Sunday 30 December 2012

సాహిత్యం

బజరా ‘వాస్తవిక’కథలు
బమ్మిడి జగదీశ్వర రావు కథలన్నీ పాఠకుల్లో ఒక ఆలోచననీ, ‘వ్యక్తిస్థాయి’ నుండి ‘సామాజిక స్థాయి’కి అనే ఎదుగుదలకు చెందిన సంఘర్షణనీ పురిగొల్పే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వ్యవస్థలోని జీవన సంక్షోభానికి కారణాలెైన భూమి సమస్య, దళారీ పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు, సామ్రాజ్యవాదం వెదజల్లే వస్తు వ్యామోహ సంస్కృతి, డబ్బు సంస్కృతి ప్రజల్ని ఎంతటి హింసకైనా గురిచేస్తున్నాయనే వాస్తవానికి చెందిన ‘మౌలిక అంశాల్ని’ అందించడంలో బమ్మిడి కథలు చాలా వరకూ ప్రయోజకత్వాన్ని సాధించాయి.

bammidసాహిత్యం సమాజానికి అద్దం. అందువల్లే మంచి రచయితలు తాము ఎన్నుకున్న సాహితీ ప్రక్రియ ఏదెైనా సరే ఆ ప్రక్రియలో సమకాలీన సమాజాన్ని, వివిధ సామాజికాంశాల్ని ప్రతిఫలిస్తూ సామాజిక స్పృహను ప్రజ ల్లో కలిగిస్తుంటారు. ఆ కోణంలో చూస్తే బమ్మిడి జగదీశ్వర రావు కథలన్నీ సామాజిక స్పృహ కలిగినవే. ఈయన విప్లవ కథకుడు. ఈయన కథలన్నిటికీ సామాజిక జీవితమే ముడి సరుకు. ఈయన కథలన్నీ ఉపయోగితా విలువకూ, మానవ సంబంధాలకూ మధ్య జరిగిన సంఘర్షణలో- మానవ సంబంధాలే గెలుస్తాయని నిరూపించాయి. నిజానికి ఈ ఉపయోగితా విలువ కథలో మొదటి నుంచీ ఉంది. దాన్ని విమర్శకులు ఎంతబాగా చూపగలిగితే పాఠకులకు మానవ సంబంధాల్లో వచ్చే ఘర్షణల మూలాలు అంత బాగా అర్థమౌతాయి. ఆ ఆర్థిక సంబంధాల సారాంశాన్ని విప్పి చెప్పే సిద్ధాంతాన్ని జీర్ణించుకున్న రచయితే ఆ దృష్టితో మానవ సంబంధాలను చిత్రీకరించగలడు. ఇలా ఒక సిద్ధాం త నిబద్ధతతో జగదీశ్వరరావు మానవ జీవితంలోని పలు కోణాల్ని చూశాడు, చూపించాడు.

ఈయన కథలు చదువుతుంటే వాస్తవిక జీవితం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. ఈయన కథల్లో సమకాలీన సమా జం, ఆ సమాజంలోని మంచి చెడు పార్శ్వాలు, సాంఘిక రాజకీయ సమస్యలు కన్పిస్తాయి. ఈ కథల్లో సూటితనం ఉంది, స్పష్టత ఉంది. ఈయన ఎన్నుకున్న పాత్రలు కూడా బడి పంతుళ్లు, వ్యవసాయ దార్లు, దగా కోరులు, దగా పడ్డవాళ్లు, ప్రేమ రాహిత్యంతో కృంగిపోయేవాళ్లు, స్వార్థపరు లెైన రాజకీయ నాయకులు, నిస్సహాయు లు, నక్సలెైట్లు, పోలీసు దౌర్జన్యాలకు గురౌ తున్న అమాయకులు, దగా పడ్డ రెైతులు, పురుషాధిక్యతకు బలెైన స్త్రీమూర్తులు, చేతనా చేతనమైన వస్తు ప్రపంచంలో తిరు గాడుతూ కనిపిస్తారు.
బమ్మిడి తన కథల్లో కలిగించిన సామాజిక సృహను దృక్పథపరంగా చూస్తే ఆయన రాసిన ‘మట్టి తీగలు’ కథా సంకలనానికి ముందుమాట రాసిన వరవరరావు చెప్పి నట్లు- మానవ సంబంధాలు, పరారుూకరణ, పితృస్వామ్య వివక్ష ప్రధానంగా కనిపిస్తాయి.

మానవ సంబంధాలు సంక్లిష్టమౌతున్న మౌలిక యథార్థాన్ని సామాజిక స్పృహ కలిగిన బమ్మిడి తన కథల్లో ఆవిష్కరించాడు.బమ్మిడి జగదీశ్వరరావు కథల్లోని సామాజిక జీవితాన్ని మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల సమ స్యలు, వ్యావసాయిక సమస్యలు, ఇతర అంశాలుగా విభ జించి విశ్లేషించుకుంటే ఓ స్పష్టమైన అవగాహన కలుగుతుంది.
ఆరోగ్యవంతమైన మానవ సమాజ మనుగడకు కుటుంబమే పునాది. కౌటుంబిక జీవితం కేవలం వంశాన్ని నిలిపే సాధనమే కాదు, సాంస్కృతిక సంప్రదాయలను వ్యాపింపజేసే వాహిక. అయితే అనేక సామాజిక పరిణా మాలు మానవ జీవితంలోని అన్ని అంశాల్ని స్పృశించినట్లు గానే కుటుంబ వ్యవస్థను కూడా ఎన్నో ఒడిదుడుకులకు లోను చేసింది. సామాజిక జీవనంలోని ‘ఆర్థిక విలువల’ దుష్ర్పభావం కుటుంబ వ్యవస్థపెై చాలా బలంగా పడింది. కుటుంబంలోని నెైతిక విలువలు ఆర్థిక విలువల ముందు తలవంచక తప్పలేదు.

బమ్మిడి రాసిన ‘మట్టితీగలు’ కథ కుటుంబ వ్యవస్థలోని దారుణ పరిణామాలకు సజీవ సాక్ష్యం. వృద్ధాప్యంలో కొడు కుల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురౌతున్న తల్లిదండ్రుల హృదయ వేదనకు, మానసిక అలజడికి అక్షర రూపం. ఎంతసేపూ ఆస్తులకే తప్ప ఆ ఆస్తులను కష్టపడి సంపా దించిన వ్యక్తులకు విలువ ఇవ్వలేని దౌర్భగ్యపు కుటుంబ వ్యవస్థ మనది. ఆ వ్యవస్థ వికృత రూపాలే స్వార్థపరులెైన కొడుకులు, కూతుళ్లు. ఆర్థిక లావాదేవీలుగా మారిన కుటుంబ సంబంధాలు వృద్ధులకు మిగిల్చిన విషాదాన్ని ఈ కథ చాలా హృద్యంగా వివరించింది. ఈ కథలో పిల్లలకు దూరమైన ఒక తల్లి ఆవేదన పాత ఇతివృత్తమే అయినా, ఆ దూరానికి బమ్మిడి వెలికి తీసిన వాస్తవ కారణాలు కొత్తవి. ఈ కథలోని ముసలి తల్లి పడే ఆవేదనను కుటుంబ వ్యవస్థలోని నెైతిక విలువల పతనానికి పరాకాష్ఠగా చెప్పు కోవచ్చు.

‘ఒక ఒర రెండు కత్తులు’ కథ కూడా కుటుంబ సంబం ధాల్లోని వెైఫల్యాన్ని స్పృశించిన కథే. అన్నదమ్ములకే కాదు ఆలు మగలకు కూడా ఆస్తిపాస్తుల తగా దాలు తప్పవని, ఆ తగాదాల వల్ల మానవ సంబంధాలు విచ్ఛిన్నమై ఆర్థిక సంబంధాలు మెరుగవుతాయని రచయి త అభిప్రాయపడ్డాడు. ఈ కథ ఉత్తరాం ధ్రలో మధ్యతరగతి పేద కుటుంబాలను దగ్గరగా చూసి రాసిన కథ. పురుష స్వామ్య సమాజంలో పురుషులెలా ఉం టారో, వారి అహంభావం వల్ల స్త్రీలు ఎంతగా మానసిక ఒత్తిడికి గురెై నలిగి పోతున్నారో ఈ కథలో బమ్మిడి వివరిం చాడు. నేటి తరం కథా రచయితలు వర్తమాన సంక్లిష్ట జీవన కోణాల్ని చిత్రిస్తూ జీవిత విస్తృతికి అక్షర రూప మిస్తున్నారు. మానవ సంబంధాల పెనుగులాటలు, విజ యాలు, వెైఫల్యాలు, విలువల దిగజారుడుతనం అన్నీ కథల్లోకి ప్రవేశించి మానవ సంబంధాలపట్ల ఓ అవగాహ నను ఉన్నతీకరిస్తున్నారు. ఈనాటి కథకు ప్రధాన ఇతి వృత్తం మానవ సంబంధాల ఘర్షణేనని బమ్మిడి కథలు చాలా బలంగా చూపుతాయి.
బమ్మిడి కథల్లోని మానవ సంబంధాల విశ్లేషణకు పరాకాష్ఠ ఆయన రాసిన ‘వెలుగు దారి వెతుకు దారి’ కథ. పట్నవాసపు కృత్రిమత్వం మధ్య పల్లె నిర్మలత్వం ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటుంది.

సరిగ్గా ‘వెలుగు దారి వెతుకు దారి’ కథలో గోదావరమ్మ పరిస్థితి అంతే. పట్నంలో మృగ్యమైపోయిన ఆప్యాయతలు, అనురాగాలకోసం ఆమె తన పల్లె వెైపు దృష్టి సారిస్తుంది. అయితే సామ్రాజ్యవాద సంస్కృతి కారణంగా పెచ్చుమీరిన పరారుూకరణ, ధన సంస్కృతి మూలంగా లుప్తమైపోయిన మానవసంబంధాల మధ్య గ్రామ సీమలు మునుపటిలాగా ఉన్నాయా? అంటే లేవు అనే విషయాన్ని ఈ కథ తెలియజేసింది.మనిషి జీవితంలో చీకటి తప్ప ఇంకేమీ మిగలని ఒక ఉదాత్త జీవిత చిత్రాన్ని జగదీశ్వరరావు తన కథల్లో ఆవిష్కరించాడు.ఒక వ్యక్తి మనస్సును, శరీరాన్ని, మేధస్సును తనకోసం, ఇతరుల కోసం స్వేచ్ఛగా వినియోగించుకోవడంలోని అను భవమే జీవితం. అయితే ఇలా జీవితాన్ని అందరూ స్వేచ్ఛ గా అనుభవించాలంటే ప్రతి ఒక్కరికి కొన్ని నియమాలు, స్వేచ్ఛకి పరిమితులు తప్పవు. ఈ నియమాలు, పరిమితులు అవసరం మేరకు అవగాహనతో ఆచ రించిన వారి జీవితం వారి చేతుల్లో ఉం టుంది.

కాని సమాజంలో కొంతమంది తమ స్వేచ్ఛ కోసం, తమ జీవితం కోసం పరిమితులు, నియమాలు ఎదుటివారిపెై అతిగా రుద్దడం జరగొచ్చు. ఈ పితృస్వా మ్య సమాజంలో పురుషులు స్త్రీలపట్ల ఇటువంటి వెైఖరే అనుసరించారు. స్త్రీ శరీరాన్ని, మనస్సుని, మేధని అణచివేసి ఆమె స్వేచ్ఛకి పరిమితులు విధించే భావ జాలం అందించారు. ఈ భావజాల ప్రభా వం ఎంత తీవ్రంగా ఉందో, దీనివల్ల స్త్రీలు ఎంతటి అణచి వేతకి, హింసకి గురవుతున్నారో, ఎన్ని భ్రమలు వారి చుట్టూ ఉన్నాయో స్పష్టం చేస్తూవాటిని ఎలా ఛేదించాలో బమ్మిడి తన కథలో చిత్రించాడు. స్త్రీల జీవితంలోని అన్ని కోణాలను పరిశీలించి స్త్రీ పురుషుల మధ్య వివక్షని, దోపిడీని, లెైంగిక హింసను, వివాహ కుటుంబ వ్యవస్థల్లోని పితృస్వామ్య భావజాల ప్రభావాన్ని స్పష్టం చేయడమేగాక, స్త్రీల శరీరాల చుట్టూ ఉన్న భ్రమల్ని ఛేదించడానికి ప్రయ త్నించాడు.

స్త్రీలు తమని తాము తిరస్కరించుకుని, తమని తాము లేకుండా చేసుకునే క్రమంలోకి వివహమనే వ్యవస్థ ద్వారా ఎట్లా వెడతారో ‘సరుకు’ అనే కథలో బమ్మిడి వివరించాడు. ఈ కథలో రాజేశ్వరి పెళ్లికోసం పేరు మార్చుకుంటుంది. ప్రదానంనాడు ఆమె వేలికున్న చిన్న లోపాన్ని చూసి ఆమెకు ఐదునిమిషాల ముందు కట్టబెట్టిన చీరా జాకెట్‌ విప్పేసుకు పోతారు పెళ్లికొడుకు తాలూకు మనుషులు. ఈ కథ చదివి వాళ్లమీద కోపం తెచ్చుకోవడం చాలా సహజం. లోకం లోఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనుకుని, మనం మరీ అలాంటి వాళ్లం కాదులే అని పాఠకులను తృప్తి పడనిస్తే ‘సరుకు’ కథా ప్రయోజనం నెరవేరదు. వివాహ వ్యవస్థ ఇలాంటి రాక్షసులను తయారు చేస్తుందనీ, ప్రతి స్త్రీ ఏదో ఒక స్థాయిలో ఈ హింసకు గురవుతుందని అర్థం చేసు కున్నప్పుడే మనం సమూలమైన మార్పు గురించి ఆలోచిస్తాం.

