రేపటి నుంచే...
ప్రపంచ తెలుగు సదస్సులు
తిరుపతి, డిసెంబరు 26 : ప్రపంచ తెలుగు మహాసభలు గురువారం తిరుతిలో
అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆధ్యాత్మిక
కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య
విద్యాలయంలోని శ్రీ వేంకటేశ్వర ప్రాంగణం ప్రాంగణం వేదికగా 4వ ప్రపంచ
తెలుగు మహాసభలను లాంఛనంగా ప్రారంభిస్తారు. విశిష్ఠ అతిథిగా రాష్ట్ర
గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ పాల్గొనే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి
ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రులు,
రాష్ట్ర మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, అధికార భాషా సంఘం
అధ్యక్షుడు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొంటారు.
ఈ మహాసభలను
ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు
పూర్తి చేసింది. మహాసభల నేపథ్యంలో తిరుపతి పట్టణం సర్వాగసుందరంగా
ముస్తాబైంది. ప్రధాన వేదిక, ఉప వేదికలను అందంగా తీర్చిదిద్దారు.
ఫుడ్కోర్ట్స్, వాహనాల పార్కింగ్, సినిమాల ప్రదర్శనకు థియేటర్లు, నాటకాల
ప్రదర్శనకు థియేటర్లు, ఎగ్జిబిషన్లు, సెమినార్లు జరగడానికి వేదికలు వంటి
చోట్ల ఎటువంటి అసౌకర లేకుండా,
ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు
కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
అంచనా కంటే ప్రజలు, ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో అనుకోకుండా హాజరైన పక్షంలో
వారికి భోజన, వసతి సౌకర్యాల కల్పనకు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం
చేశారు. వీటికోసం కొన్ని కళ్యాణమండపాలు గుర్తించి, వంట ఏర్పాట్లు తదితర
అంశాలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రధాన వేదిక, ఉప వేదికలను రెయిన్
ప్రూఫింగ్ చేసి, వర్షం వచ్చినా.. ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉండేవిధంగా
ఏర్పాట్లు చేశారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు 3,500 మంది
కళాకారులు, వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాలు, రాష్ట్రం నుంచి 3,700 మంది
ప్రతినిధులు ఇప్పటికే నమోదు చేసుకోగా, వీరు కాకుండా విద్యాశాఖకు చెందిన
తెలుగు పండితులు, రీసెర్చ్ స్కాలర్స్, సాధారణ ప్రజానీకం పెద్ద ఎత్తున
పాల్గొనే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ప్రపంచ
తెలుగ మహాసభలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతున్నారు.
తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు చర్యలు
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పిల్లలు ఏ ప్రస్తుతం రాష్ట్రంలో
ప్రతి ఇంట్లో పిల్లలు ఏ మేరకు తెలుగు పట్ల అభిరుచి చూపుతున్నారు? సమాజంలో
తెలుగు భాష, సంస్కృతి ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభలలో చర్చించి వాటి
పరిరక్షణ ర్చించి వాటి పరిరక్షణకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
ఒకవైపు పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంపొందిస్తూ, మరోవైపు మన భాష, సంస్కృతి
పరిరక్షణకు వారిని సంసిద్ధం చేయవలసివ అవసరాన్ని ఈ సదస్సులు నొక్కి
వక్కానించనున్నాయి.
తెలుగు చరిత్రపై....
"దేశ భాషలందు
తెలుగు లెస్స'' అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన మాట - దక్షిణ భారతదేశంలోని
ఇతర భాషలన్నిటికంటె శ్రేష్ఠమైనదని తెలియపరుస్తుంది. క్రీ.పూ.5, 6
శతాబ్దాలనాటికే తెలుగు భాష ఉన్నట్లు శాస్త్రవేత్తలు రుజువుచేశారు.
క్రీ.పూ.3000-2500 సంవత్సరాలనాటికే ఒక భాషగా తెలుగు విలసిల్లిందని
తెలియజేసే శాసనాలు - కర్నూలు జిల్లా - ఓర్వకల్లు మండలంలోని కన్నమడకలో
పరిశోధకులు కనుగొన్నట్లు తెలుస్తుంది. దీనినిబట్టి తెలుగు భాష ఐదువేల ఏళ్ళ
చరిత్ర కలిగివుందని తెలుస్తోంది. భాషకు ప్రాచీన హోదా లభించింది. ఇందుకు
తెలుగు తెలుగువారందరు గర్విస్తున్నారు.
