్ని భాషల్లో పాడారు! పాడుతున్నారు! కులమతాలకతీతంగా సంగీతమే తన భాష అని విశ్వమానవుడైన ఒక అపూర్వ స్వర మేరు శిఖరం జేసుదాస్! అయ్యప్ప పాటైనా, ఏసు ప్రభువు పాటైనా ఆ గళంలో ఆర్తిగొలిపే భక్తి! అనితర సాధ్యం! కేరళీయులకు మాత్రం ఆయన నడిచే సప్త స్వర స్వరూపం!


తండ్రి అగస్టీన్ జోసెఫ్ దగ్గరే, జీవితాలను ప్రభావితం చేయగల జీవితకాలపు స్వర ప్రస్థానంలో, సరిగమల తొలి అడుగులు నేర్చుకున్నారు. శ్రీ వేచూర్ హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద మలి పాఠాలు కొన్నాళ్ళు మధ్యమంలో అధ్యయనం చేసినా, తారా స్థాయి శిక్షణ మాత్రం విఖ్యాత శాస్త్రీయ సంగీత గురువు శ్రీ చెంబెయ్ వైద్యనాథ భాగవతార్ దగ్గర పొందారు!


శాస్త్రీయ సంగీతంలో స్వరార్ణవం ! లలిత సంగీతంలో స్వర వికసిత, రాగ విలసిత సలలిత లలిత ప్రియ కమలం ! హిందూస్థానీ సంగీతంలో సైతం ఆయన స్వర సింధువు ! ఇక సినీ సంగీతంలో ఆయన అసాధారణ సంచలనం!

నేపధ్య గాయకుడిగా 1960లలో స్వర ప్రస్థానం ప్రారంభించిన జేసుదాస్, 1970వ దశకం మధ్యలో బాలీవుడ్ లో అడుగుపెట్టి కొన్నేళ్ళపాటు మరో గాయకుడికి అవకాశం లేకుండా చేశారు. 1972లో ఆనంద్ మహల్ చిత్రంతో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసినా మొదట విడుదలైన చిత్రం సలీల్ చౌదరి సంగీతం అందించిన ఛోటీసి బాత్!
దాదా, చిత్ చోర్, సావన్ కో ఆనేదో, టూటే ఖిలోనే, మాన్ అభిమాన్, ఆలాప్, పాయల్ కీ ఝంకార్, హైసియత్, దౌడ్, త్రిశూల్, నైయ్యా, ఛోటీసీ బాత్, హత్య, అగర్, స్వామి తదితర హిందీ చిత్ర గీతాలతో సంచలనం సృస్టించి ప్రపంచ వ్యాప్తంగా, చెదిరిపోని, చెరిగిపోని, అభిమానాన్ని, అభిమానులను సంపాదించుకున్నారు. జేసుదాస్ సంగీత దర్శకుల అభిమాన గాయకుడు! ఉషా ఖన్నా, రవీంద్ర జైన్, రాజ్ కమల్, బప్పి లహరి, ఎ.ఆర్.రెహ్మాన్, ఖయ్యాం, సలీల్ చౌదరి, సోనిక్ ఓమి, ఋఅజేష్ రోషన్,జైదేవ్ తదితర హిందీ సంగీత దర్శకులు జేసుదాస్ గళ మాధుర్యాన్ని, స్వర విద్వత్తును, విద్యుత్తును తమ బాణీల్లో బంధించి, మామూలు ప్రపంచంలోకి స్వరామృత జలపాతాలు ప్రవహింపచేశారు.

నేపధ్య గాయకుడిగా జేసుదాస్ సాధించిన పురస్కారాల రికార్డును ఈ క్షణం వరకు ఏ గాయకుడూ సమానం చేయడమే కాదు, దరిదాపులకు కూడా రాలేకపోయారు. ఉత్తమ గాయకుడిగా ఏడు జాతీయ పురస్కారాలు సాధించారాయన! 2006లో చెన్నైలోని ఎవిఎం స్టూడియోలో, ఒకే రోజు జేసుదాస్, నాలుగు దక్షిణాది భాషల్లో పదహారు పాటలను రికార్డు చేశారు!