ఈ సమాజంలో భార్య మీద కంటే తన సంబంధంలోకి వచ్చిన ఇతర స్త్రీల మీద ఎక్కువ హింస జరిపే అవకాశం మగవాడికి ఎంత ఉందో బమ్మిడి రాసిన ‘రెక్కల గూడు’ కథ చెబుతుంది. ‘లక్క పిడతలు’ బమ్మిడి కథల్లో జెండర్‌ వివక్షకు చాలా సూక్ష్మంగా చూపిన మంచి కథ. ఈ స్త్రీ పురుష వివక్షను ప్రసార సాధనాలు మరింత స్థిరపడేలా చేసే క్రమం గురించి ‘మా ఇంట్లో మహా భూతం’ కథ చిత్రించింది. వర్గం, లింగం రెండూ అణ చివేత క్రమంలో ఒకదాని కొకటి సహాయ పడుతున్నాయనీ, వర్గ దోపిడీ, పురుషా ధిపత్యమూ ఒకదాని నుంచిఒకటి విడదీయలేనంతగా పెనవేసుకుపోయి ఉన్నాయనే విషయాన్ని బమ్మిడి కథలు తెలియజేస్తాయి.
గ్రామీణ వ్యవసాయరంగం ఎదుర్కొన్న అనేక సమస్య లను వివిధ దృక్కోణాల నుండి పరిశీలించి, వాటికి శాస్త్రీయ కారణాలను అన్వేషించడానికి కూడా బమ్మిడి తన కథల్లో ప్రయత్నించాడు.
గ్రామీణవ్యవస్థని పణంగా పెట్టి పట్టణీ కరణ వేగవంతమౌతున్న నేపథ్యంలో పితృస్వామిక అణ చివేత నిర్దిష్ట రూపాల్ని, సంస్కృతి వికృతినీ చూపిం చాడు. కనుకనే గ్రామాలనుంచి కార్మికులుగా, ఉద్యోగులుగా మారి మధ్య తరగతి జీవన స్థాయిని, విలువల్ని, అందుకున్న పాత్రలు ప్రధానంగా బమ్మిడి కథా సంకలనాల్లో కనిపి స్తాయి. ఈ సమాజిక ఆర్థిక సంక్షోభానికి మరో చిత్రంలో కనిపించే వెనుకబడిన, దళిత వర్గాలకు చెందిన చిన్న రెైతులు, రెైతు కూలీలు, కార్మికులు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత హింసని బమ్మిడి తన కథల్లో ప్రతిఫలిం పజేశాడు.ఇలా బమ్మిడి కథలన్నీ పాఠకుల్లో ఒక ఆలోచననీ, ‘వ్యక్తిస్థాయి’ నుండి ‘సామాజిక స్థాయి’కి అనే ఎదుగుదలకు చెందిన సంఘర్షణనీ పురిగొల్పే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వ్యవస్థలోని జీవన సంక్షోభానికి కారణాలెైన భూమి సమస్య, దళారీ పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు, సామ్రాజ్యవాదం వెదజల్లే వస్తు వ్యామోహ సంస్కృతి, డబ్బు సంస్కృతి ప్రజల్ని ఎంతటి హింసకైనా గురిచేస్తున్నాయనే వాస్తవానికి చెందిన ‘మౌలిక అంశాల్ని’ అందించడంలో బమ్మిడి కథలు చాలా వరకూ ప్రయోజకత్వాన్ని సాధించాయి.



సాహిత్యం

చరిత్ర పుటల్లో చేరని దళిత పద్య కవులు
ప్రాచీనసాహిత్యం అనగానే పద్యం, పద్యం అనగానే పండితుల పాండిత్యపరి జ్ఞానం గుర్తుకు వచ్చే ప్రధానాం శాలు. తర్వాత వ్యాక రణం, చంధస్సు, అలంకారాలు, సమాసాలు, సంధులు, సంప్రదాయ సాహిత్య సనాతన ధర్మాలు! వీటన్నింటిని పాటించి రాస్తేనే అది పద్యం అవుతుం దనే భావన కలుగుతుంది. ఇప్పటికీ పద్యంరాస్తేనే పండితుడు అనే అపోహకూడా లేకపోలేదు. పద్యం రాయాలంటే తెలుగు ప్రజలు ప్రామాణిక గ్రంథాలుగా పూజించే రామాయణ, మహా భారత, భాగవతాది గ్రంథాలు తప్పక అవపోసన పట్టి ఉండాలనీ, ఇంకా ఆ రంగంలో రాణించగలగాలంటే వేదవాజ్ఞ్మయ పరిజ్ఞానం, ఉపనిషత్తుల సారాంశం తెలిసి ఉండాలనీ వీటిలో ఏఒకటి లోపించినా వారు తెలుగుసాహిత్యంలో పండితులుగా రాణించలేరనే భావన ఈనాటికీ పామర, పండిత దృష్టిలో ఉందంటే అతిశయోక్తి కాదేమో!

ఈనాటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు చదువుతున్నానంటే ఒక మంచి పద్యం చెప్పు లేదా భాగవతంలో లేదా రామాయణంలో లేదా మహాభారతంలో ఒక ఘట్టంచెప్పు చూద్దాం అని అవహేళనచేసే పరిస్థితి. ఇంతటి ప్రసిద్ధ పద్య ప్రక్రియను, దాని రూపురేఖలను గ్రహించి పద్యం అంటే కేవలం ఒక వర్గపు సంపద కాదు, అందులో సాహిత్యంకూడా ఏదో పూర్వజన్మసుకృతం వలనో, దెైవఅనుగ్రహం వలనే వచ్చేదికాదు, ఎవరిలో ప్రతిభ సామర్ధ్యా లుంటాయో వారు అంతా పద్యరచన చేయవచ్చు అని నిరూపించిన దళిత పద్యకవులు సాహిత్యంలో చాలామందిఉన్నారు. ఈ కవులకు- అణగారిన కులాల ముద్రవల్ల సమాజంలో ఏవిధంగా సముచిత స్థానం ఇవ్వలేదో, అదే విధంగా సాహిత్య చరిత్ర పుటల్లో వారి దాఖలాలు కూడా లేవు.

ఇటు సాహిత్య చరిత్రలో, అటు సమాజ చరిత్రలో అట్టడగున ఉన్న రచయితలు ఎందరో ఉన్నారు. కొద్దో గొప్పో సాహిత్యంలో చోటు కల్పించుకున్న వారిలో జాషువా, కుసుమ ధర్మన్న, భోయి భీమన్న, జ్ఞానానందకవి వంటివారు కొద్దిమందే ఉన్నారు. కానీ వీరేకాకుండా జాతీయోద్యమ కాలం నుండి ఈనాటి వరకు కూడా దళిత జీవన విధానాలను పద్యాల్లో రాసిన కవులు వందల్లోఉన్నారు. వీరి సాహిత్యసంప దను రికార్డు చేయలేకపోవటం విషాదకరం. వీరంతా సంప్రదాయ సాహిత్య గ్రంథాలకు ఏమాత్రం తీసిపోని విధంగా పద్యరచనలు చేశారు. వారిలో ఎక్కువ శాతంమంది స్వయంగా దళిత కుటుంబాలలో జన్మించి తమ తమ దళిత జీవనస్థితిగతులను చెప్పారు. కనుక వీరిని దళిత పద్యకవులుగా చెప్పుకోవచ్చు. సంప్రదాయ మార్గమైన, అభ్యుదయ మార్గమైన, అంబేద్కర్‌ సామాజిక పోరాట మార్గమైన ప్రజాస్వామిక ప్రగతిశీల భావాలతో సమాజ శ్రేయస్సుకోసం సాహిత్యంరాస్తూ, అందులో దళిత సమస్యలు, వారి పోరాటాలు, వారి గాథలు పద్యం రూపంలో చెప్పేన పద్యకవులను దళిత పద్య కవులు అని చెప్పుకోవచ్చు.

ఇలా రచనలు చేసినవారిలో జ్యోతి కోటాదాసు (1850-1925), కుసుమ ధర్మన్న (1884-1946), గుర్రం జాషువా(1895-1971), కర్ణవీర నాగేశ్వరరావు (1900-1961), భోయిభీమన్న (1911- 2005), నడకుర్తి వెంకటరత్నం (1915-1989), జ్ఞానానందకవి(1922-2011), మల్లవరపు జాన్‌ (1927- 2006), బొడ్డు ప్రకాశం, బిర్నిడి మోషే, సవ్వప్పగారి ఈరన్న, ఆశావాది ప్రకాశ రావు, నంబూరి దుర్వాస మహర్షి, యం.పి. జానుకవి, మల్లవరపు రాజేశ్వరరావు, నూతక్కి అబ్రహం, పెనుమాక శామ్యూల్‌, బిర్నీడి ప్రసన్న- ఇలా చాలామంది రచయితలు పద్య కావ్య ప్రక్రియలో నిష్ణాతులుగా ఉన్నారు. వీరిలో చాలా మంది రచయితల వివరాలు, తదితర పూర్తి సమాచారం ఇంకా కొంత అందుబాటులో లేదు. ఈ దిశగా పరిశోధనలు జరాగాల్సిన ఆవశ్యకత ఉంది.

వీరు కేవలం ఏదోఒక పద్యకావ్యాన్ని రచించారనుకుంటే పొరపాటే. వీరు శతకాలు, ఖండ కావ్యాలు, లఘుకావ్యాలు, యక్షగానాలు, నవలలు ఇలా దాదాపు వారి కాలంలో ప్రాచుర్యంలో ఉన్న ప్రక్రియలన్నిం టిలోనూ వందల్లో సాహిత్య రచన చేశారు. వీరిలో కొంత మంది సాహిత్య రచనలు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. వీరిలో బహుభాషా పండితులూ ఉన్నారు. అవధానాలు నిర్వహించ్వినవారున్నారు, సాహిత్య గోష్ఠులు నిర్వహించినవాన్నారు. సాహిత్య పురస్కారాలు స్వీకరించినవారు న్నారు. కానీ ఏసాహిత్య చరిత్రలో వీరికోసం ఒక్కపేజీకూడా కేటాయించలేదు. కారణం వీరు దళితులు కావడమేనా? వీరు దళితప్రజల గురించి సాహిత్యాన్ని రాయడమేనా? జాషువా అన్నట్లు గౌరవం కులానికా, కలానికా? వీళ్ళంతా విశ్వవి ద్యాల యాల్లో పట్టాలు పొందలేదు, గురువుల దగ్గర వేదవిద్యలూ అభ్యసించలేదు.

ఈ దళిత పద్యకవుల జీవితాలను పరిశీలిస్తే దాదాపు చాలా మంది రచయితలు ప్రాధమిక విద్యలోనే వీరి విద్యాభ్యాసానికి స్వస్తి పలికి వారికిఉన్న స్వీయానుభ వాలతో, సామర్థ్యంతో సాహిత్యంరచన చేశారంటే ఏ పండితునికి నమ్మశక్యం కాదేమో! ఇవి చరిత్ర పుటల్లో చేరని చెరిగిపోని చేదు నిజాలు.దళిత పద్యకావ్యా లను అధ్యయనం చేసినప్పుడు, పద్యకావ్యాలకు- దళిత పద్యకావ్యాలకు కవితాప్రక్రియా పరంగా, స్వభావ రీత్యా ఒకటే అయినా భావ, భాష, రూప, వస్తు, శెైలో తదితర విషయాల పట్ల ఎంతో వెైవిధ్యంఉంది. అవి:1. హరిజన సమస్యను నిర్మూలించే దిశగా రచనలుచేయడం. 2. అస్పృశ్యత నివారణోద్యమానికి సంబంధించినవి. 3. జాతీయ, సంస్కరణభావాలు గలవి.4. అంబేడ్కర్‌ ఔన్నత్యానికి, ఆయన సామాజిక పోరాటానికి సంబంధించినవి. 5. హిందూ మతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా క్రైస్తవ మత సాహిత్యాన్ని, బౌద్ధ మత సారాంశాన్ని ప్రజల్లో చాటి చెప్పే సాహిత్య రచనలు.

6. స్ర్తీల సమస్యలు-వరకట్నం, సతీసహగమనం, పురుషాధిక్యత వంటి విషయాల పట్ల ప్రజలను చెైతన్యపరచే రచనలు చేయటం. 7. తెలుగుసంస్కృతీ, సాహిత్య ఔన్నత్యానికి సంబంధించిన రచనలు. 8. రాజకీయ నాయకుల స్తుతికావ్యాలు. 9. గాంధేయ మార్గాలను అనుసరించే రచనలు.10. చారిత్రక కావ్యాలు. ఎవరికీ కనిపించని, కనిపించినా సాహిత్య చరిత్రపుటల్లో స్థానానికి నోచుకోకుండా పామర సాహిత్యకోవలోకి పరిమితమైన కవులు ఈ దళిత పద్యకవులు. వీరు ఏదో సరదాకోసమో, మానసిక ఆనందం కోసమో సాహిత్యరచన చేయలేదు. రగులుతున్న గుండెల్లో వెల్లువలా వచ్చిన వేదనాభరిత పోరాటాలే వీరి కావ్య ఇతివృత్తాలు. ఆధునిక కాలం మొదలెై జాతీయోద్యమం, సంఘసంస్కరణ ఉద్యమం బాగా ఊపు అందుకున్న రోజుల్లో వచన ప్రక్రియ కొనసాగినా, పద్యప్రక్రియ మాత్రం తనస్థానాన్ని నిలుపుకోగలిగింది. జాతీయోద్యమం రెండు విధాలుగా కొనసాగింది.

ఒకటి దేశ స్వంత్రత్య్రం లక్ష్యంగా, మరొకటి దళిత ప్రజల హక్కుల సాధన. స్వాతంత్య్రఉద్యమానికి గాంధీ తదితర నాయకులు నాయకత్వం వహిస్తే, దళిత ప్రజల హక్కుల సాధనకు అంబేడ్కర్‌ వంటి మహనీ యులు నాయకత్వం వహించారు. వీరు గాంధీ పట్ల ఆకర్షితులు కావడానికి కారణం- ఆనాటి రాజకీయ, సామాజిక, కాల పరిస్థితులు. అంబేడ్కర్‌ సిద్దాంతాల పట్ల ఆకర్షితులు కావడానికి కారణం- ఆయన జాతి ప్రయోజనాల కోసం పోరాడిన దళిత నాయకుడు కావటం. దళిత పద్యకవులు హరిజనులు మనుషులే అన్న భావనను వ్యక్తపరుస్తూ, వారి పట్ల జాలి, దయ, కరుణ, ఆదరణ భావం ఉండాలనే సానూభూతి తత్త్వాన్ని ప్రేరేపించేవిధంగా సాహిత్యం రాశారు. వీరి సాహిత్యాన్ని పరిశీలిస్తే- గాంధేయవాద సిద్ధాంతాలెైన అహింస, సత్యం, హరిజనాభ్యు దయం, అస్పృశ్యతనివారణ వంటఇంశా లపెై సంస్కరణ మార్గంలో వెలువడిందనే చెప్పుకోవాలి.

దళిత పద్యకవులను ప్రధానంగా గాంధేయవాద ధోరణిలో రచనలు చేసేవారు , అంబేడ్కర్‌ సిద్ధాంతాల పట్ల రచనలు చేసేవారు, గాంధీ, అంబేడ్కర్‌ ఇద్దరిని అనుసరిస్తూ రచనలు చేసేవారు, క్రైస్తవమత ప్రభావంవల్ల హిందూమతం లోని లోపాలను చెప్పిన వారు, బౌద్ధ ధర్మాలను తెలియజెప్పినవారు ఉన్నారు. అంటరాని తనాన్ని, వెనుక బాటుతనాన్ని చెప్తూ పల్లెప్రజల్లో, పద్యాలు పాడుతూ చెైతన్య జ్వాలలు రగిలించారు.
‘చదువుల్‌ పెరిగిన సంబరమే గాని/ అంటరానితనంబు అణగలేదు’ (నడకుర్తి వేంకట రత్నకవి) అన్న రచయిత వేదనగమనిస్తే దళిత పద్య కవుల జీవితాలకి ఇది సరిపోతుంది. ‘మాల యతడు, నేను మాదిగ కులజు/ నను విభేదముండునం తదనకు కలిసి తిరుగలేవు గద! కులీనుల తోడ/ ఇంటగెలిచి రచ్చకేగుమయ్య’ (మల్లవరపు జాన్‌).