క్రీ.పూ. 300 నుండి
క్రీ.శ.200 సంవత్సరాల వరకు 500 సంవత్సరాలు పరిపాలించిన శాతవాహనుల కాలంలో
తెలుగుభాషకు, తెలుగు సాహిత్యానికి విశేష ఆదరణ లభించింది. వాస్తు, శిల్ప,
చిత్ర వాస్తు, శిల్ప, చిత్రలేఖనం, కళలు విలసిల్లాయి లేఖనం, కళలు
విలసిల్లాయి. 'బృహత్కథ', 'గాథాసప్తశతి' ఈకాలం నాటి సాహిత్య గ్రంథాలు.
స్త్రీలు కూడ కవిత్వం రాసేవారని 'గాథాసప్తశతి' వల్ల తెలుస్తుంది.
వ్రాసేవారని 'గాథాసప్తశతి' వల్ల తెలుస్తుంది. ఈ రెండు గ్రంథాల ద్వారా
తెలుగు వారి సంస్కృ విశేషాలు తెలియవస్తున్నాయి. శాతవాహనుల తరువాత పాలించిన
ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు మొదలైనవారి కాలంలో విద్య, భాషా
సారస్వతాలు విలసిల్లాయి. స్థూపాలు, దేవాలయాలు నిర్మితమయ్యాయి. ఇవి
తెలుగువారి శిల్పకళకు అద్దం పడుతున్నాయి. తూర్పు చాళుక్యులు క్రీ.శ. 6
నుండి 1000 వరకు పరిపాలించారు. ఆదికవి నన్నయ్య ఈ కాలంలో సంస్కృత
మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. తెలుగుభాషలో ఇదే మొదటి సాహిత్య
గ్రంథం. ఈ రచనకు ప్రోత్సహించిన రాజు -
రాజరాజు. ఆ తరువాత పాలించిన
వారు కాకతీయులు. క్రీ.శ.1001 నుండి 1300 వరకు 300 సంవత్సరాలు పాలించారు. ఈ
కాలంలో తెలుగుభాషలో పలు సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయి. ఆ తరువాత
రెడ్డిరాజులు, పద్మనాయకులు కొంతకాలం పాలించారు. రెడ్డి రాజుల కాలంలో తెలుగు
సాహిత్యం విలసిల్లింది. విజయనగర సామ్రాజ్యం 1336 నుండి 1680
వరకు
ఆంధ్రదేశంలో సాగింది. ఈ కాలంనాటి రాజుల్లో ప్రవ ఈ కాలంనాటి రాజుల్లో
ప్రముఖుడు శ్రీకృష్ణదేవరాయ. ఈయనకు 'సాహితీ సమరాంగణ సార్వభౌముడు' అనే
బిరుదు ఉంది. స్వయంగా కవి. 'ఆముక్త మాల్యద'ను రచించాడు. పెద్దన, తెనాలి
రామకృష్ణుడు మొదలైన అష్టదిగ్గజ కవులను తన ఆస్థానంలో పోషించాడు. తెలుగు
సాహిత్యంలో ఇది స్వర్ణయుగం. తంజావూరులో నాయక రాజుల పాలన సాగింది. వీరి
కాలంలోనూ సాహిత్యం, కళలు విలసిల్లాయి. రఘునాథనాయకుడు సంస్కృతంలోను,
తెలుగులోనూ గొప్ప కవి. ఆ తరువాత కుతుబ్షాహీలు 1512-1687 వరకు
పరిపాలించారు. వీరు తెలుగు కవి, పండితులను పోషించారు. నన్నయ నుండి
నేటివరకున్న కవులు, రచయితలు తెలుగు భాషా, సాహిత్యాలను సుసంపన్నం చేశారు.
ప్రపంచంలోని తెలుగువారంతా కలిసిమెలిసి తెలుగు భాషను, సంస్కృతిని,
విలువలను, తెలుగుదనాన్ని కాపాడుకుంటూ రాబోయే తరాల వారికి అందించడానికి కలి
రికి అందించడానికి కలిసికట్టుగా క లిలిసికట్టుగా కృషి చేస్తున్నామనన్న
సందేశాన్ని తిరుపతిలో డిసెంబరు 27, 28, 29 త నన్న సందేశాన్ని ప్రపంచ తెలుగు
మహా సభల వేదిక నుంచి ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది.
No comments:
Post a Comment