ప్రపంచవ్యాప్తంగా జేసుదాస్ అనేక ప్రముఖ నగరాల్లో కచేరీలిచ్చారు. 1965లోనే ఆయన రష్యా ప్రభుత్వ ఆహ్వానం మీద, రష్యాలోని వివిధ నగరాల్లో స్వర యాత్రచేసి, రేడియో కజగిస్థాన్ లో, రష్యన్ భాషలో పాట పాడారు. 2001లో సంస్కృతంలో అహింస అనే ఆల్బం పాడారు! లాటిన్, ఆంగ్ల భాషల్లో, ఫ్యూజన్ కలిపి, కర్ణాటక బాణీలో కూడా గానం చేశారు. గల్ఫ్ దేశాల సందర్శనలో ఆయన అరబిక్ పాటలను కర్ణాటక బాణీల్లో పాడేవారు. తరచుగా విదేశాల్లో పర్యటిస్తూ, భారతీయ స్వర సాంస్కృతిక రాయబారిగా వ్యవహరించేవారు!


కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడిగా, అధికారికంగా నియమితులైన ఏకైక గాయకుడాయన! 1975లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ పురస్కారాలందుకున్నారు. 1999 నవంబర్ లో పారిస్ లో జరిగిన 'సంగీతంతో శాంతి కార్యక్రమంలో సంగీత రంగంలో శాంతిదూతగా విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు.


ఇక తెలుగు చలన చిత్ర రంగంలో జేసుదాస్ గాత్రానికి మన సంగీత దర్శకులిచ్చే విశిష్ట స్థానానికి, ఆయన పాడిన పాటలే స్వర నిదర్శనం! 1976లో అంతులేని కధ చిత్రంతో మొదలైన ఆయన తెలుగు చలనచిత్ర నేపధ్య గాన యానం, ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా సాగుతోంది. కె.బాలచందర్, కె.విశ్వనాధ్ లాంటి ఎందరో దిగ్దర్శకులు ఆయన గాత్రంతోనే తమ కధలకు కొత్త వన్నెలు, చిన్నెలు దిద్దుకున్నారు. జేసుదాస్ పాట లేకుండా హీరో మోహన్ బాబు సినిమా తీయరు! తెర వెనుక జేసుదాసు పాటే తన సినిమాకు ఆశీస్సులు, కాసులు అని బలంగా నమ్ముతారు మోహన్ బాబు! సందర్భం కలిస్తే, తాను తలిస్తే జేసుదాస్ ప్రస్తావన లేకుండా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం, అదేనండీ, మన అభిమాన బాలు, జేసుదాసును తాను పాడే, తాను పాడించే ఏ స్వర కార్యక్రమంలోనైనా సభక్తికంగా తలచుకుంటారు.
ఈ రోజు జేసుదాసు పుట్టినరోజు! పుంభావ స్వర సరస్వతికి జన్మదిన శుభాకాంక్షలు! 

లలిత స్వర కమలం
జేసుదాస్ స్వరార్ణవ రసాస్వాదనకు సుస్వాగతం ! సుస్వర స్వాగతం! జేసుదాస్ సంగీత రంగంలో ఉత్తుంగ తరంగం! స్వర శిఖరం! స్వర వినీలాకాశంలో ఆయనది తారా స్థాయి! ధృవ తారా స్థాయి!
జేసుదాస్ గా ప్రసిద్ధులైన కట్టస్సెరి జోసెఫ్ ఏసుదాస్ 1940 జనవరి పదవ  తేదీన, భారతీయ సంగీత స్వర పతాకాన్ని విశ్వ వినీలాకాశ  వీధుల్లో రెపరెపలాడించడానికే జన్మించిన గాన గంధర్వుడు!
 
తన సుదీర్ఘ స్వర ప్రస్థానంలో చేసిన రాగ ప్రస్తారాలు అనంతం! అసంఖ్యాకం! అనితరసాధ్యం! తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం,హిందీ, బెంగాలి, గుజరాతి, మరాఠి, ఒరియా, పంజాబి, సంస్కృతం, తుళు, మాలే,రష్యన్, అరబిక్, లాటిన్, ఆంగ్ల భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడారు! అస్సామీస్, కాశ్మీరీ భాషల్లో తప్ప ఆయన అన్ని భాషల్లో పాడారు! పాడుతున్నారు! కులమతాలకతీతంగా సంగీతమే తన భాష అని విశ్వమానవుడైన ఒక అపూర్వ స్వర మేరు శిఖరం జేసుదాస్! అయ్యప్ప పాటైనా, ఏసు ప్రభువు పాటైనా ఆ గళంలో ఆర్తిగొలిపే భక్తి! అనితర సాధ్యం! కేరళీయులకు మాత్రం ఆయన నడిచే సప్త స్వర స్వరూపం!
 