ఇక్కడ దళిత అంతర్గత పోరును తెలియపరుస్తూ ఆనాడే ఈ పద్యాన్ని చెప్పాడు. దీనిని బట్టి రచయితకు ఉన్న ముందు చూపు, సోదరకులాల మధ్య ఐక్యతాభావం సాధించాలనే లక్ష్యం కనిపిస్తుంది. ‘చేనేత గుడ్డతో మానంబు గాపాడి/ కట్టుబట్టల కెట్లు కష్టపడితివో/ పాదరక్షలనిచ్చి పాదాల రక్షించి/ దూరముగా నెట్లు త్రోయబడితివో’ (మల్లవరపు జాన్‌). ఈనాడు బహుజనరాజ్యం, దళిత సాధికారిత, రాజ్యాంగసాధనే లక్ష్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకం కవాలనే నినాదాలు వింటున్నాం, కానీ ఈ రచయిత ఎప్పుడో వీరి ఐక్యత ఆవశ్యకతను ఈ పద్యం ద్వారా తెలియజెప్పాడు. గుర్రం జాషువా ప్రభావంవలన అనేకమంది దళితరచయితలు సాహిత్యంలో పద్యకవులుగా స్థానాన్ని నిలుపుకోగలిగారు. చాలా మంది రచనల్లో జాషువా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

పండిత కవులకు- దళిత కవులకు రచనా నేపథ్యంలో, కృతి భర్తల విషయంలో రసపోషణలో, వర్ణనాత్మ కతలో- అన్ని విషయాల్లో వెైవిధ్యం కనిపిస్తుంది. ప్రాచీనకావ్యాల్లో ఇతివృత్తాలు తీసుకొన్నవాటిలో సామాజి కాంశాలు చెప్పడం, ఎవరెైతే దళితవా డలకు సేవచేశారో వారికి తమకావ్యాలను అంకితంఇవ్వడం, దళిత చారిత్రక పుత్రు లను ఆయాకావ్యాల్లో ప్రశంసించటం, తమపూర్వీకులను కీర్తించటం, స్ర్తీ ప్రసవ వేదన, వరకట్నాల గురించి ఎంతోవెైవిధ్యభరితంగా వీరి సాహిత్య రచన సాగింది.ఒక వర్గ ఆధిపత్యం, తరతరాలుగా కూరుకుపోయిన వర్ణ , కుల వ్యవస్థ వీటన్నింటికీ మించి మనుషుల మధ్య ఉండే వివక్షలను నిరసిస్తూ , ఏ అక్షరం అయితే చదివితే నాలుకలు కోశారో, ఏ వేదాలు వింటే చెవుల్లో సీసం పోశారో అదే సంస్కృత సాహిత్యాన్ని అలవోకగా చదివి పండిత వర్గాల ప్రసంశలు పొందటంలో సఫలీకృతులెైనారు.
వీరు పాండిత్య ప్రకర్షకు సాహిత్యాన్ని సృష్టించలేదు. వారి అవసరం అలా వారిని కవులుగా తీర్చిదిద్దింది. దళిత పద్య కవులు రాసిన సాహి త్యం సంస్థానాల్లో కావ్య గౌరవాలను పొందలేకపోవచ్చు గానీ దళిత గుడిసెల్లో చెైతన్యం నింపడంలో విజయం సాధించారు. దళిత పద్యకావ్యాలు గాంధేయ మార్గంలో పయనించి ఉండవచ్చు. అంత మాత్రంచేత గాంధీ సిద్ధాంతాలకు వీళ్ళు జోలపాడలేదు, జేజేలుకొట్టలేదు. నిరసించా ల్సినచోట నిరసించారు, ఎదిరించా ల్సినచోట ఎదిరించారు. సొంత గొంతును తమదెైన రీతిలో పద్యప్రక్రియలో వేదనాభరితమైన దళిత జీవితకథలను వినిపించగలిగిన ఈ రచయితలు చరిత్రలో పుటల్లో చేరవల్సిన నిజమైన సాహిత్యసృజనకారులు.


ప్రముఖ చిత్రకారుడు రామలింగేశ్వరరావు కన్నుమూత

  • తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు 'తరతరాల తెలుగు వెలుగుల'ను తీర్చిదిద్దిన కుంచె ఆగిపోయింది
పాత తరం ప్రముఖ తెలుగు చిత్రకారుల్లో ఒకరూ, సీనియర్‌ పాత్రికేయులూ దసిక రామలింగేశ్వరరావు ఇకలేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్‌ 28వ తేదీ శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. 'డి.ఆర్‌' అనే సంక్షిప్త నామంతో చిత్రకళా రచన చేసి, 20వ శతాబ్దపు తెలుగు చిత్రకారుల్లో ఒకడిగా దసిక రామలింగేశ్వరరావు పేరు తెచ్చుకున్నారు. 'ఆంధ్రపత్రిక' యాజమాన్యంలోని దిన, వార పత్రికల్లో, 'భారతి' మాసపత్రికలో ఆయన చిత్రకారుడిగా, ఛాయాగ్రాహకుడిగా 1951 నుండి 1974 చివరి దాకా పనిచేశారు. వార, మాస పత్రికల ముఖచిత్ర రచనతోపాటు సినిమాలు, క్రీడలు, సభలు సమావేశాలను ప్రత్యేకంగా తన కెమెరాతో పాఠకుల కళ్లముందు నిలపడంలో విశిష్ట కృషి చేశారు. 1975లో హైదరాబాద్‌లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు, ప్రభుత్వం ఆయనను ప్రత్యేకంగా పిలిపించి, వివిధ రంగాల్లో చిరస్మరణీయులైన తెలుగు ప్రముఖుల మూర్తులను చిత్రింపజేసింది. రెండు నెలలపాటు అక్కడే ఉండి 120 మంది దాకా ప్రముఖాంధ్రుల మూర్తిచిత్రాలను (పోర్‌ట్రయిట్‌లను) ఆయన గీశారు. ప్రపంచ మహాసభల సందర్భంగా గాంధీభవన్‌లో ప్రదర్శించిన ఆ వర్ణచిత్రాలన్నీ 'తరతరాల తెలుగు వెలుగులు' శీర్షికన ఇప్పటికీ 'తెలుగు విశ్వవిద్యాలయం'లో ఉన్నాయి. చెన్నైలోని మైలాపూర్‌ ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షతో ఆత్మబలిదానం చేసుకున్న భవన ప్రాంగణం (ఇప్పటి 'అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం')లో ఇప్పటికీ కళకళలాడుతూ కనిపించే పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి, తెలుగు ప్రముఖుల తైల వర్ణ చిత్రాలు దసిక రామలింగేశ్వర రావు కుంచె నుంచి జాలువారినవే!
దాదాపు ఏడు దశాబ్దాలుగా చెన్నపట్నంతో రామలింగేశ్వరరావుకు విడదీయరాని అను బంధముంది. 'ఆంధ్రపత్రిక' కార్యాలయం చెన్నపట్నం నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్ళినా, ఆయన తన చేతిలోని కళను నమ్ముకొని ఇక్కడే జీవితం సాగించారు. రామలింగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 1925 సెప్టెంబర్‌ 1వ తేదీన జన్మించారు. ఆయనకు చిన్ననాటి నుంచి కళల పట్ల మక్కువ. 1944లో చెన్నైలోని 'స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌' (ఇప్పటి 'కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్స్ట్‌')లో చేరారు. ప్రసిద్ధ చిత్రకారుడు దేవీప్రసాద్‌ రారు చౌధురి శిష్యరికంలో తనలోని చిత్రకళా ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు. చిత్రరచనతోపాటు శిల్పకళలోనూ, ఛాయాగ్రహణంలోనూ నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్నారు. ఇవాళ్టికీ చెన్నైలోని మెరీనా సముద్ర తీరానికి ప్రతీకలుగా కనిపించే ప్రసిద్ధ శిల్పాలైన గాంధీ బొమ్మ, కార్మిక విజయం (ట్రయంఫ్‌ ఆఫ్‌ లేబర్‌)ల రూపకల్పనలో దేవీప్రసాద్‌ రారుకి రామలింగేశ్వరరావు సహాయకుడిగా పనిచేశారు.
చదువుకొనే రోజుల్లోనే 1946లో అప్పటి భారత ప్రభుత్వం 'ఆలిండియా ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ సొసైటీ' (ఇప్పటి 'లలిత కళా అకాడమి') పక్షాన జరిపిన 'అంతర్జాతీయ సమకాలీన చిత్ర ప్రదర్శన'లో రామలింగేశ్వరరావు ప్రథమ బహుమతి పొందారు. 1947లో భారత ప్రభుత్వం నుంచి 'గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌' అందుకున్నారు. అలాగే, 'ప్రోగ్రెసివ్‌ పెయింటర్స్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌'తో సహా పలు చోట్ల బహుమతులు, ప్రముఖుల ప్రశంసలు పొందారు. తెలుగు చిత్రకళా రంగంలో దామెర్ల రామారావు తదితరులది తొలి తరమైతే, అడివి బాపిరాజు ప్రభుతులది మలి తరమైతే, వేలూరి రాధాకృష్ణ, హెచ్‌.వి. రామ్‌గోపాల్‌లతోపాటు దసిక రామలింగేశ్వరరావు ఆ తరువాతి తరానికి చెందిన ప్రముఖులు. ముందు తరానికి చెందిన ప్రముఖ తెలుగు చిత్రకళాచార్యులైన అడివి బాపిరాజు (గుంటూరు), అంకాల వెంకట సుబ్బారావు (భీమవరం), వరదా వెంకటరత్నం(రాజమండ్రి), చేమకూర సత్యనారాయణ (మద్రాసు) తదితరులు రామలింగేశ్వరరావు కళాకౌశలాన్ని ప్రశంసించారు.
కాలక్రమంలో ప్రకృతి దృశ్య చిత్రణ (ల్యాండ్‌స్కేప్‌ పెయింటింగ్‌), వర్ణ సమ్మేళన వైచిత్రి, మూర్తి చిత్రణ (పోర్‌ట్రయిట్‌)ల్లో రామలింగేశ్వరరావు సిద్ధహస్తులు. ఫొటోగ్రఫీలోనూ అంతే నైపుణ్యం గడించారు. పత్రికలో పనిచేస్తున్నప్పుడు రాష్ట్రంలో ప్రకృతి బీభత్సాలు, ప్రమాదాలు జరిగినప్పుడు పటం గీసి, ఆ మ్యాప్‌ సాయంతో ప్రమాద ఘటనా స్థల వివరాలను తెలియజెప్పడం లాంటి విధానాలను అప్పటి 'ఆంధ్రపత్రిక' సంపాదక మండలిలోని మద్దాలి సత్యనారాయణ శర్మ ప్రోత్సాహంతో రామలింగేశ్వరరావు విశేసంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. నిరంకుశ నిజాం పాలనలోని హైదరాబాద్‌ సంస్థానంపై భారత ప్రభుత్వం 'పోలీసు చర్య' చేపట్టినప్పుడు షోలాపూర్‌, కర్నూలు, కొండపల్లి- ఇలా రకరకాల వైపుల నుంచి భారత సైన్యాలు కదలివస్తున్న వైనాన్ని బాణాల గుర్తులు వేస్తూ, పటంగా రామలింగేశ్వరరావు చిత్రించారు. 'ఆంధ్రపత్రిక' తన ప్రత్యేక కృషిగా తొలి పుటలో దాన్ని ప్రచురించింది. ఆ మ్యాప్‌ జరుగుతున్న సంఘటనలను పాఠకుల కళ్లకు కట్టడమే కాక, పత్రికా రంగంలో సంచలనమై, అందరి ప్రశంసలూ అందుకుంది.
ప్రముఖ రచయితలు, పాత్రికేయులు తిరుమల రామచంద్ర, ముళ్ళపూడి వెంకట రమణ, సూరంపూడి సీతారామ్‌, పోలవరపు శ్రీరాములు, గోళ్ళమూడి రామచంద్రరావు, నండూరి రామమోహనరావులు 'ఆంధ్రపత్రిక'లో సహౌద్యోగులు. మృదు స్వభావి, హాస్య ప్రియుడూ అయిన రామలింగేశ్వరరావు చివరి వరకు క్రీడలన్నా, కళా రంగ అంశాలన్నా ఆసక్తి చూపేవారు. ఆయనకు భార్య (భానుమతి), ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డిసెంబరు 29వ తేదీ శనివారం ఉదయం చెన్నైలోని బిసెంట్‌నగర్‌లో శ్మశాన వాటికలో రామలింగేశ్వరరావు అంత్యక్రియలు జరిగాయి. సరిగ్గా, నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సమయంలో, చెన్నై మెరీనా సముద్ర తీరంలోని గాంధీ శిల్పానికి మరమ్మతులు చేస్తూ, పునరుద్ధరిస్తున్న వేళ ఆ రెంటితోనూ అవినాభావ సంబంధమున్న దసిక రామలింగేశ్వరరావు కన్ను మూయడం తెలుగు చిత్రకళా ప్రియులకు తీరని లోటు. ఆయన గీసిన ప్రసిద్ధ వర్ణ చిత్రాలను భద్రంగా భావితరాలకు అందించడంలో అందరితోపాటు మన ప్రభుత్వ పెద్దలకూ బాధ్యత ఉంది.
 ఆడపిల్లలను అప్రమత్తం చేయాల్సిందే.....
 
ఇప్పుడు మనం పూర్తిగా మార్కెట్ గుప్పిట్లో ఉన్నాం. ఇక్కడ వ్యాపారాభివృద్ధి, లాభం మాత్రమే పరిగణన లోకి తీసుకో బడతాయి. సమ భావన, సంస్కృతీ, నీతి వంటి మాటలు బూతులై పోయాయి. వాణిజ్య ప్రకటనలు, సినిమాలు, పత్రికలూ...ఏవి తీసుకున్నా...అమ్మాయిలు కేంద్రంగా, అందాల ఆరబోత ధ్యేయంగా  ఉంటున్నాయి. వీటి ప్రభావం వల్ల ఆడ పిల్లల పట్ల చిన్న చూపు ఒక వైపు, వారొక సెక్స్ వస్తువులన్న భావన మరొకవైపు పెచ్చరిల్లుతున్నాయి...ఈ ఆధునిక సమాజం లోనూ. వీటి వల్లనే ఆడ పిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. 

