Tuesday 22 January 2013

రాహూల్.....ఆలోచించు....

 రాహూల్...... చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మొద్దు

మా తాత ఈ దేశం కి స్వతంత్రం తెచ్చాడు, త్యాగం చేశాడు, మా నాయనమ్మ బ్యాంక్ లని జాతీయం చేసింది ఇద్దరు పని వాళ్లే ఆమెని చంపారు, మా నాన్న త్యాగం అనుపమానం ఇవీ రాహుల్ గాంధీ ఉపన్యాస ప్రధాన అంశాలు. రాహుల్ గాంధీ ఒక్కటే ఇప్పుడు ఆలోచించవలసింది మరి అంతా అద్భుతాలు చేస్తే 480 సీట్ల కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఎందుకు ఆధార పద వలసి వచ్చింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి నెహ్రూ చేసిన త్యాగం ఏమిటి? జమిందారీ వ్యవస్ధ తరపున ఆంగ్లేయులతో సంబంధాలు నెరపటం కాకుండా ఏం త్యాగం స్వాతంత్రానికి ముందు మీ కుటుంబం చేసింది అన్నది తెలుసుకోవాలి కదా? భగత్ సింగ్ ఊరికి అడ్డు పడ్డారా? సుబాష్ చంద్ర బోస్ కనబడితే బ్రిటిష్ సైన్యానికి అప్పగిస్తాం అని ఎలా సంతకం పెట్టారు? కాశ్మీర్ ని ఐక్యరాజ్య సమితికి తీసుకు వెళ్లింది మీ తాత కాదా? ఆ రావణ కాష్టం మీ తాత తెచ్చిన తంటా కాదా? లాహోర్ వరకు ఆక్రమించుకున్నా భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించి పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ని వెనక్కి తీసుకొని పేరు కోసం తపించే పనికిమాలిన చరిత్ర మీ నాయనమ్మది కాదా? బ్యాంక్ ల జాతీయ కరణ ద్వారా పేదలకి ఒరగబెట్టరా? లక్షల కోట్లు దిగమింగిన బడా బాబులకి పేదల సొమ్ము డిపాజిట్ల రూపంలో ఉంచినవి అప్పగించిన ఆ బ్యాంక్ వ్యవస్ధ తీరుతో విసిగి కాదా ఇప్పుడు ప్రైవేట్ బాంక్స్ పెరిగిపోయింది. అత్యవసర పరిస్ధితి మీ నాయనమ్మ మా ప్రజాస్వామ్యానికి ఇచ్చిన నల్ల బహుమతి కాదా? బియంత్ సింగ్ అనే ఉగ్రవాదికి మీ నాయనమ్మ పాలు పోసి పెంచలేదా, ఆ తర్వాత ఆ ఉగ్రవాదమే కదా ఆమె ఉసురు తీసింది? మన దేశపు తమిళుల పైన శ్రీలంకలో మన సైన్యం మీద దాడి చేయిస్తే నే కదా మీ నాన్న పైన ప్రతీకారం తీర్చుకుంది. అయోధ్యలో శిలాన్యాస్ చేసింది మీ నాన్న కాదా? అవేమీ తెలియని నువ్వు రాజకీయాలలో ఏం నేర్చుకుంటావు . సెల్ ఫోన్ తమ నాన్న తెచ్చిన సంస్కరణల ఫలితం అని అబద్దలు ఎందుకు ? ఎన్ డీ ఏ హయాంలో ఇచ్చిన స్పెక్ట్రమ్ అనుమతుల తర్వాత కదా అది సాద్యము అయ్యింది. ఫోన్ కోసం పాతిక సంవత్సరాలు, గ్యాస్ కోసం 49 సంవత్సరాల పాటు వెయిట్ చేయించిన ఘనత మీ కుటుంబానిది. అయితే అడగ్గానే ఇచ్చేలా చూసిన ఘనత ఎన్ డీ ఏ ది. ప్రభుత్వ టీవీ చానల్ (దూర దర్శన్), రేడియో తప్ప ఏమీ లేకుండా చేసిన మీ పార్టీ 50 ఏళ్ల పాలన తర్వాత ఇన్ని టీ వీ చానల్స్ కి అనుమతులు వీ పీ సింగ్ హయాంలో ప్రారంభం అయ్యి ఎన్ డీ ఏ హయాంలో పతాక స్ధాయికి చేరిన సంగతి రాహూల్ తెలుసుకున్నట్లు లేదు. కాస్త ఈ దేశం గురించి ఖత్రోచీ స్నేహితురాలు అయిన మీ అమ్మ ని అడిగితే ఏం చెబుతుంది నాయనా ఈ దేశ ప్రజలని అడిగితే చెబుతారు. మా తాతలు ఈ దేశం కోసం త్యాగం చేశారు అని కాకుండా ఈ దేశ అభివృద్ధి నిరోదకానికి మా కుటుంబం చేసిన తప్పులు క్షమించండి ఇక పైన అయినా మేము మిగతా వాళ్ళకి మల్లే సేవకి ప్రయత్నిస్తాము అని చెబితే నువ్వు యూత్ లీడర్ వి అవుతావేమో.....ఆలోచించు....

 

No comments:

Post a Comment