తండ్రి అగస్టీన్ జోసెఫ్ దగ్గరే, జీవితాలను ప్రభావితం చేయగల జీవితకాలపు స్వర ప్రస్థానంలో, సరిగమల తొలి అడుగులు నేర్చుకున్నారు. శ్రీ వేచూర్ హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద మలి పాఠాలు కొన్నాళ్ళు మధ్యమంలో అధ్యయనం చేసినా, తారా స్థాయి  శిక్షణ మాత్రం విఖ్యాత శాస్త్రీయ సంగీత గురువు శ్రీ చెంబెయ్ వైద్యనాథ భాగవతార్ దగ్గర పొందారు!
 
శాస్త్రీయ సంగీతంలో స్వరార్ణవం ! లలిత సంగీతంలో స్వర వికసిత, రాగ విలసిత సలలిత లలిత ప్రియ కమలం ! హిందూస్థానీ సంగీతంలో  సైతం ఆయన స్వర సింధువు ! ఇక సినీ సంగీతంలో ఆయన అసాధారణ సంచలనం!
నేపధ్య గాయకుడిగా 1960లలో స్వర ప్రస్థానం ప్రారంభించిన జేసుదాస్, 1970వ దశకం మధ్యలో బాలీవుడ్ లో అడుగుపెట్టి కొన్నేళ్ళపాటు మరో గాయకుడికి అవకాశం లేకుండా చేశారు. 1972లో ఆనంద్ మహల్ చిత్రంతో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసినా  మొదట విడుదలైన చిత్రం సలీల్ చౌదరి సంగీతం అందించిన ఛోటీసి బాత్!
దాదా, చిత్ చోర్, సావన్ కో ఆనేదో, టూటే ఖిలోనే, మాన్ అభిమాన్, ఆలాప్, పాయల్ కీ ఝంకార్, హైసియత్, దౌడ్, త్రిశూల్, నైయ్యా, ఛోటీసీ బాత్, హత్య, అగర్, స్వామి తదితర హిందీ చిత్ర గీతాలతో సంచలనం సృస్టించి ప్రపంచ వ్యాప్తంగా, చెదిరిపోని, చెరిగిపోని, అభిమానాన్ని, అభిమానులను సంపాదించుకున్నారు. జేసుదాస్ సంగీత దర్శకుల అభిమాన గాయకుడు! ఉషా ఖన్నా, రవీంద్ర జైన్, రాజ్ కమల్, బప్పి లహరి, ఎ.ఆర్.రెహ్మాన్, ఖయ్యాం, సలీల్ చౌదరి, సోనిక్ ఓమి, ఋఅజేష్ రోషన్,జైదేవ్ తదితర హిందీ సంగీత దర్శకులు జేసుదాస్ గళ మాధుర్యాన్ని, స్వర విద్వత్తును, విద్యుత్తును తమ బాణీల్లో బంధించి, మామూలు ప్రపంచంలోకి స్వరామృత జలపాతాలు ప్రవహింపచేశారు.
 
నేపధ్య గాయకుడిగా జేసుదాస్ సాధించిన పురస్కారాల రికార్డును ఈ క్షణం వరకు ఏ గాయకుడూ సమానం చేయడమే కాదు, దరిదాపులకు కూడా రాలేకపోయారు. ఉత్తమ గాయకుడిగా ఏడు జాతీయ పురస్కారాలు సాధించారాయన! 2006లో చెన్నైలోని ఎవిఎం స్టూడియోలో, ఒకే రోజు జేసుదాస్, నాలుగు దక్షిణాది భాషల్లో పదహారు పాటలను రికార్డు చేశారు! 
 
ప్రపంచవ్యాప్తంగా జేసుదాస్ అనేక ప్రముఖ నగరాల్లో కచేరీలిచ్చారు. 1965లోనే ఆయన రష్యా ప్రభుత్వ ఆహ్వానం మీద, రష్యాలోని వివిధ నగరాల్లో స్వర యాత్రచేసి, రేడియో కజగిస్థాన్ లో, రష్యన్ భాషలో పాట పాడారు. 2001లో సంస్కృతంలో అహింస అనే ఆల్బం పాడారు! లాటిన్, ఆంగ్ల భాషల్లో, ఫ్యూజన్ కలిపి, కర్ణాటక బాణీలో కూడా గానం చేశారు. గల్ఫ్ దేశాల సందర్శనలో ఆయన అరబిక్ పాటలను కర్ణాటక బాణీల్లో పాడేవారు. తరచుగా విదేశాల్లో పర్యటిస్తూ, భారతీయ స్వర సాంస్కృతిక రాయబారిగా వ్యవహరించేవారు!
 
కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడిగా, అధికారికంగా నియమితులైన  ఏకైక గాయకుడాయన! 1975లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ పురస్కారాలందుకున్నారు. 1999 నవంబర్ లో పారిస్ లో జరిగిన 'సంగీతంతో శాంతి కార్యక్రమంలో సంగీత రంగంలో శాంతిదూతగా విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు.
 
ఇక తెలుగు చలన చిత్ర రంగంలో జేసుదాస్ గాత్రానికి మన సంగీత దర్శకులిచ్చే విశిష్ట స్థానానికి, ఆయన పాడిన పాటలే స్వర నిదర్శనం! 1976లో అంతులేని కధ చిత్రంతో మొదలైన ఆయన తెలుగు చలనచిత్ర నేపధ్య గాన యానం, ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా సాగుతోంది. కె.బాలచందర్, కె.విశ్వనాధ్ లాంటి ఎందరో దిగ్దర్శకులు ఆయన గాత్రంతోనే తమ కధలకు కొత్త వన్నెలు, చిన్నెలు దిద్దుకున్నారు. జేసుదాస్ పాట లేకుండా హీరో మోహన్ బాబు సినిమా తీయరు! తెర వెనుక జేసుదాసు పాటే తన సినిమాకు ఆశీస్సులు, కాసులు అని బలంగా నమ్ముతారు మోహన్ బాబు! సందర్భం కలిస్తే, తాను తలిస్తే జేసుదాస్ ప్రస్తావన లేకుండా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం, అదేనండీ, మన అభిమాన బాలు, జేసుదాసును తాను పాడే, తాను పాడించే ఏ స్వర కార్యక్రమంలోనైనా సభక్తికంగా తలచుకుంటారు.

Tuesday 8 January 2013

కొత్త పుస్తకాలు

నిజాం పాలనలో లంబాడాలు
(Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams)
- భంగ్యా భుక్యా






ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.

దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.

చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి. ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.

దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.

- భంగ్యా భుక్యా
(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:

''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''
..............................
...............................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''
..............................
..............................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''
..............................
...................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:

భంగ్యా భుక్యా పన్నెండేళ్ళ పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించారు. ప్రస్తుతం ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్‌ విభాగంలో చరిత్ర అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఎంఫిల్‌ చేసిన ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నుంచి అంతర్జాతీయ ఫెలోషిప్‌ సాధించి ఇంగ్లండ్‌లోని వార్‌విక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేశారు.

కులం ఆదివాసీ జాతుల చరిత్రలు, అస్తిత్వ రాజకీయాలు, జాతులు - తెగలపై రాజ్యం దాని యంత్రాంగం చూపే ప్రభావం వంటి సామాజిక ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన అధ్యనం చేస్తున్న ఆయన లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎడిన్‌బరో, వార్‌విక్‌ తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయజీ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం మధ్య భారతంలోని గోండు జాతిపై అధ్యయనం జరుపుతున్నారు.


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా

ఆంగ్ల మూలం : Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams, Orient Blackswan, Hyderabad, 2010
తెలుగు అనువాదం : ఆకెళ్ల శివప్రసాద్‌

157 పేజీలు, వెల : రూ.80/-

ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com
నిజాం పాలనలో లంబాడాలు
 (Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams) 
- భంగ్యా భుక్యా


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా
 


ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి  ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.

దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.

చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి.  ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.

దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.

- భంగ్యా భుక్యా
(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:

''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''
.............................................................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''
............................................................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''
.................................................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:

భంగ్యా భుక్యా పన్నెండేళ్ళ పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించారు. ప్రస్తుతం ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్‌ విభాగంలో చరిత్ర అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఎంఫిల్‌ చేసిన ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నుంచి అంతర్జాతీయ ఫెలోషిప్‌  సాధించి ఇంగ్లండ్‌లోని వార్‌విక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేశారు.

కులం ఆదివాసీ జాతుల చరిత్రలు, అస్తిత్వ రాజకీయాలు, జాతులు - తెగలపై రాజ్యం దాని యంత్రాంగం చూపే ప్రభావం వంటి సామాజిక ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన అధ్యనం చేస్తున్న ఆయన  లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎడిన్‌బరో, వార్‌విక్‌ తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయజీ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం మధ్య భారతంలోని గోండు జాతిపై అధ్యయనం జరుపుతున్నారు.


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా

ఆంగ్ల మూలం : Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams, Orient Blackswan, Hyderabad, 2010
తెలుగు అనువాదం : ఆకెళ్ల శివప్రసాద్‌

157 పేజీలు, వెల : రూ.80/-

ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com