ఈ చవట ప్రభుత్వాలు, నింపాది చట్టాలు, స్వార్ధపూరిత ప్రజా సంఘాలు, కుళ్ళు మెదళ్ల మేధావులు ఏమీ చేయలేరు..ఈ భయంకరమైన సమస్య పరిష్కారానికి. ఎన్నికలలో లబ్ధికి, కాంట్రాక్టుల ఖరారుకు, ఆర్ధిక ప్రయోజనాలు కలిగే పనులకు అమ్మాయిలను వాడుకోవడం సర్వ సాధారణం అయ్యింది. వర్క్ ప్లేసులలో బాసుల కిరాతకానికి బలవుతున్న మహిళలు ఎందరో!

ఢిల్లీ రేప్ ఘటన పట్ల గొంతు చించుకుంటున్న ఒక ప్రముఖ పార్టీ అధినేత రాజకీయ ప్రయోజనం కోసం ఒక ఉన్నత స్థాయి జడ్జి దగ్గరకు అప్పటి హీరోయిన్, ఇప్పటి పొలిటీషియన్ ఒకరిని సెక్స్ సుఖం కోసం పంపి పనిచేయించుకున్నట్లు మీడియాలో ఉన్న చాలా మందికి తెలుసు. ఇప్పుడున్న మీడియా ప్రభువులలో పలు దరిద్రులు...వ్యాపార విస్తరణ కోసం...అమ్మాయిలను, ముఖ్యంగా తమ దగ్గర పనిచేసే యాంకర్లను పావులుగా వాడుకుంటున్న సంగతి బహిరంగ రహస్యం. అప్పనంగా అందలం, ఆర్ధిక హోదా లభిస్తుండే సరికి కొందరు ఆడ పిల్లలు రాజీ పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. 

పోలీసులు, మీడియా, న్యాయ వ్యవస్థ ప్రతికూలంగా వ్యవహరిస్తున్న ఈ పరిస్థితుల్లో సాధారణ పౌరులే నడుం బిగించాలి. సమాజ శ్రేయస్సు ధ్యేయంగా కుటుంబ విలువలు పెంపొందించాలి. పాఠ్య పుస్తకాలతో సంబంధం లేకుండా...పిల్లలకు విలువలు బోధించాలి. ఈ నేపథ్యoలో...అబ్రకదబ్ర పెద్దలకు, స్కూల్-కాలేజ్ పిన్నలకు విడివిడిగా రూపొందించిన ప్రవర్తనా నియమావళి మీ కోసం.  

పెద్దల ప్రవర్తన

>బాలికలు, మహిళల పట్ల చిన్న చూపు ఇంటి నుంచే ఆరంభం అవుతుంది. దీన్ని నివారించే చర్యలు చేపట్టాలి. 
>మనుషులం అందరం సమానమే...అన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు నూరిపోయాలి. అది నిరూపించి చూపాలి. 
>జీవిత భాగస్వామిని, భార్యను, చులకనగా చూడడం, చీటికీ మాటికీ తిట్టడం, సూటిపోటి మాటలతో చులకన చేయడం ఆపాలి.
>ఇంట్లో పనికి కుదిరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దారుణం. 
>ఇంటికి వచ్చే ఆడ పిల్లలు, మహిళలను అదోలా చూడడం, వారితో వెకిలి చేష్టలకు ఒడిగట్టడం చేటుచేస్తాయి.    

మగ పిల్లలకు నేర్పాల్సినవి 

>తోటి బాలికలతో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే బోధించాలి. >సాధ్యమైనంతవరకూ ఇప్పటి సినిమాలను చూడనివ్వవద్దు. ముఖ్యంగా ప్రేమ సెంట్రిక్ గా ఉండే తెలుగు, హిందీ సినిమాలను నివారించాలి.   
>సినిమాలు అడపా దడపా చూసినా అందులో వెకిలితనాన్ని అనుకరించవద్దని చెప్పాలి.
>సినిమాలలో అశ్లీలత, అసభ్యతలను పెద్దలే  అక్కడికక్కడ తిట్టి పోయాలి. ఆ సినిమా తీసిన దర్శక నిర్మాతలు పశువులతో సమానమని, దేశభక్తి లేని కుక్కలని ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి.
>బాలికలపై దాడిని బహిరంగంగా ఖండించాలి. ఆ తాలూకు నిరసన ప్రదర్శనలలో పాలు పంచుకోవాలి. 
>స్కూలు స్థాయి నుంచే చట్టాల గురించి పిల్లలకు ప్రాథమిక అవగాహన వచ్చే చర్యలు చేపట్టాలి.
>పిచ్చి పనులు చేస్తే...పడే శిక్షల తీవ్రతను తెలియపరిచాలి.
>జులాయి స్నేహితులతో తిరగకుండా చూసుకోవాలి. 
>విలాసాల పట్ల మక్కువ చూపే కొడుకు ఎన్నడో ఒక నాడు ప్రమాదం కొని తెస్తాడని గుర్తించాలి. 
>స్కూలు బస్సులోనో, దారి వెంటనో...ఈవ్ టీజింగ్ వంటివి జరుగుతున్నాయేమో అడిగి తెలుసుకోవాలి. 
>ఈవ్ టీజింగ్ బాధితుల పట్ల సానుభూతితో ఎలా వ్యవహరించాలో తెలియజేయండి. 
>ఈవ్ టీజింగ్ ను నిరోధించడం...ఎందుకు, ఎలా సోషల్ రెస్పాన్సిబిలిటి అవుతుందో పిల్లవాడికి తెలియజేయాలి.
>పిల్లవాడితో మిత్రుడిలా వ్యవహరిస్తే స్కూల్, కాలేజ్ లలో పరిణామాలు తెలుసుకోవచ్చు. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు.
>లవ్వు, పార్టీలు, సోషల్ నెట్ వర్కింగ్ వంటి అంశాలను సున్నితంగా డీల్ చేయాలి.
>మన పిల్లవాడి మానసిక పరివర్తనలో తేడా కనిపిస్తే...కుటుంబ సభ్యుల లేదా వైద్యుల సహకారం తీసుకోవడానికి వెనకాడవద్దు.   

ఆడ పిల్లలకు నేర్పాల్సినవి 

>మగవాళ్ళను పూర్తిగా నమ్మవద్దని, వారి మాటలను, చేష్టలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని నూరిపోయాలి.
>తోటి బాలురతో ఎలా ప్రవర్తించాలో, వారిలో ఓవర్ యాక్షన్ గాళ్ళను ఎలా డీల్ చేయాలో చిన్నప్పటి నుంచే బోధించాలి.
>సాధ్యమైనంతవరకూ ఇప్పటి సినిమాలను చూడనివ్వవద్దు. సినిమాటిక్ ధోరణులను మొగ్గలోనే తుంచి వేయాలి.
>మగ పిల్లల పొగడ్తలు నిజమని నమ్మవద్దని, పొగిడిన వాళ్ళు నమ్మకస్తులని, దగ్గరివారని నమ్మవద్దని స్పష్టం చేయాలి.
>స్కూలు, కాలేజి స్థాయిలో సెల్ ఫోన్ వాడకం తగ్గించాలి. 
>విలాసవంతమైన జీవితం పట్ల మోజు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తుందో చర్చించాలి. 
>మరీ జుగుప్సాకరమైన డ్రస్సులను ధరించనివ్వవద్దు.  
>మోతాదు మించిన టెక్స్ట్ మెసేజులు, మెయిల్స్ ప్రమాదకరమని తెలియజెప్పాలి. 
>ఒంటరిగా ఇతరుల ఇళ్ళకు, రహస్య ప్రాంతాలకు  వెళ్ళడం ఎంత ప్రమాదమో తెలియజెప్పాలి.
>అమ్మాయి స్నేహితులను నమ్మి...సినిమాలకు, షికార్లకు, పార్కులకు, పార్టీలకు పంపడం ప్రమాదం.
>స్కూల్ భరోసా లేనిది బైటి ప్రాంతాలకు ఎక్స్ కర్షన్ లకు పంపడం శ్రేయస్కరం కాదు.
>ఇతరులతో సంబంధాల విషయంలో గోప్యత (సీక్రసీ) ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలియజెప్పాలి.
>అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ తో తరచూ మాట్లాడడం, సమాచారాన్ని సేకరించడం   మంచిది.
ఏతా వాతా...అద్భుతమైన ఈ కుటుంబం ఆవశ్యకత, మనుషుల మధ్య నమ్మకాల అవసరం, అబద్ధాలు తెచ్చి పెట్టే ప్రమాదాలు, ఎయిడ్స్ వంటి రోగాల తీవ్రత ..తల్లి దండ్రులు ఎప్పటికప్పుడు ఇళ్ళలో చర్చించాలి. 

కాలేజ్ రోజుల్లో పిల్లలు (మగైనా...ఆడైనా) ఏదో ఒక రిలేషన్ లోకి వెళ్ళడం దాదాపు ఖాయమని పెద్దలు సిద్ధపడాలి. అందులో కొన్ని రిలేషన్స్ అద్భుతమైనవి కావచ్చు...పెళ్ళికి దారి తీయవచ్చు. మరీ సంపాదనే లక్ష్యం కాకుండా...పిల్లల కోసం రోజూ కొంత సమయం కేటాయిస్తే...వారికి ఒక సన్నిహిత మిత్రుడిగా వ్యవహరిస్తే...చాలా సమస్యలను మొగ్గలోనే పరిష్కరించవచ్చు. 
( Thanks to 
--Dr. S.Ramu garu from .....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు)


 
మృత్యు క్రీడకు బలి
 
మృగత్వాన్ని ధిక్కరించిన ఆ ధీర వనిత ఇక లేదు. యావత్ భారతాన్ని కన్నీటి ధారల్లో ముంచి ఆ సాహసి తుదిశ్వాస విడిచింది. మృగాలు ఆడిన పాశవిక మృత్యుక్రీడలో ఒంటరిగా బలైపోయింది. అలసి సొలసి శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఒక్కొక్క అవయవం కూలిపోతూ సోలిపోతుంటే హాస్పిటల్ బెడ్మీద అచేతనంగా ఒరిగిపోయింది. పోతూ పోతూ నవనాగరిక సమాజం మీద తుపుక్కున ఉమ్మేసి పోయింది. తలాకొంచెం సిగ్గుపడండని అసభ్య సమాజాన్ని పరిహసించి పోయింది.

ధామినీ! నిర్భయ! జ్యోతి! పేరేదైతే ఏంటి తల్లీ! క్షమించు! మృగాళ్ల రాజ్యంలో బలైన ఒంటరి లేడిపిల్ల కొన్నెత్తుటి మరణం సభ్య సమాజాన్ని పరిహసించింది. మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రి కన్నీటి నివాళులు అర్పించిన ఆ క్షణం కంటిరెప్ప మీద తల్లి, చెల్లి, కూతురు కనిపించింది. ఎనిమిది మంది స్పెషలిస్టుల వైద్యం బృందం ఏమీ చేయలేని నిస్సహాయులుగా మిగలారంటే.. మృగాళ్ల కామక్రీడ ఎంత నీచంగా ఉందో ఎంత హేయంగా ఉందో అర్ధమవతోంది తల్లీ! పేగులు కాలిపోయి ఒక్కో అవయవం కూలితుంటే నీకు బతకాలన్న తపన ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది బిడ్డా!

ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కామాంధుల కండకావరానికి ఆ జ్యోతి ఆరిపోయింది. హస్తిన కీచకపర్వంలో మృత్యుకోరల్లోకి వెళ్లి 13 రోజుల పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆ ధీర వనిత కన్నుమూసింది. మానవ మృగాల దాడిలో తీవ్రంగా గాయపడ్డా మనోధైర్యాన్నిమాత్రం వీడలేదు. నాకు బతకాలనుంది. బంగారు భవిష్యత్తును బాటలు వేసుకోవాలనుందంటూ.. జీవితంపై తనకున్న ఆశని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ దుర్మార్గుల కర్కశత్వాన్ని భరించలేకపోయింది. డిసెంబర్16నాటి పీడకల భవిష్యత్తులో బాధిస్తుందనుకుందో.. లేక తన జీవితంతో చెలగాటమాడిన వారిపై అసహ్యం, వికారంతో అవస్థపడిందో.. కారణమేదైనా... చేయని తప్పుకు నరకయాతన అనుభవించి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. మృత్యువు ఆమెను కబళించినా... ఆమె స్థానాన్ని చరిత్రలో శాశ్వతంగా పదిలంచేసింది. ఆమె మనోనిబ్బరం తాను బాధితురాలు కాదు యోధురాలినని చాటింది.

డిసెంబర్16 నాటి ఘటన యావత్భారతావనిని కదిలించింది. పేగుబంధం కాదు. ఏ రక్త సంబంధమూ లేదు. దూరపు చుట్టమా అంటే అదీ కాదు. ఊరేదో పేరోదో తెలియదు. కనీసం ముఖ పరిచయం కూడా లేనివాళ్లే అంతా. అయినా అందరికీ ఆమె బంధువే. ఒకరికి కూతురు, మరొకరికి సోదరి. ఒక్కమాటలో చెప్పాలంటే భారతావనికి ఆమె వీరపుత్రిక.

కీచకపర్వంలో ఆమెకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా జాతియావత్తు ఉప్పెనలా విరుచుకుపడింది. కన్నవారు, తోడబుట్టిన వారు, స్నేహితుల బాధకన్నా ఎముకలు కొరికే చలిలో న్యాయం చేయమంటూ నిరసన కొనసాగిస్తున్నవారి బాధ ఏమాత్రం తీసిపోదు.

యువతలో వచ్చిన కదలికను చూసి పాలకులు ముఖ్యంగా పోలీసులు గజగజలాడుతున్నారు. దేశంలోని ప్రతి ఒక్క నగరంలో యువతీయువకులు, చివరికి వృద్ధులు కూడా అత్యాచార ఘటనను ఖండిస్తూ సర్కారు తీరును కడిగి పారేశారు. ఇంతకీ వారంతా ఉప్పెనలా ఎగిసిపడటానికి కారణమేంటి?

కారణముంది. ఢిల్లీలో గ్యాంగ్రేప్అనంతర నిరసనలు దేశంలో సామాన్యుల గుండెల్లో గూడుకట్టుకున్న భయాందోళనలకు కారణముంది! రేపు నా తల్లికో, నా కూతురుకో, నా అక్కకో చెల్లెకో ఈ ప్రమాదం రాదా అన్న భయముంది! ప్రస్తుతం యువతీయువకుల్ని వారి తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. తమను తరిమి తరిమి కొడుతున్న పోలీసులైనా ఇలాంటి ఘటనలు జరగవన్న హామీ ఇస్తారా? లేదు పోలీసు బాసులు కూడా ఇలా ఉండండీ అలా చేయకండని సుద్దులు చెప్తున్నరే కానీ మేమున్నామన్న హామీ ఇవ్వలేకపోతున్నరు. అందుకే ఊరేదో, పేరేదో తెలియకపోయినా జనం బాధితురానికి హృదయానికి హత్తుకున్నరు. ఆమె చనిపోయిందన్న వార్త విని గండెలు పగిలేలా ఏడుస్తున్నరు...స్పాట్
సింగపూర్లో కన్నుమూసిన మన ఆడపడుచు మరణం వృథా కాదని రాష్ట్రపతి చేసిన ప్రకటన నిజం కావాలి. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైన లొసుగుల్ని తొలగించి కఠిన చట్టాలు తీసుకురావాలి. అధికారం, అర్థబలం, అంగబలం ఉన్నవారైనా లేనివారైనా ఒకే చట్టం అమలుచేయాలి. ఇదే జవాబుదారీ ఇప్పుడు జనం కోరుకుంటున్నరు.

Saturday 29 December 2012

ఫలితం సున్నా

ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలి మృతి 
సింగపూర్:
 ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఏడాది అత్యంత విషాదకరమైన సంఘటన ఇదే. మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. పక్షం రోజుల క్రితం ఢిల్లీలోని ఓ బస్సులో 23 ఏళ్ల యువతి దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. 
పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బాధితురాలిని గురువారం సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. భారత కాలమానం ప్రకారం ఆమె తెల్లవారు జామును 2 గంటల 15 నిమిషాలకు మరణించింది. అంతకు ముందు ఆమెకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది. రోగి డిసెంబర్ 29వ తేదీన ప్రాణాలు విడిచిందని చెప్పడానికి విచారిస్తున్నామని ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కెల్విన్ లోహ్ ఓ ప్రకటనలో చెప్పారు. భారత హైకమిషన్, ఆమె కుటుంబం పక్కనే ఉన్నారని చెప్పారు. ఆమె విదేశీయురాలు కావడంతో కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి మృతదేహాన్ని సింగపూర్ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకుని వెళ్తామని తల్లిదండ్రులు చెప్పారని భారత హై కమిషనర్ టిసిఎ రాఘవన్ చెప్పారు. అమ్మాయి ధైర్యంగా ఉందని, స్పృహలో ఉందని, చివరి వరకు మృత్యువుతో పోరాడిందని అన్నారు. ఉత్తమ చికిత్స అందించడానికి సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఆమె మృత్యువుతో చలించిపోయారని, అయితే అత్యంత మెరుగైన వైద్యం అందిందని భావిస్తున్నారని, గాయాల తీవ్రత కారణంగా బతకలేకపోయిందని ఆయన అన్నారు. తమను ఒంటరిగా వదిలేయాలని కుటుంబ సభ్యులు కోరినట్లు ఆయన తెలిపారు.

అఖిల పక్షం

కాంగ్రెసుకు చిక్కులు: జగన్, చంద్రబాబులకు ఊరట 
న్యూఢిల్లీ: 
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై శుక్రవారం నిర్వహించిన అఖిల పక్ష భేటీపై కొనసాగుతూ వచ్చిన ఉత్కంఠకు తెర పడింది. ఈ సమావేశంలో వెల్లడించే అభిప్రాయాల ద్వారా చిక్కుల్లో పడుతారని భావించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ఊరట లభించినట్లే. తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని వెల్లడించడంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించినట్లే. తెలంగాణ సమస్యను కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టేయడంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు దాదాపుగా విజయం సాధించినట్లే. నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అంటూ తమ నిర్ణయాన్ని వినిపించడం ద్వారా ఆ రెండు పార్టీలు తమ ఆధిక్యతను ప్రదర్శించాయి. తాము 2008లోనే ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. కాగా, తాము తెలంగాణకు అనుకూలమని స్పష్టంగా చెప్పకపోయినా, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని చెప్పడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా సంక్షోభం నుంచి గట్టెక్కిందని చెప్పాలి. కాంగ్రెసు పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ఆ రెండు పార్టీలకు ఉపకరించింది. తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పరోక్షంగా తెలంగాణకు అనుకూలంగా చెప్పినట్లే. కాంగ్రెసు మాత్రమే రెండు నిర్ణయాలను చెప్పింది. దీంతో కాంగ్రెసు ఇరకాటంలో పడినట్లేనని చెప్పాలి. కాంగ్రెసు స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వల్ల మాత్రమే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించడం లేదనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడంలో ఆ రెండు పార్టీలు విజయం సాధించాయి. కాంగ్రెసు పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని అఖిల పక్ష సమావేశం ద్వారా వెల్లడైంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తెలంగాణ సమస్యను నాన్చడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం లేదనేది తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సిపిఎం, మజ్లీస్‌లతో పాటు అన్ని పార్టీలు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరాయి. సమైక్యవాదాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని కాంగ్రెసు సీమాంధ్ర ప్రతినిధి చెప్పగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రతినిధి కెఆర్ సురేష్ రెడ్డి చెప్పారు. అయితే, పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు గురువారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు తెలంగాణ బంతి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడినట్లే. తెలంగాణ ఏర్పాటు అనుకూలంగానో, వ్యతిరేకంగానో నిర్ణయం తీసుకోవాల్సిన పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై పెట్టడంలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఫలితం సాధించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రభావం కాంగ్రెసు మీద మాత్రమే పడే విధంగా ఆ పార్టీలు వ్యవహరించాయి. మొత్తం మీద, తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే పూర్తిగా కాంగ్రెసు పార్టీ మాత్రమే లక్ష్యంగా మారే పరిస్థితి ఏర్పడింది

Friday 28 December 2012

తెలుగుతల్లి మెడలో పూలదండశంకరంబాడి

అది 1975 ఏప్రిల్ నెల... హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం... అది ప్రపంచ తెలుగు మహాసభలకు వేదిక. సభలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. టంగుటూరి సూర్యకుమారి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ...’ ప్రార్థనాగీతం ఆలపిస్తున్నారు. రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన అలీ అహ్మద్ సభను ప్రారంభించారు. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వేదిక మీద ఆసీనులయ్యారు. విద్యాశాఖమంత్రి మండలి వెంకటకృష్ణారావు కార్యక్రమాన్ని తన భుజాల మీద నడిపిస్తున్నట్లు ఉన్నారు. మా తెలుగుతల్లి గీత రచయిత శంకరంబాడి సుందరాచారిని పరిచయం చేశారాయన. ఈ సభల పుణ్యమా అని శంకరంబాడి కలం నుంచి జాలువారిన ఈ అమృతధార రాష్ట్రగీతం అయింది. ఈ గీతాన్ని రాసిన సుందరాచారి ప్రపంచానికి పరిచయమయ్యారు.
శాపోపహతుడు

శంకరంబాడి జీవితం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే శాపోపహతుడు అనాలి. కవులు, రచయితలు, కళాకారులలో చాలామందిని అదృష్టదేవత ఆశీర్వదించదు. కాలం, కర్మం కలిసిరాక శీపోపహతులుగా జీవితాలు సాగిస్తుంటారు. శంకరంబాడి కూడా 60 ఏళ్లు వచ్చే వరకు లోకానికి తెలియకుండానే జీవించారు. ఈ గీతం రాష్ట్రగీతం అయ్యేవరకు ఆయనెవరో చాలామందికి తెలియదు. తర్వాత కూడా ఆ ఒక్క గీతం దగ్గరే ఆగిపోయింది ఆయన పరిచయం. ఆయన రాసిన సాహిత్య సుమాలు, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు అనేకం.

సుందరాచారి తిరుపతిలో పరమనైష్ఠిక కుటుంబంలో పుట్టారు. లోక్‌సభ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌కు బంధువు. ఆ బంధుత్వాన్ని ఉపయోగించుకుంటే జీవితం ఎవరూ అందుకోలేని స్థాయిలో ఎదగవలసిన నేపథ్యం. కానీ స్వతంత్ర భావాల సుందరాచారి 14వ ఏటనే తండ్రితో విభేదించి జందేన్ని తెంపి స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టారు. కాశీనాథుని నాగేశ్వరరావు చలవతో ఆంధ్రపత్రిక ఉద్యోగి అయ్యారు. కొన్నాళ్లకు దాన్ని వదిలేశారు. సినీ మాటల రచయితగా, గీత రచయితగా మద్రాసు జీవితమూ అచ్చిరాలేదు. దాంతో నటుడిగా జీవితాన్ని మొదలుపెట్టారు. నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆ పైన పాఠశాల అధ్యాపకుడిగా చేరారు. అందులో జూనియర్ స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ వచ్చింది. అంతలోనే తమాషా సంఘటన... ఒక రోజు తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి పాఠశాల డెరైక్టర్ రైలు దిగారు. ఆయన చేతిలో ఉన్న ఫైలును సుందరాచారి చేతికిచ్చారు. ఇలాంటి బానిస బతుకు అక్కరలేదని మరునాడే రాజీనామా చేశారు శంకరంబాడి. అప్పటికి ఆయనవయసు 40. మరో పద్దెనిమిదేళ్ల సర్వీసు వదులుకోవడానికి వెనుకడుగు వేయని సాహసి.

పుస్తకాలు అమ్ముకుని... కవిత్వాన్ని నమ్ముకుని!

కవితోపన్యాసాలిస్తూ, దాదాపు 700 పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పుస్తకాలు పంచారు. పుస్తకాలు అమ్ముకుని, కవిత్వాన్ని నమ్ముకుని జీవించారాయన. సుందరాచారికి వైవాహిక జీవితమూ అంతగా కలిసి రాలేదు. భార్య వేదమ్మాళ్ అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఇలా ఉండగా ఒకసారి... మాఢభూషి గారి ఆహ్వానం మీద ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను కలిసి బుద్ధగీత కవితా సంపుటిలోని కొన్ని కవితలను వినిపించారు. రాధాకృష్ణన్ ఆ కవితలను, సుందరాచారిని ప్రశంసిస్తూ కొన్నింటిని ఇంగ్లిష్‌లోకి అనువదించమని కోరారు. అలాగే జవాహర్‌లాల్ నెహ్రూతో ఇంటర్వ్యూ కూడా ఏర్పాటు చేశారు సర్వేపల్లి.

నెహ్రూ సంతకం... ఓ మధుర జ్ఞాపకం!

ఇంగ్లిష్‌లో రాసిన బాలలగేయాలను నెహ్రూకి వినిపించారు శంకరంబాడి. నెహ్రూ పరవశుడై తన సొంత చెక్కు మీద 500 రూపాయలు రాసి, సంతకం చేసి ఇచ్చారు. మర్నాడు ఆ చెక్కును క్యాష్ చేసుకోవడానికి బ్యాంకుకెళ్లారు సుందరాచారి. నెహ్రూగారి సంతకం చూసి ముగ్ధులైన బ్యాంకు మేనేజర్... వెంటనే అనుమానంగా చూశారు. ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి నిర్ధారించుకున్న తర్వాత సుందరాచారికి మర్యాదలు చేసి, డబ్బు ఇచ్చి పంపుతూ మొమెంటోగా దాచుకోమని ఆ చెక్కును కూడా ఇచ్చి పంపారు.

మరో సందర్భంలో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను కలిసినప్పుడు ఆయన ‘మీకేం కావాలి కవిగారూ’ అని అడిగితే... ‘నాకు పదవులు వద్దు, బహుమానాలు వద్దు. రాష్ట్రపతి చేతుల మీదుగా నూటపదహార్లు, కవిగా ఓ శాలువా చాలు’ అని చాలా హుందాగా చెప్పిన ఉదాత్తుడు సుందరాచారి.

కొన్ని సినిమా పాటలు... స్వాతంత్య్ర ఉద్యమ గేయాలు!!

1941లో మహాత్మాగాంధీ జీవితాన్ని డాక్యుమెంటరీ తీసినప్పుడు శంకరంబాడి ‘పాడవే రాట్నమా ప్రణవ భారత గీతి...’ అంటూ రాట్నం మీద ఓ గీతం రాశారు. 1942లో దీనబంధు సినిమాకు ఆరుపాటలు రాశారు. 1961లో విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని 103 పద్యాలను తెలుగులోకి అనువదించారు. ‘సుందర భారతము, సుందర రామాయణాన్ని రాశారు. వ్యాసుని హృదయాన్ని, వాల్మీకి భావుకతను తెలుగులోకి తెచ్చారు. ‘బుద్ధగీత’లో బుద్ధని ఆవేదనను చాలా అందంగా చిత్రించారు సుందరాచారి’ అని ప్రముఖులు పలు సందర్భాల్లో ఆయనను ప్రశంసించారు.

ఏకలవ్యుడు, అగ్నిపరీక్ష, అపవాదు, సుందరసుధాబిందువులు వంటి ఖండకావ్యాలు రాశారు. ‘అపవాదు’లో సీతాదేవి మీద వచ్చిన అపవాదును 108 తేటగీతుల్లో చిత్రించారాయన. జీవించినంత కాలం అక్షరాలకే అంకితమయ్యారు. అన్ని అక్షరాల్లో ఆయనను మనకు చేరువ చేసింది, కలకాలం గుర్తుండిపోయేలా చేసింది ‘తెలుగుతల్లి మెడలో అలంకరించిన మల్లెపూదండ. తెలుగుతల్లి మెడలో మల్లెపూదండ ఎప్పటికీ వాడదు, సుందరాచారీ వాడిపోడు. నిత్య వికసిత పుష్పంలా సువాసనలు వెదజల్లుతూనే ఉంటారు.

వాగ్గేయకారుడు కూడా!

సుందరాచారి రాసిన దేశభక్తి గీతాన్ని స్వయంగా ఆయనే ఆలపించినప్పుడు ఆకాశవాణి కడప కేంద్రంలో రికార్డు చేశారు. ఆ గీతాన్ని అంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే... ఇది జరిగింది 1977 ఏప్రిల్ ఆరవ తేదీన. ఆ తర్వాత రెండు రోజులకే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఆయన కన్నుమూశారు.

- డా. ఆర్. అనంత పద్మనాభరావు

తెలుగుతల్లి మల్లెపూదండ ఇలాగ పూసింది!!

ఈ గీతాన్ని సుందరాచారి ఓ సినిమా కోసం రాశారు, కానీ వారికది నచ్చకపోవడంతో ఆ సినిమాలో వాడలేదు. తర్వాత ఆయన అనుమతితో సూర్యకుమారి 1942లో ప్రైవేట్ గ్రామఫోన్ కంపెనీ వారికి పాడి రికార్డు చేశారు. అయినా మూడు దశాబ్దాల వరకు ఈ గీతానికి పెద్దగా ఆదరణ లభించలేదు.

రచయిత గురించి...

శంకరంబాడి సుందరాచారి జీవితాన్ని అక్షరబద్ధం చేసిన రచయిత పద్మనాభరావు... ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలలో పనిచేసి ఢిల్లీ కేంద్రంలో అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా రిటైరయ్యారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా రెండు దఫాలు ఆకాశవాణి కడప కేంద్రంలో శంకరంబాడి సుందరాచారిని ఇంటర్య్వూ చేశారు. కవిమిత్రుల సత్సంగాలతో వీరిద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం పెరిగింది.
  

మూడనమ్మకాలు

బతుకులను బలిగొన్న మౌఢ్యం


పేదరికం బతుకులో ఒక భాగమైతే మూఢ నమ్మకాలు ఎలా జీవితాలను శాసిస్తాయో చెప్పడానికి ఈ దారుణమే అతి పెద్ద ఉదాహరణ. తాను మౌఢ్యానికి గురి కావడమే కాకుండా దానినే బతుకుతెరువు చేసుకుని జనానికి తాను అమ్మవారినని బురిడీ కొట్టించి మూఢత్వంతో బలై పోయిన ఉదంతమిది.
శ్రీకాకుళం జిల్ల్లా కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన తిమ్మల గోపి అనే యువకుడు స్వగ్రామంలో పని దొరక్క... వలస వెళ్లినా జీవనం గడవక.. వక్రమార్గం పట్టాడు. సోలాపూర్ అమ్మవారినంటూ కొంతమంది శిష్యులను పోగేసుకుని ఓ కొండపై ఆశ్రమం ఏర్పాటు చేసుకుని.. అద్భుతాలు సృష్టిస్తానం టూ ప్రచారం చేసుకున్నాడు. సోలాపూర్ అమ్మవారు తన గర్భాన జన్మిస్తుందని ప్రచారం చేసుకుని.. ఆ కథ అడ్డం తిరగడంతో ఆత్మహత్యకు పాల్పడి.. జైలు పాలై.. చివరికి శిష్యుడి చేతిలో హతమయ్యాడు. 'మనల్ని ఎవరూ నమ్మడం లేదు. చనిపోతే జనం మనకు పూజలు చేస్తారు.

ఇంట్లో వాళ్లూ ఆర్థికంగా సుఖపడతారని' శిష్యుడికి చెప్పాడు. తనను కత్తితో నరికి, ఆపై నీవూ నరుక్కుని చనిపోవాలని శిష్యుడిని ఆదేశించాడు. గురువు (అమ్మవారు) చెప్పినట్టుగానే శిష్యుడు అతడిని నరికేశాడు. తానూ నరుక్కున్నాడు. అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చావు బతుకుల్లోవున్న అతడిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెం దిన తిమ్మల గోపి విషాద గాథ ఇది. మానసిక వ్యాధితో మూఢనమ్మకాలకు గురైన గోపీ ఎత్తులను ఎండగట్టి, అతని బారి నుంచి భక్తులను రక్షించేందుకు విశేష కృషిచేసిన పోలీసులు, అధికారులు, వైద్యులు.. అతనిని మూఢ నమ్మకం నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకోకపోవడంతో గోపీ కథ విషాదాంతమైంది. ఇటీవలకాలంలో బాబాల మహత్యాలు ఎక్కువై, అనేక ఆశ్రమాలు పుట్టుకొస్తూ, మానవతీత శక్తులు ఉన్నాయంటూ చేసుకుంటున్న ప్రచారానికే గోపీ ఆకర్షితుడయ్యాడు. ఈ మూఢ నమ్మకాలనే ప్రచారం చేశాడు. శిష్యులకూ చెప్పాడు. తాము చెప్పేది నిజం కాదని తెలిసినా.. సొమ్ములు వస్తుండటంతో కొంతమంది శిష్యులూ పోగుపడ్డారు. అతని ప్రభావం నుంచి ప్రజలను బయటపడేసేందుకు, అతనివన్నీ మాయమాటలను చెప్పడంలో విజయవంతమైన అధికార యంత్రాంగం, అతనిని సంస్కరించేందుకు కూడా చర్యలు తీసుకునివుంటే గోపీ ప్రాణాలను కాపాడి వుండేదేమో.

కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన తిమ్మల గోపి ప్రారంభంలో స్వగ్రామంలో కూలి పనులు చేసుకుని జీవించాడు. ఉపాధి కోసం ఒడిశా రాష్ట్రంలోని సోలాపూర్, ఖరగ్‌పూర్ వెళ్లాడు. అక్కడ పనులు చేసుకుంటూనే సోలాపూర్ అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేసేవాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో మునగ చెట్టుకు పూజలుచేస్తూ, మహిమలు చూపేందుకు ప్రయత్నించాడు. గ్రామంలో తన ప్రయత్నాలు అంతగా ఫలించకపోవడంతో కంచిలి మండలంలోని కత్తివరం కొండను ఆశ్రయించాడు. అక్కడే ఆశ్రమం (షెడ్డు) నిర్మించుకుని, కొంతమంది శిష్యబృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారి ప్రచారంతో కొండకు భక్తుల రాక ప్రారంభమయింది. ఈ నేపధ్యంలో తాను గర్భం దాల్చానని, సోలాపూర్ అమ్మవారు తన కడుపున జన్మించనుందని ప్రచారం చేసుకున్నాడు.

ఈ ప్రచారంతో మీడియా రంగంలోకి దిగింది. మీడియా కథనాలతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీవో ఎం.రోజారాణి, ప్రత్యేకాధికారి రవిప్రకాష్ కొండపైకి వెళ్లి గోపీని విచారించారు. నవంబర్ 30న తన కడుపులో అమ్మవారు బంగారు ప్రతిమ రూపంలో జన్మిస్తుందని గోపీ విచారణలో చెప్పాడు. ఈ దశలో ఏఎన్ఎం వైద్య పరీక్షలు నిర్వహించి గోపీకి ఎటువంటి గర్భం లేదని నిర్ధారించారు. కొండను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు 17వ తేదీన తన ప్రియ శిష్యుడు ఇరోతు కృష్ణను ఆత్మహత్యకు ప్రేరేపించాడు. సోంపేట ఆసుపత్రిలో కృష్ణకు చికిత్స జరిపిన అనంతరం తాను కూడా విషం తీసుకున్నానని చెప్పడంతో గోపీని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ గోపీకి సాధారణ పరీక్షలతోపాటు, గర్భానికి సంబంధించిన పరీక్షలుచేశారు.

గోపీ గర్భం దాల్చలేదని తేల్చిచెప్పాడు. కోలుకున్న అనంతరం కృష్ణను ఆత్మహత్యకు ప్రేరేపించడం, భక్తులకు మోసగించిన నేరాలపై గోపీని అరెస్టుచేసి, రిమాండ్‌కు తరలించారు. సుమారు నెల రోజులపాటు జైలులోవున్న గోపీ ఈ నెల 23వ తేదీన బెయిల్‌పై బయటకువచ్చి, స్వగ్రామానికి వెళ్లాడు. రెండు రోజులపాటు ఇంటి వద్దే ఉన్న గోపీ బుధవారం సాయంత్రం సోంపేటలోని తన అక్క వద్దకు వెళ్తానని చెప్పడంతో అతడి అన్న మోహన్ సోంపేటలోని గాంధీమండపం వద్ద దిగబెట్టాడు. అయితే సుమారు రాత్రి పది గంటల సమయంలో గోపీ అక్క కూర్మావతికి మోహన్ ఫోన్‌చేసి గోపీ వచ్చాడా అని అడగడం, ఆమె రాలేదని చెప్పడంతో వెంటనే గోపీ సెల్‌కి ఫోన్ చేశాడు. సెల్ రింగ్ అవుతున్నా.. ఎంతకీ తీ యకపోగా రాత్రి పదకొండు గంటల సమయంలో ఫోన్ తీ సిన గోపీ మాట్లాడాడు. తాను, తన శిష్యుడు ఆత్మబలిదానం చేసుకుంటున్నామని, ముందు కృష్ణ తనను నరుకుతాడని, తరువాత తాను నరుక్కుని చనిపోతాడని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

ఉదయం మోహన్ కొండపైకి వెళ్లి చూడగా, గోపీ శిష్యుడు ఇరోతు కృష్ణ అపస్మారక స్థితిలో షెడ్డు బయట పడి ఉన్నాడు. షెడ్డులో గోపీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

కృష్ణ కథనం ప్రకారం.. బుధవారం రాత్రి గోపీ తనను కొండపైకి రమ్మని చెప్పాడని, అనంతరం అమ్మవారి ఆజ్ఞ మేరకు ఇన్నాళ్లు అన్ని చేసిన మనం ప్రస్తుతం జనం నమ్మని కారణంగా ఆత్మబలిదానం చేసుకోవాలని అమ్మచెప్పిందని తెలిపాడు. ముందుగా తనని నరకమని చెప్పి, అనంతరం నువ్వు నరుక్కోమని చెప్పడంతో అక్కడే ఉన్న పెద్ద కత్తితో తానే గోపీని మెడ వెనుక భాగంలో నరికి చంపానని తెలిపాడు. గోపీని నరికిన అనంతరం తానుకూడా కత్తితో మెడపై నరుక్కున్నానని తెలిపాడు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణను సోంపేట ఆసుపత్రికి తరలించినపుడు తనకు గోపీకి మధ్య శారీరక సంబంధం ఉందని, తాము అమ్మవారి ఆజ్ఞమేరకు గతంలో పెళ్లి చేసుకున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో తామిద్దరం ఆత్మబలిదానం చేసుకోవాలని అమ్మ చెప్పడంతో ఇద్దరం అందుకు సిద్ధపడ్డామని తెలిపాడు. అనంతరం గోపీ చెప్పడంతోనే తాను అతడిని కత్తితో నరికి, తరువాత తాను చనిపోయేందుకు సిద్ధపడ్డానని తెలిపాడు. తరువాత తామిద్దరం చనిపోతే తమ కుటుంబాలు బాగుపడతాయని, భక్తులు సైతం తమ ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తారని, గుర్తింపు లభిస్తుందని గోపీ చెప్పాడని తెలిపాడు. ఈమేరకు గోపీ కూడా సూసైడ్ నోట్ రాశాడు. అయితే కొండపై గోపీని హత్యచేసిన ప్రదేశం ఒక చోట ఉంటే మృతదేహాన్ని అమ్మవారి పాదాల వద్దకు చేర్చటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకేచోట ఆ ప్రయత్నం చేయకుండా ఇలా మృతదేహాన్ని ఒకచోటు నుంచి వేరొకచోటుకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం గోపీ వద్ద ఉందని, దాని కోసమే అతడిని హతమార్చి ఉంటారనే ప్రచారమూ జరుగుతోంది. మొత్తంమీద మూఢ నమ్మకాలు ఓ యువకుడి ప్రాణం తీసుకున్నాయి. మరొకరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాయి.

కేజీహెచ్‌కు కృష్ణ తరలింపు: గోపిని కత్తితో హత్యచేసి, ఆత్మహత్యకు పాల్పడిన ఇరోతు కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గోపిని బుధవారం అర్ధరాత్రి హత్యచేసిన అనంతరం కత్తితో మెడపై న, చేతిపైన గాయాలు చేసుకుని కృష్ణ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అధిక రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి చేరిన కృష్ణను గురువారం ఉదయం పోలీసులు సోం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అ నంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Wednesday 26 December 2012

పార్టీల్లో అఖిలం టెన్షన్...?

హైదరాబాద్, డిసెంబరు 26: అసలేం జరుగుతోంది...? ఏం జరగబోతోంది....? ఏం జరగనుంది....? సమస్య అదే... పార్టీలు మారాయి... నాయకులూ మారారు. అప్పటి ప్రరాపా స్థానంలో ఇప్పటి వైకాపాకు చోటు దక్కింది. లోక్‌సత్తాను అసలు పరిగణనలోకే తీసుకోలేదు. 2010 రిపీట్‌ అవుతుందా? ఫలితం వస్తుందా? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ సమస్య సజీవంగా ఉంది. మరీ పుష్కరకాలంగా ఉద్యమం ఉధృత స్థాయికి చేరింది. సమస్యపై తాడోపేడో తేల్చాల్సిన సమయం వచ్చేసింది. మరి ఇప్పటికైనా సమస్య తేలుతుందా?
అధిష్ఠానం పెద్దల మనసులో అఖిలపక్షమన్న ఆలోచన కొత్తదేమీ కాదు... కాకపోతే దాన్ని ఈసారి సరికొత్తగా ఆవిష్కరించారు. తెలంగాణపై అఖిలపక్షానికి సిద్ధమని ప్రకటించారు. అందుకు ముహుర్తాన్ని ఈనెల 28గా నిర్ణయించారు. అఖిలపక్షంతో ఏదో జరగబోతుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈసారి తెలంగాణ వచ్చేస్తుందన్న ఆశతో తెలంగాణవాదులు ఎదురుచూస్తున్నారు. అఖిలపక్షంతో తేలేదేమీ లేదని, కేవలం అభిప్రాయ సేకరణే జరుగుతుందని సీమాంధ్రవాదులు చెబుతున్నారు. హోంమంత్రి మంత్రి మారినందునే మరోసారి అఖిలపక్షం నిర్వహిస్తున్నామని కేంద్రమూ తేల్చిచెప్పేసింది. ఈ అఖిలపక్షంతో రాజకీయ పక్షాల అసలు రంగు బయటపడుతుందని అన్ని పార్టీలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. దీనిపై కొంచం లోతుల్లోకి వెళదాం... 2009 ఎన్నికలకు ముందు... తెలంగాణపై అన్ని పార్టీలదీ ఒకే మాట. ప్రత్యేక రాష్ట్రానికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని. 2009 ఎన్నికల మొదటి దశ పూర్తికాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్లేటు ఫిరాయించారు. హైదరాబాద్‌ వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని నంద్యాల సభలో భావోద్వేగాలు రెచ్చగొట్టారు. దీంతో టీఆర్‌ఎస్‌ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం ఇరుకున పడింది. వైఎస్‌ ప్రకటనతో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు బాగానే లాభించింది. తర్వాత కొంతకాలం తెలంగాణపై టీఆర్‌ఎస్‌ మినహా... అన్ని పార్టీలు మౌనంగా ఉన్నాయి.

2009 నవంబరు 29న కేసీఆర్‌ దీక్ష తర్వాత అభిప్రాయ సేకరణ కోసమంటూ నాటి రోశయ్య ప్రభుత్వం డిసెంబరు 7న అఖిలపక్షం ఏర్పాటు చేసింది. తెలంగాణపై రాష్ట్రంలో జరిగిన తొలి అఖిలపక్షం ఇదే. అన్ని పార్టీలు తెలంగాణకు వ్యతిరేకం కాదని, అసెంబ్లీలో తీర్మానం చేద్దామని గట్టిగా నొక్కి చెప్పాయని ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండురోజుల క్రితం తనను కలసిని టీజేఏసీ నేతలకు విస్పష్టంగా చెప్పారు. 2009 డిసెంబరు 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం తలకిందులయ్యాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ మినహా అన్ని పార్టీలు అడ్డం తిరిగాయి. తెలంగాణలో సంబురాలు... సీమాంధ్రలో సమరాలు ఏకకాలంలో మొదలయ్యాయి. కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు పార్టీలకతీతంగా ఏకమయ్యారు. సామూహికంగా రాజీనామాస్త్రాలు సంధించారు. ఈ పరిణామాలతో కేంద్రం మరోసారి ఆలోచనలో పడింది. డిసెంబరు 23న తెలంగాణపై మరో ప్రకటన చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలంటే రెండు ప్రాంతాల అభిప్రాయాలు అవసరమని, ఏకాభిప్రాయమూ ముఖ్యమంటూ అఖిలపక్షానికి పిలుపునిచ్చింది. ముహుర్తం 2010 జనవరి 5. అది కేంద్ర స్థాయిలో మొదటిది... మొత్తంగా రెండోసారి నిర్వహించిన అఖిలపక్షం.

ఈ భేటీకి రాష్ట్రం నుంచి 8 గుర్తింపు పొందిన పార్టీలను కేంద్రం ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్‌కుమార్‌డ్డి, కావూరి సాంబశివరావు హాజరయ్యారు. ఇద్దరూ వేర్వేరు అభిప్రాయాలు చెప్పారు. ఇక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉత్తమ్‌కుమార్‌డ్డి చెప్పగా.... తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కావూరి డిమాండ్‌ చేశారు. మజ్లిస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, అసెంబ్లీలో ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. రాష్ట్ర విభజన అవసరం లేదని, అలాంటి అనివార్య పరిస్థితే వస్తే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకుని, హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ లేని రాష్ట్రాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. పీఆర్పీ తరఫున హాజరైన ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, పార్టీ నేత సీ రామచంద్రయ్య రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, తాము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. టీడీపీ తరపున తెలంగాణ ప్రాంతం నుంచి రేవూరి ప్రకాశ్‌డ్డి, సీమాంధ్ర నుంచి యనమల రామకృష్ణుడులు వెళ్లారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని, డిసెంబర్9 ప్రకటనను అమలు చేయాలని రేవూరి కోరగా.. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్నదే తమ అభిప్రాయమని యనమల చెప్పారు.

ఆ తర్వాత 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీ నియామించింది కేంద్రం. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ డిసెంబరు 30, 2010న రాష్ట్రంలోని పరిస్థితులపై సమగ్రమైన నివేదిక సమర్పించింది. ఇది మరింత అగ్గి రాజేసింది. 8 అధ్యాయాలు, 6 సూచనలతో నివేదిక ఇచ్చిన కమిటీ... 8వ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచడం రాష్ట్రంలో మరోసారి రాజకీయ సంక్షోభానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే 2011, జనవరి 6న ముచ్చటగా మూడో అఖిలపక్షాన్ని నిర్వహించింది కేంద్రం. ఈ సమావేశాన్ని టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ బహిష్కరించాయి. మిగిలిన పార్టీలు హాజరైనా... సమావేశంలో ఏమీ తేలలేదు. తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరకలేదు.

తాజా అఖిలపక్షం నాలుగోది. ఏమైనా...అఖిలపక్ష భేటీ పేరుతో నాటి హోంమంత్రి చిదంబరం మొదలు.. అదే శాఖకు నేటి మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వరకూ దోబూచలాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి దశలో తన హయాంలో రెండు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించిన చిదంబరం.. ఆ తర్వాత అసలు అఖిలపక్ష ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. నాలుగు పార్టీలు ఇంకా అభిప్రాయం చెప్పలేదని, ఆ పార్టీలు అభిప్రాయం చెప్పిన తర్వాతే అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని పాడిన పాటనే పదే పదే పాడారు. చివరకు ఆ పదవిలోంచి వెళ్లిపోయారు. ఓ దశలో అఖిలపక్షంలో ఏకాభిప్రాయం కాదు.... ఆయా పార్టీల నాయకులే ముందు ఏకాభిప్రాయానికి రావాలని ఓ సలహా కూడా ఇచ్చారు. తాజాగా చిదంబరం స్థానంలో బాధ్యతలు స్వీకరించిన షిండే కూడా అదే బాట పట్టారు. అఖిలపక్షం ఏర్పాటు ఆలోచన ఇప్పట్లో లేదని నెలరోజుల కిందటి దాకా చెబుతూ వచ్చారు. అదే సమయంలో తన అభిప్రాయాన్ని అఖిలపక్షం అవసరం లేకుండానే తెలంగాణపై... కేంద్రం నిర్ణయం తీసుకోగలదన్నారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఒత్తిడికో... వారిని బుజ్జగించేందుకో కానీ ఈ అఖిలపక్షానికి అంగీకారం లభించింది. అయితే.. ఇది శ్రీకృష్ణ కమిటీ చెప్పినదానికి అనుగుణంగానే జరుగుతున్నదన్న వాదనా లేకపోలేదు. మొత్తానికి ఢిల్లీ పెద్దలు అఖిలపక్షానికి.. ఏకాభిప్రాయానికి ముడేశారు. నిజానికి ప్రపంచంలో ఏ అంశంపైనా ఏకాభిప్రాయం సాధ్యం కాదన్న సంగతి ఎవరికీ తెలియంది కాదు. చట్టసభల్లో ఒక బిల్లు ఆమోదం పొందటానికే కాదు.. సాక్షాత్తూ భారతదేశ పరిపాలనకు మూలాధారమైన రాజ్యాంగాన్ని సవరించడానికి కూడా ఏకాభిప్రాయం అవసరం లేదు. నిర్దిష్టమైన మెజార్టీ ఉంటే చాలు. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం అదే. ఎక్కువ మంది ఏది కోరుకుంటే అది! ఇంగ్లిష్‌లో చెప్పాలంటే... మెజారిటీ ఈజ్‌ లా అన్నమాట. కానీ.. తెలంగాణ అంశానికి మటుకు అది వర్తించడం లేదు. మరి డిసెంబరు 28 అఖిలపక్షం చివరిదవుతుందా.... ఇంకా సమస్యను జఠిలం చేస్తుందా? లేక నాన్చివేత ధోరణికి కొనసాగింపు అవుతుందా? 2014 ఎన్నికలకు తెలంగాణ మరోసారి ఎజెండాగా మారుతుందా? మరో 48 గంటల్లో పాలకు పాలు... నీళ్లకు నీళ్లులా తేలిపోనుంది.


----------------

ప్రపంచ తెలుగు సదస్సులు

రేపటి నుంచే...
ప్రపంచ తెలుగు సదస్సులు


తిరుపతి, డిసెంబరు 26 : ప్రపంచ తెలుగు మహాసభలు గురువారం తిరుతిలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విద్యాలయంలోని శ్రీ వేంకటేశ్వర ప్రాంగణం ప్రాంగణం వేదికగా 4వ ప్రపంచ తెలుగు మహాసభలను లాంఛనంగా ప్రారంభిస్తారు. విశిష్ఠ అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ పాల్గొనే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొంటారు.
ఈ మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహాసభల నేపథ్యంలో తిరుపతి పట్టణం సర్వాగసుందరంగా ముస్తాబైంది. ప్రధాన వేదిక, ఉప వేదికలను అందంగా తీర్చిదిద్దారు. ఫుడ్‌కోర్ట్స్‌, వాహనాల పార్కింగ్‌, సినిమాల ప్రదర్శనకు థియేటర్లు, నాటకాల ప్రదర్శనకు థియేటర్లు, ఎగ్జిబిషన్లు, సెమినార్లు జరగడానికి వేదికలు వంటి చోట్ల ఎటువంటి అసౌకర లేకుండా,
ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అంచనా కంటే ప్రజలు, ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో అనుకోకుండా హాజరైన పక్షంలో వారికి భోజన, వసతి సౌకర్యాల కల్పనకు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేశారు. వీటికోసం కొన్ని కళ్యాణమండపాలు గుర్తించి, వంట ఏర్పాట్లు తదితర అంశాలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రధాన వేదిక, ఉప వేదికలను రెయిన్‌ ప్రూఫింగ్‌ చేసి, వర్షం వచ్చినా.. ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు 3,500 మంది కళాకారులు, వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాలు, రాష్ట్రం నుంచి 3,700 మంది ప్రతినిధులు ఇప్పటికే నమోదు చేసుకోగా, వీరు కాకుండా విద్యాశాఖకు చెందిన తెలుగు పండితులు, రీసెర్చ్‌ స్కాలర్స్‌, సాధారణ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ప్రపంచ తెలుగ మహాసభలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతున్నారు.

తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు చర్యలు
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పిల్లలు ఏ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పిల్లలు ఏ మేరకు తెలుగు పట్ల అభిరుచి చూపుతున్నారు? సమాజంలో తెలుగు భాష, సంస్కృతి ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభలలో చర్చించి వాటి పరిరక్షణ ర్చించి వాటి పరిరక్షణకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. ఒకవైపు పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంపొందిస్తూ, మరోవైపు మన భాష, సంస్కృతి పరిరక్షణకు వారిని సంసిద్ధం చేయవలసివ అవసరాన్ని ఈ సదస్సులు నొక్కి వక్కానించనున్నాయి.

తెలుగు చరిత్రపై....
"దేశ భాషలందు తెలుగు లెస్స'' అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన మాట - దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలన్నిటికంటె శ్రేష్ఠమైనదని తెలియపరుస్తుంది. క్రీ.పూ.5, 6 శతాబ్దాలనాటికే తెలుగు భాష ఉన్నట్లు శాస్త్రవేత్తలు రుజువుచేశారు. క్రీ.పూ.3000-2500 సంవత్సరాలనాటికే ఒక భాషగా తెలుగు విలసిల్లిందని తెలియజేసే శాసనాలు - కర్నూలు జిల్లా - ఓర్వకల్లు మండలంలోని కన్నమడకలో పరిశోధకులు కనుగొన్నట్లు తెలుస్తుంది. దీనినిబట్టి తెలుగు భాష ఐదువేల ఏళ్ళ చరిత్ర కలిగివుందని తెలుస్తోంది. భాషకు ప్రాచీన హోదా లభించింది. ఇందుకు తెలుగు తెలుగువారందరు గర్విస్తున్నారు.

క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.200 సంవత్సరాల వరకు 500 సంవత్సరాలు పరిపాలించిన శాతవాహనుల కాలంలో తెలుగుభాషకు, తెలుగు సాహిత్యానికి విశేష ఆదరణ లభించింది. వాస్తు, శిల్ప, చిత్ర వాస్తు, శిల్ప, చిత్రలేఖనం, కళలు విలసిల్లాయి లేఖనం, కళలు విలసిల్లాయి. 'బృహత్కథ', 'గాథాసప్తశతి' ఈకాలం నాటి సాహిత్య గ్రంథాలు. స్త్రీలు కూడ కవిత్వం రాసేవారని 'గాథాసప్తశతి' వల్ల తెలుస్తుంది. వ్రాసేవారని 'గాథాసప్తశతి' వల్ల తెలుస్తుంది. ఈ రెండు గ్రంథాల ద్వారా తెలుగు వారి సంస్కృ విశేషాలు తెలియవస్తున్నాయి. శాతవాహనుల తరువాత పాలించిన ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు మొదలైనవారి కాలంలో విద్య, భాషా సారస్వతాలు విలసిల్లాయి. స్థూపాలు, దేవాలయాలు నిర్మితమయ్యాయి. ఇవి తెలుగువారి శిల్పకళకు అద్దం పడుతున్నాయి. తూర్పు చాళుక్యులు క్రీ.శ. 6 నుండి 1000 వరకు పరిపాలించారు. ఆదికవి నన్నయ్య ఈ కాలంలో సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. తెలుగుభాషలో ఇదే మొదటి సాహిత్య గ్రంథం. ఈ రచనకు ప్రోత్సహించిన రాజు -
రాజరాజు. ఆ తరువాత పాలించిన వారు కాకతీయులు. క్రీ.శ.1001 నుండి 1300 వరకు 300 సంవత్సరాలు పాలించారు. ఈ కాలంలో తెలుగుభాషలో పలు సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయి. ఆ తరువాత రెడ్డిరాజులు, పద్మనాయకులు కొంతకాలం పాలించారు. రెడ్డి రాజుల కాలంలో తెలుగు సాహిత్యం విలసిల్లింది. విజయనగర సామ్రాజ్యం 1336 నుండి 1680
వరకు ఆంధ్రదేశంలో సాగింది. ఈ కాలంనాటి రాజుల్లో ప్రవ ఈ కాలంనాటి రాజుల్లో ప్రముఖుడు శ్రీకృష్ణదేవరాయ. ఈయనకు 'సాహితీ సమరాంగణ సార్వభౌముడు' అనే బిరుదు ఉంది. స్వయంగా కవి. 'ఆముక్త మాల్యద'ను రచించాడు. పెద్దన, తెనాలి రామకృష్ణుడు మొదలైన అష్టదిగ్గజ కవులను తన ఆస్థానంలో పోషించాడు. తెలుగు సాహిత్యంలో ఇది స్వర్ణయుగం. తంజావూరులో నాయక రాజుల పాలన సాగింది. వీరి కాలంలోనూ సాహిత్యం, కళలు విలసిల్లాయి. రఘునాథనాయకుడు సంస్కృతంలోను, తెలుగులోనూ గొప్ప కవి. ఆ తరువాత కుతుబ్‌షాహీలు 1512-1687 వరకు పరిపాలించారు. వీరు తెలుగు కవి, పండితులను పోషించారు. నన్నయ నుండి నేటివరకున్న కవులు, రచయితలు తెలుగు భాషా, సాహిత్యాలను సుసంపన్నం చేశారు.
ప్రపంచంలోని తెలుగువారంతా కలిసిమెలిసి తెలుగు భాషను, సంస్కృతిని, విలువలను, తెలుగుదనాన్ని కాపాడుకుంటూ రాబోయే తరాల వారికి అందించడానికి కలి రికి అందించడానికి కలిసికట్టుగా క లిలిసికట్టుగా కృషి చేస్తున్నామనన్న సందేశాన్ని తిరుపతిలో డిసెంబరు 27, 28, 29 త నన్న సందేశాన్ని ప్రపంచ తెలుగు మహా సభల వేదిక నుంచి ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది.
తెలంగాణపై....
సోనియాకు చిక్కు?


హైదరాబాద్‌, డిసెంబరు 26 : తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానాన్ని చిక్కుల్లో పడేసే విధంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వ్యూహాన్ని రచించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చిక్కులు కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ వైఖరిని చీల్చి చెండాడాలని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనుకుంటున్నాయి. తెలంగాణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం మెడ మీద కత్తి వేలాడుతున్నట్లే చెప్పాలి. అఖిలపక్ష సమావేశంలో ముందుగా అన్ని పార్టీలూ తమ వైఖరి చెప్పిన తర్వాత తమ వైఖరి చెబుతామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే, పరిస్థితి అందుకు అనుకూలంగా లేనట్లు కనిపిస్తోంది. తెలంగాణకు అనుకూలమని కాంగ్రెస్ అధిష్టానం చెప్తే పరిస్థితి పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. జెసి దివాకరరెడ్డి లాంటి వారు రాయలసీమ ప్రాంతానికి అఖిలపక్షంలో ప్రాతి నిధ్యం కల్పించాలని లేఖ రాస్తే, తనను అఖిల పక్షానికి పంపించాలని మంత్రి శైలజానాథ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అటు సీనియర్‌ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు సమైక్యాంధ్ర జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలతో చురుగ్గా ఉంటున్నారు. లగడపాటి రాజగోపాల్‌ లాంటి వారు ఈ అఖిలపక్షం వల్ల ఒనగూరే ప్రయోజనమేదీ ఉండ బోదని ప్రచారం చేస్తున్నారు. సీమాంధ్ర నాయకులు తమ ఏర్పాట్లో తాము ఉంటే, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా నాయకత్వం మీద విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో అవగాహన కోసమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశామని, ముందుగా భేటీలో పాల్గొనే అన్ని పార్టీలు (కాంగ్రెస్‌ మినహా) తమ అభిప్రాయాలను చెబితే వాటిని పరిశీలించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని షిండే మంత్రిత్వ శాఖ నోట్‌ జారీ చేసింది. ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఇబ్బందుల్లోకి నెట్టింది. కేంద్రం తెలంగాణపై మరోసారి నాన్చుడు వైఖరి అవలం బించేందుకే ఈ ఎత్తుగడలను అనుసరిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణా మాల ఫలితం గానే కేకే లాంటి సీనియర్‌ నేతలు మాటల తూటాల వాడి మరింత పెంచారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌ ప్రజాద్రోహం చేసిన ట్టవు తుందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే సమావేశంలో పార్టీ తెలంగాణకు అనుకూలంగా కనిపించకపోతే ఇతర పార్టీల్లో చేరడానికి కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు సిద్ధపడుతున్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి లాంటి వారు తెలంగాణ ఇవ్వ పోతే తమ దారి తాము చూసుకుంటామని ఇప్పటికే ప్రకటించేశారు. సీనియర్‌ ఎంపీ మందా జగన్నాథం సైతం తమకు టీఆర్‌ఎస్‌ నుంచి ఆహ్వానం ఉందని, తెలంగాణపై ఏదో ఒకటి తేల్చకపోతే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని బహిరంగంగానే చెప్పారు. మరో ఎంపీ వివేక్‌ అటు అధిష్ఠానం పైనా, ఇటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపైనా అవకాశం దొరికినప్పుడల్లా కత్తులు దూస్తున్నారు. అఖిలపక్షంలో ఏ నిర్ణయమూ చెప్పకపోతే ఆ సమావేశానికి హాజరయ్యే అన్ని పార్టీల నుంచీ ఎదురు దాడిని ఎదుర్కునే అవకాశం ఉంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు సిపిఎం, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అఖిల పక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసే వ్యూహాన్ని అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది.

Tuesday 25 December 2012

DTH Subscribers

Latest Survey: DTH Subscribers In India

he growth rate of DTH subscriber base in India is slowing down with just about 16% increase in last three quarters. As of June 2012, 48.1 million DTH subscribers are registered with private service providers. Major DTH service providers include Dish TV, Airtel, Reliance, Tata Sky,Videocon and Sun Direct TV.

Recent developments:
- For Q1 FY13, Airtel reported 7.4 million Airtel DTH subscribers.
- For Q1 FY13, Dish TV reported 13.4 million subscribers.
- For Q1 FY13, RCOM’s Reliance Digital TV reported 4.4 million subscribers.
- Dish TV maintained the top position among DTH providers. Reliance digital TV was among the ones with the least subscriber base with just 4.4 million subscribers, while Tata Sky is said to have 9.2 million subscribers, Airtel digital TV with 7.4 million subscribers, Videocon d2h with 6.1 million subscribers, and Sun Direct TV with 7.6 million subscribers.
- It should be noted that Sun Direct had crossed 7 million subscribers back in 2011 and has added only 6 lakh subscribers by June 2012.
- Reliance Digital TV has added the least number of subscribers since last three quarters, followed by Tata Sky and Airtel DTH.
- Surprisingly, Videocon d2h has added more than 2 million subscribers in last one year, while other operators (excluding Dish TV) have struggled to cross a million.

Worst Journalists

India’s Worst Journalists – 2012

he most prominent ones are not even journalists anymore; they are ‘Editorialists’ whose main job is to
swing public opinion one way or another. Add to this the epidemic of ‘paidnews’ and some of our news channels
and newspapers would be nothing more than Bollywood or Commercials. After all,
didn’t the late Christopher Hitchens
say: “I became a journalist because one
didn’t have to specialise
”.

Some prominent faces from the 2010 roll of honour have dropped out. Vinod Mehta has retired from active
journalism and remains Chairman of Outlook. We wish him well. Suzy Roy has moved from part-time lie-mongering
to full-time Maoist-Hurriyat sympathiser. ‘Pastiwalas’ are over-joyed at the
ever growing size and weight of her 50+ page essays – they’re the only ones
handling them now. Prannoy Roy was
also dropped. He is now more into barbeque chats than any serious attempts at
journalism. Even elections don’t arouse him. But there are some new faces with
the old ones. Polling for IWJ ended
today and thanks to all those who voted
. So here are the winners from the
poll, the list of India’s Worst
Journalists-2012
from the poll results. Their 2010 ranking is indicated
after their name:
Large & Larger..
10. Nidhi Razdan, NDTV (New
entry): She has come to prominence more for many reasons other than journalistic
skills. ‘Left, right, centre’ is her signature programme and happens to be one
of those mindless debates on every topic under the sun. She is proof that you
can be an expert on everything with specialisation in nothing. The best part of
Nidhi? Now, don’t get me wrong, she likes everything large. Whenever confounded
by a brilliant argument or point by a panellist she quickly jumps to her
favourite line “let’s look at the LARGER picture”. One would have thought that
debates are meant to look at the finer small details. No, not with Nidhi, the
larger picture is a convenient exit. Training from NDTV helps. My prediction
for this debutant is that she is likely to go higher up in the list in the future.
Friendly five member
9. Kumar Ketkar (New entry):
Somewhere a brief bio about Ketkar says je started his life as a communist. Now why is that not
so surprising? And that also explains Ketkar somewhat. He is also reported to
be a former speech writer during elections for Congress members. Isn’t that an
accomplishment any journalist would be proud of? He has been mostly a Marathi
journalist and last heard he is editor of Divya Marathi. A respected veteran,
he was one of the privileged Five invited to a private press meet of PM
Manmohan Singh around June 2011. Ever since, it has been downhill. He achieved
his right to be on this list through his performances as a panellist. What can
I say? I hope being a veteran he doesn’t appear here in the future.
Your Banal
8. Arnab Goswami, TimesNow
(2010 #3): There can be no denying that Arnab is one of the rare patriots among
journalists. Almost every one wishes our judiciary could be as quick and
decisive as Arnab is. Which is the reason I conferred him the title ‘Justice Arnab’. His performance on
TimesNow has definitely battered ratings of NDTV and CNN-IBN. Pick up any scam,
any scandal Arnab can throw the documents at you. IB, RAW, GOI have no escape –
all documents and papers have to pass through Arnab. Sometime back I remarked:
Most of us wake up in the morning and want Coffee or Tea! Not Arnab, he just
wants ‘answers’. Such are the never-ending questions he has. Much before Arnab
became a journalist the rock band U2
wrote a song for him – “I still haven’t
found what I’m looking for
”. They were the only ones to anticipate all the
unanswered questions he’d come up with. Undeniable fact is that Arnab has
dropped from #3 in 2010 to #8 in 2012 on this list. That is proof of his
ever-growing popularity. He can out-shout anyone in this world. Anyone, except
Meenakshi Lekhi and Smriti Irani.
Fine WhINES
7. Vir Sanghvi (2010 #9): I
honestly don’t have any idea whatsoever what Sanghvi currently does. I don’t
even see him on any Cookery or Foodie show. He must be doing something to merit
an appearance on this list again, at a higher position even. Radiagate has
damaged him far more than any other journalist, which is unfortunate. He
managed to surface sometime back on his home channel NDTV claiming the Radia
tapes were doctored and weren’t authentic and were tested by reliable foreign
forensic labs. Nobody bought that though. Sometimes, a wayward journalist, at
his peak, forgets simple decency. Sanghvi will forever be haunted with two
things: Radiagate and the fact that he called Narendra Modi a ‘mass-murderer’.
He will regret both episodes. Had it not been for Modi ignoring his stupid
outburst Vir Sanghvi would have been in prison writing a cookery book or his
autobiography titled “Fine Whines!”.

No facts, please
6. Karan Thapar (2010 #4): Readers
must remember that every journo looks tall in the studio but not in actual
life. KT is not blessed with stature and the same goes for his journalism. One
can say he has improved a bit but still retains the unwanted scowl and growl
when interviewing people. Madhu Trehan
in her NewsLaundry interview showed
up KT for the little puppy he was. Like the ones who just need a hug and a
cuddle once in a while. And if you thought you knew nothing about KT, never
mind. All you have to do is hear his signature line on his promo for his show
on CNN-IBN: “I don’t want to go into the
facts, the facts are disputed
”. LOL! Facts are disputed? You have to undo a
lot of learning to understand that facts aren’t facts and can be
disputed. The worst job KT did in 2011 was massaging Kapil Sibal’s brazen
attempt at pre-screening content on the internet. As if that wasn’t enough he
pulled out Brajesh Mishra, former NSA, out of nowhere to call serving army
chief, Gen. VKSingh, the worst ever chief of army in history. My prediction: As
long as he is in the business, KT will be on this list.
Wheres the smirk?
5. Vinod Sharma (New entry):
For those who don’t know, Vinod Sharma is the political editor of Hindustan
Times. That’s right, ‘Political’ is the key word – less of an editor and more
of a politician. It’s not very hard to recognise VS on a friendly channel. He
has made the ‘smirk’ more popular than child-molester DGP Rathore on
television. Sharma has also been acknowledged by many political spokespersons
and viewers as the most loyal spokesperson of the Congress party. No matter
what the scam or what the scandal you can expect him to staunchly defend even
the worst misdeeds of the Congress by blaming it on the opposition or anyone
else he can lay his hands on. The one chance to get him off TV for longer
periods was a Rajya Sabha ticket, when Shobana Bhartiya, his boss at HT exited,
but that unfortunately didn’t happen. So we’re going to be stuck with VS for
quite a while. His best moment in recent times was during the debate over Gen.
VK Singh and the Tatra trucks scam. He was angry that the debate was going one
way (in favour of Gen. Singh) so had to somehow twist it against the tide. In
his business time VS writes a blog titled ‘Separated at birth’. I guess that
refers to some Pakistani connection or maybe his journalistic independence was
separated at birth. Someday we’ll find out.
He’s no Egghead
4. Shekhar Gupta (2010 #10):
When he appeared on the last list, a fan of Gupta wrote in stating he will
email my post to SG for his response. I was wondering whether that fan objected
to SG being at #10 and wanted him to be lower on the list. I guess that fan’s
prayers are answered. SG has sunk further in the rankings and his Indian
Express is almost on doles from the govt. His senseless programme ‘Walk the
talk’ , the equivalent of ‘Koffee with Karan’ or ‘On the couch with Koel’,
continues on NDTV but what sunk SG the most is his misadventure with an article
on Army troop movements. In his quest to please SG’s UPA, this SG splashed a
headline in IE that nearly implied the army, led by Gen.VK Singh, may have
dreamt of a coup. Worse, there have been reports that the troop movement story
was stale and SG’s version was actually a plant by a union minister. SG laid an
egg alright but ended up with more on his face. He will forever be credited
with reducing a fiercely independent newspaper like IE to a mouthpiece of a
political party. His permanent place on this list is forever assured. 
I washed my hands in the Hammam
3. Rajdeep Sardesai (2010 #6):
Hmmm! The guy is making progress alright. I have always maintained there are
two Rajdeeps – One on TV and one off it. Whenever he is off TV his conscience
strikes and one can hear a sane person, sometimes profound, sometimes
emotional. But his character loses focus in front of the camera. Recently, he
lamented on Twitter about being abused as a’Muslim whore and a Motherf$#!#*’.
Bad, but the kind of abuse of journalistic ethics that Rajdeep has frequently
allowed under his watch is far more serious. He has even given the media the
right to ‘conduct hearings’ against personalities. While he wonders about
‘image makeovers’ for others, there is no way he can ever get past the
Cash4Votes bungling or the terribly biased reporting on Gujarat riots. His 2007
conduct of an HT Summit which featured a key speaker reflects a character of
pathetically low moral values and journalistic ethics. And to top that he
defended the tainted Radiagate journalists and was rightly ‘slapped’ by his own
community. Death of decent journalism owes a small debt to him. He has rightly
earned the nick name ‘Hammamboy’!
If it’s Friday, it must be…
2. Sagarika Ghose (2010 #2):
Ms. Cacofonix stays where she was: at No.2. You can’t fault Sagarika for not
trying hard enough to be India’s worst journalist. She has made every effort in
the recent past to get to #1. Journalism gives her a bad name. For her truly
pathetic and fraudulent ‘live’ show with SriSri she would have been sacked from
any TV channel in the world. That in itself is a reflection of the ethics and
morals practiced at CNN-IBN by her and her boss Rajdeep Sardesai. You can
imagine the skulduggery behind all other programmes and debates. And if that wasn’t
enough she misses no chance to prove she is a ‘journalistic bimbo’ by mindless
tweets on the social network. Be it about ‘ugly Indian males’, or Orange being
a colour in our national flag or sending out a Good Friday greeting and
withdrawing it she is truly the court-jester of Indian journalism. What can I
say? Better luck next time!
Me, Myself & I
1. Barkha Dutt (2010 #1):
For the second time in a row Barkha retains her position as India’s worst
journalist in the poll, by a whopping margin. The only road to redemption is
apologising for past blunders. While she and another one have been vocal in
demanding apologies and expressions of remorse from public figures the same
standard doesn’t seem to apply to her. No matter what she does the taint of Radiagate and many other indiscretions
are unlikely to disappear. The accusations of causing deaths in Kargil or in
26/11 are also going to linger.  She is probably
the only news celeb on TV that has a ‘wardrobe sponsor’. All the image makeovers may not help much. Most of us have held
Rahul Gandhi for the Congress’ UP election disaster but Barkha and NDTV must be
credited with the disaster too. No one has singularly promoted RG and his cause
and almost turned him into India’s saviour till the engine got derailed. Her penchant
for Pakistani politics and politicians is another thing that disgusts many
viewers. In the meantime her language keeps getting better and better. In a
recent tweet she responded to sarcasm with: “… ‘Nazi Dogs’ .. if ever language betrayed desperation of loser, it is
here
…” Losers or not, with over 70% of the votes polled, Barkha is the absolute winner here. Cheers!
So there you are. Let’s also not forget that are many journalists who
now increasingly seem to be anti-nationals. Their ties to Ghulam Nabi Fai aren’t
even being investigated by the govt. Industry leaders usually raise the
standards of performance of the industry as a whole. The opposite seems to be true
in the media. Systematically, many of India’s journalists have brought the
profession to rock bottom over the years. I continue to maintain, they are the
greatest threat to our democracy.